PM Modi: ‘‘మీరు ఊహించలేరు’’.. ప్రపంచానికి అర్థమయ్యేలా ఇంగ్లీష్లో మోడీ వార్నింగ్..
- ‘‘ఊహించని విధంగా శిక్షిస్తాం’’..
- ఉగ్రవాదులకు ప్రధాని మోడీ వార్నింగ్..
- ప్రపంచానికి అర్థమయ్యేలా ఇంగ్లీష్లో హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: పాకిస్తాన్, దాని ఉగ్రవాదులకు ప్రధాని నరేంద్రమోడీ మాస్ వార్నింగ్ ఇచ్చారు. గురువారం బీహార్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రపంచానికి తెలిసేలా సందేశం ఇచ్చారు. సభలో ఆయన హిందీలో మాట్లాడుతూ, ఒక్కసారిగా ఇంగ్లీష్కి మారిపోయారు. ప్రపంచవ్యాప్తంగా తన వార్నింగ్ అర్థమయ్యేలా ఇంగ్లీష్లో హెచ్చరికలు పంపారు.
‘‘బీహార్ నేల నుండి, నేను ప్రపంచానికి చెబుతున్నాను, భారతదేశం ప్రతి ఉగ్రవాదిని మరియు వారి వెనుక ఉన్నవారిని గుర్తించి మరీ శిక్షిస్తాం.’’ అని ఆయన అన్నారు. ఈ దాడి పాకిస్తాన్ ప్రమేయంతో జరిగిందని భారత్ విశ్వసిస్తోంది. ‘‘ మేము ఈ ఉగ్రవాదుల్ని ప్రపంచం చివర వరకు వెంబడిస్తాము. భారతదేశ స్పూర్తిని ఎప్పటికీ విచ్ఛిన్నం చేయలేరు. మొత్తం దేశం దృఢంగా ఉంది. మానవత్వాన్ని విశ్వసించే ప్రతీ ఒక్కరూ మాతో ఉన్నారు’’ అని ప్రధాని అన్నారు.
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
Read Also: MLC Kavitha: కాంగ్రెస్ నాయకుల్లారా ఖబర్దార్.. స్కూటీలు, బంగారం ఇస్తామని మోసం చేసారు..!
‘‘చాలా స్పష్టంగా చెప్పాలంటే, ఈ ఉగ్రవాదులు, దాడికి కుట్ర పన్నని వారు ఉహించలేని విధంగా శిక్షస్తాము’’ అని ప్రధాని వార్నింగ్ ఇచ్చారు. అయితే, హిందీలో మాట్లాడుతున్న ప్రధాని, ఈ వార్నింగ్ ఇచ్చే సమయంలో ఇంగ్లీష్లో ప్రసంగించారు. ప్రపంచానికి అర్థం అయ్యేలా తాము ఏం చేయబోతున్నామనేది వారికి తెలిసేందుకే, ప్రధాని నేరుగా ఇంగ్లీష్లో మాట్లాడినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ దాడిని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. అమెరికా, రష్యా అధినేతలు ప్రధాని మోడీని ఫోన్ చేసి సంతాపం వ్యక్తం చేశారు. సౌదీ అరేబియా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, ఇటలీ, ఇజ్రాయిల్ అన్ని దేశాలు పహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండించాయి. ఈ సమయంలో భారత్ వెంటే తాము ఉంటామని చెప్పాయి. ఇప్పటికే, పాకిస్తాన్ టార్గెట్గా భారత్ దౌత్యపరంగా దాడులు మొదలుపెట్టింది. ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దుతో పాటు, బోర్డర్ని క్లో జ్ చేసింది. పాక్ రాయబార కార్యాలయంలో సిబ్బంది సంఖ్యని తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
India will identify, track and punish every terrorist, their handlers and their backers.
We will pursue them to the ends of the earth.
India’s spirit will never be broken by terrorism. pic.twitter.com/sV3zk8gM94
— Narendra Modi (@narendramodi) April 24, 2025
తాజావార్తలు
-
Praggnanandhaa: తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ 2026 టైటిల్కైవసం
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!