Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Yasin Malik Claims Manmohan Singh Thanked Him Hafiz Saeed Meeting

Yasin Malik: హఫీజ్ సయీద్‌ని కలిసినందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ థాంక్స్ చెప్పారు.

Published Date :September 19, 2025 , 4:07 pm
By Venu Goapl Reddy
  • హఫీజ్ సయీద్‌తో మీటింగ్ తర్వాత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ థాంక్స్ చెప్పారు..
  • భారత అధికారుల ప్రమేయంతోనే హఫీజ్ సయీద్‌ను కలిశాను..
  • సంచలన విషయాలు బయటపెట్టిన ఉగ్రవాది యాసిన్ మాలిక్..
Yasin Malik: హఫీజ్ సయీద్‌ని కలిసినందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ థాంక్స్ చెప్పారు.
  • Follow Us :
  • google news
  • dailyhunt

Yasin Malik: ఉగ్రవాద నిధుల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(JKLF) ఉగ్రవాది యాసిన్ మాలిక్ సంచలన విషయాన్ని వెల్లడించారు. 2006లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా(LeT) చీఫ్, 26/11 దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను కలిసిన తర్వాత అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తనకు వ్యక్తిగతంగా థాంక్స్ చెప్పారని వెల్లడించారు. ఆగస్టు 25న ఢిల్లీ హైకోర్టులో సమర్పించిన అఫిడవిట్‌లో మాలిక్ ఈ విషయాన్ని పేర్కొన్నాడు. ఉగ్రవాదిని కలవడం తన వ్యక్తిగత చొరవ కాదని, పాకిస్తాన్‌తో తెర వెనక శాంతి ప్రక్రియలో భాగంగా భారత నిఘా అధికారుల అభ్యర్థన మేరకు జరిగిందని చెప్పారు.

అప్పటి ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) స్పెషల్ డైరెక్టర్ వీకే జోషి 2005లో కాశ్మీర్‌లో సంభవించిన భూకంపం తర్వాత పాకిస్తాన్ పర్యటనకు ముందు ఢిల్లీలో తనను కలిసినట్లు మాలిక్ చెప్పారు. పాకిస్తాన్ రాజకీయ నాయకత్వంతోనే కాకుండా, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ శాంతి ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి సయీద్‌ సహా ఉగ్రవాద వ్యక్తులతో చర్చలు జపడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని జోషి కోరినట్లు మాలిక్ చెప్పారు. ఉగ్రవాద నాయకులను చర్చల్లోకి తీసుకోకుంటే, పాకిస్తాన్ తో చర్చలు అర్థవంతంగా ఉండవని తనకు చెప్పినట్లు మాలిక్ పేర్కొన్నారు. ఈ అభ్యర్థన మేరకే, పాకిస్తాన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సయీద్‌తో పాటు యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ ఇతర నేతల్ని కలిసేందుకు తాను అంగీకరించినట్లు వెల్లడించారు.

Read Also: DUSU election: రాహుల్ గాంధీకి స్టూడెంట్స్ షాక్.. ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ABVP ఘనవిజయం..

మాలిక్ పాకిస్తాన్ పర్యటన తర్వాత, భారత్ వచ్చిన తర్వాత ఈ సమావేశాల గురించి వివరించారు. ఐబీ విచారణ తర్వాత, ప్రధానిమంత్రికి నేరుగా సమావేశాల గురించి వివరించాలని తనను అడిగినట్లు మాలిక్ పేర్కొన్నారు. ఢిల్లీలో అప్పటి జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణ్ సమక్షంలో మన్మోహన్ సింగ్‌ను కలిసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఉగ్రవాదులతో వ్యవహరించడంతో తాను చూపిన కృషి, సహనం, అంకిత భావాన్ని మన్మోహన్ సింగ్ కొనియాడారని, థాంక్స్ చెప్పారని వివరించారు.

ఈ అఫిడవిట్‌లో అటల్ బిహారీ వాజ్‌పేయి, సోనియా గాంధీ, పి. చిదంబరం, ఐకే గుజ్రాల్, రాజేష్ పైలట్ సహా అనేక మంది అగ్ర రాజకీయ నేతలతో తన సమావేశాల గురించి మాలిక్ సుదీర్ఘంగా ప్రస్తావించారు. మాలిక్ వాదనలు నిజమైతే, పాకిస్తాన్‌తో భారత్ శాంతి కోసం రహస్య పద్ధతులను ఎందుకు అనుసరించిందనే తీవ్రమైన ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. ప్రపంచంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని కలిసిన తర్వాత, భారత ప్రధాని థాంక్స్ చెప్పడం రాజకీయ రచ్చకు దారి తీయవచ్చు. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదాని నిధులతో పాటు 1990లో శ్రీనగర్‌లో నలుగురు భారత ఎయిర్ ఫోర్స్‌కు చెందిన వారిని మాలిక్ హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర హోం మంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కుమార్తె రూబియా సయీద్ కిడ్నాప్‌ చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hafiz Saeed
  • india- pakistan relations
  • Intelligence Bureau
  • jklf
  • Kashmir Militancy

తాజావార్తలు

  • CM Revanth Reddy: సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. రూ.225 కోట్లతో బాసర అభివృద్ధి!

  • Harish Rao: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి.. మాజీ మంత్రి హరీష్‌రావు మాస్ రియాక్షన్..

  • Ramayan: ‘రామాయణ్’ రన్‌టైమ్ లీక్ చేసిన రణ్‌బీర్..

  • Raakaasaa:సంగీత్ శోభన్ ఖాతాలో మరో హిట్? ‘రాకాస’ మొదటి రోజు వసూళ్లు ఇవే!

  • Rahul Gandhi: మోడీ ఇప్పుడు ట్రంప్ నియంత్రణలో ఉన్నారు.. కేరళ ప్రచారంలో రాహుల్ గాంధీ విసుర్లు

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions