DUSU election: రాహుల్ గాంధీకి స్టూడెంట్స్ షాక్.. ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ABVP ఘనవిజయం..
- ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో కాంగ్రెస్కు భారీ షాక్..
- అధ్యక్ష పదవితో సహా మూడు కీలక పోస్టుల్లో ఏబీవీపీ ఘన విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DUSU election: కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు భారీ షాక్ ఇచ్చారు. దేశంలో ప్రతిష్టాత్మక ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్(DUSU) ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి సంఘం(ABVP) సత్తా చాటింది. నాలుగు టాప్ పోస్టుల్లో మూడింటిని గెలుచుకుంది. కాంగ్రెస్ విద్యార్థి సంఘం-స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(NSUI) కేవలం వైస్ ప్రెసిడెంట్ స్థానాన్ని గెలుచుకుంది. ‘‘ఓట్ చోరీ’’ ఆరోపణలపై నిన్న రాహుల్ గాంధీ జెన్-జీ యువతను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. అయితే, తాజాగా నెటిజన్లు ఢిల్లీ వర్సిటీ ఎన్నికల ఫలితాలను చూస్తే యువత బీజేపీ వైపే ఉన్నట్లు అర్థమవుతోందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
ఏబీవీపీకి చెందిన ఆర్యన్ మాన్ అధ్యక్ష పదవిని గెలుచుకున్నారు. ఎన్ఎస్యూఐకి చెందిన జోస్లిన్ చౌదరిపై భారీ తేడాతో గెలుపొందారు. ఇదే విధంగా ఏబీవీపీకి చెందిన కునాల్ చైదరి, , దీపికా ఝాలు కార్యదర్శి, జాయింట్ సెక్రటరీ పదవుల్ని సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ మద్దతు ఉన్న ఎన్ఎస్యూఐ కేవలం ఉపాధ్యక్ష పదవిని గెలుచుకుంది. రాహుల్ ఘన్స్లాపై వైస్ ప్రెసిడెంట్గా గెలుపొందారు.
Also Read
- Sonam Wangchuk Hunger Strike: 20వ రోజుకు సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష.. అవయవ వైఫల్యం ముప్పు.. దీక్ష విరమణకు ససేమిరా..
- NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్కార్డ్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
Read Also: Sam Pitroda: ‘‘పాకిస్తాన్ వెళ్లాను, ఇంట్లో ఉన్నట్లు ఉంది’’.. రాహుల్ గాంధీ సన్నిహితుడు..
ఏబీవీపీకి చెందిన ఆర్యన్ మాన్ 28,841 ఓట్లు సాధిస్తే, ఎన్ఎస్యూఐకి చెందిన జోస్లిన్ చౌదరి 12,645 ఓట్లు సాధించారు. ఎస్ఎఫ్ఐ-ఏఐఎస్ఏ అభ్యర్తి 5,385 ఓట్లు పొందారు. గురువారం జరిగిన ఈ ఎన్నికల్లో యూనివర్సిటీ ఆధ్వర్యంలోని 50కి పైగా కాలేజీలకు చెందిన 2.75 లక్షల మంది విద్యార్థులు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. 195 బూత్లతో 52 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. 711 ఈవీఎం యంత్రాలను వాడారు.
కీలక విజేతలు:
అధ్యక్షుడు: ఆర్యన్ మాన్ (ABVP)
వైస్ ప్రెసిడెంట్: రాహుల్ ఝాన్స్లా (NSUI)
కార్యదర్శి: కునాల్ చౌదరి (ABVP)
జాయింట్ సెక్రటరీ: దీపికా ఝా (ABVP)
తాజావార్తలు
-
TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Lenovo Legion R9000P: ప్రపంచంలోనే తొలి IJP OLED డిస్ప్లేతో.. లెనోవో Legion R9000P రిలీజ్
-
Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!