Delhi Floods: యమునా నది ఉధృతం.. ఇళ్లల్లోకి వచ్చేసిన నీరు.. స్కూళ్లు, ఆఫీసులు మూసివేత
- ఢిల్లీలో యమునా నది ఉధృతం
- ఇళ్లల్లోకి వచ్చేసిన నీరు
- స్కూళ్లు, ఆఫీసులు మూసివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ను భారీ వరదలు ముంచెత్తాయి. సోమవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రధాన ప్రాంతాలన్నీ అతలాకుతలం అయ్యాయి. రహదారులన్నీ నదులు తలపిస్తున్నాయి. ఎటుచూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. దీంతో పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది. ఇక గురుగ్రామ్లో అయితే 7 కి.మీ పైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు నరకయాతన పడ్డారు.
ఇది కూడా చదవండి: UP: యూపీలో ఘోరం.. చెల్లిని ప్రేమించాడని ఓ అన్నయ్య ఘాతుకం.. ప్రియుడిని బయటకు తీసుకెళ్లి..!
Also Read
- Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
- Su-57 fighter jet: భారత్కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్పై కీలక ప్రతిపాదన..
- Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
ఇక భారీ వర్షాలు కారణంగా యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రమాద స్థాయిని దాటి ఉప్పొంగుతోంది. దీంతో వరద నీరు ఇళ్లల్లోకి వచ్చేసింది. ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచిస్తున్నారు. సాయంత్రానికి యమునా నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని.. తక్షణమే లోతట్టు ప్రాంత ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Gurgaon: భారీ వర్షంతో గురుగ్రామ్ అతలాకుతలం.. 7 కి.మీ ట్రాఫిక్ జామ్.. వాహనదారులు బెంబేలు
యమునా నదితో పాటు మరికొన్ని నదుల నీటి మట్టాలు కూడా భారీ పెరిగాయి. దీంతో యమునానగర్ జిల్లాలోని హత్నికుండ్ బ్యారేజీ వరద గేట్లను అధికారులు ఎత్తేశారు. దీంతో ముందు జాగ్రత్తగా మంగళవారం పాఠశాలలు మూసేయాలని అధికారులు ఆదేశించారు. ఇక సెప్టెంబర్ 5 వరకు ఫీల్డ్ ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండాలని హర్యానా ప్రభుత్వం ఆదేశించింది. ఇక ప్రజలు భయాందోళనకు గురి కావొద్దని ముఖ్యమంత్రి రేఖా గుప్తా కోరారు. నది పర్యావరణ వ్యవస్థలో భాగంగానే యమునా నీరు మైదనంలోకి వస్తుందని చెప్పారు.
మంగళవారం తెల్లవారుజామున యమునా నది నీటి మట్టం ప్రమాద స్థాయి 205.33 మీటర్లు దాటింది. సాయంత్రం నాటికి నీటి మట్టం 206.50 మీటర్లకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేశారు. సోమవారం కేవలం నాలుగు గంటల్లోనే గురుగ్రామ్లో 100 మి.మీ.కు పైగా వర్షం కురిసింది. దీంతో హీరో హోండా చౌక్-ద్వారకా ఎక్స్ప్రెస్వే వంటి కీలక ప్రాంతాలు జలమయం అయ్యాయి.

ఇక మంగళవారం కూడా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబర్ 4 వరకు ఢిల్లీలో ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది. ప్రతిరోజూ వర్షాలు ఉంటాయని చెప్పింది. ఇక వర్షాలు కారణంగా ఉద్యోగులంతా ఇళ్ల నుంచే పని చేయాలని అధికారులు కోరారు.
#WATCH | Delhi | Drone visuals from Loha Pul, where the Yamuna River is flowing above the danger level following incessant rainfall since yesterday
Traffic and public movement on Loha Pul to be stopped from 5 pm on 2nd September due to rising water level in the Yamuna River, as… pic.twitter.com/HrLrbbKsj3
— ANI (@ANI) September 2, 2025
తాజావార్తలు
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
-
AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
-
Su-57 fighter jet: భారత్కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్పై కీలక ప్రతిపాదన..
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!