New Delhi: ప్రమాదస్థాయిని దాటిన యమునా .. పునరావాస చర్యల్లో ప్రభుత్వాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Delhi: నైరుతి రుతపవనాలతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఢిల్లీలో యమునా నీటిమట్టం మరోసారి ప్రమాదస్థాయిని దాటింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నీటిమట్టం 205.34 మీటర్లకు చేరుకోగా, రాత్రి వరకు పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా సహా యమునా ఎగువ పరివాహక ప్రాంతాలలో భారీ వర్షాలు రికార్డు స్థాయిలో కురుస్తుండటంతో యమునా నది ఉప్పెనకు దారితీశాయి. యమునా నది నీటిమట్టం శుక్రవారం మరోసారి 205.33 మీటర్ల ప్రమాద స్థాయిని దాటడంతో వరద ప్రభావిత లోతట్టు ప్రాంతాల్లో పునరావాస చర్యలు మరింత ఆలస్యమయ్యాయి. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నీటిమట్టం 205.34 మీటర్లకు చేరుకుందనీ.. యమునా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో, ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో కురుస్తున్న వర్షాలతో గత రెండు మూడు రోజులుగా నీటి మట్టంలో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.
Read also: PM Modi: నేడు దేశవ్యాప్తంగా ఉపాధి మేళా.. 70 వేల మందికి అపాయింట్ మెంట్ లెటర్స్
Also Read
- Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
యమునా నది జూలై 13న ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి 208.66 మీటర్లకు చేరిన తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఎనిమిది రోజులుగా ఎగువన ప్రవహిస్తున్న నీటి మట్టం మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రమాదస్థాయికి దిగువకు పడిపోయింది. బుధవారం వేకువజామున 205 గంటలకు 22.5 మీటర్లకు పడిపోయి మళ్లీ పైకి లేచి ప్రమాదస్థాయిని దాటింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ నెల 22 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. వజీరాబాద్ వద్ద పంపుహౌస్ మునిగిపోవడంతో నాలుగైదు రోజులుగా నగరంలో నీటి సరఫరాపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ పంప్ హౌస్ వజీరాబాద్, చంద్రవాల్, ఓఖ్లా వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లకు నీటిని సరఫరా చేస్తుంది. పల్లా వద్ద నది వరద మైదానంలోని కొన్ని గొట్టపు బావులు మునిగిపోవడం వల్ల రోజుకు 10-12 మిలియన్ గ్యాలన్ల (ఎంజిడి) నీటి కొరత ఉందని ఢిల్లీ జలమండలి (డీజేబీ) అధికారులు తెలిపారు. పల్లా వరద మైదానంలో ఏర్పాటు చేసిన గొట్టపు బావుల నుంచి డీజేబీ సుమారు 30 ఎంజీడీలను వెలికితీస్తుంది. వారం రోజులుగా ఢిల్లీలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తొలుత జూలై 8, 9 తేదీల్లో కురిసిన వర్షానికి రెండు రోజుల్లోనే 125 శాతం వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా సహా యమునా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో యమునా నది ఉప్పొంగి రికార్డు స్థాయిలో ప్రవహిస్తోంది.
తాజావార్తలు
-
LA Olympics 2028: ఒలింపిక్స్కు టీమిండియా చేరాలంటే ఇదే మార్గం.. నంబర్వన్గా నిలవాలి, విఫలమైతే మరో అవకాశం!
-
WhatsApp Custom Username: ప్రైవసీ బూస్ట్!.. వాట్సాప్ 3 బిలియన్ యూజర్ల కోసం కస్టమ్ యూజర్నేమ్.. పూర్తి వివరాలు
-
Ben Stokes: “నేను మానసికంగా అలసిపోయాను”.. రిటైర్మెంట్పై నోరు విప్పిన బెన్ స్టోక్స్..
-
Biggest Multistarrer : 18 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్న ఇద్దరు స్టార్ హీరోలు
-
Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!