Uniform Civil Code: యూసీసీ వ్యతిరేకిస్తున్నాం..మా వ్యక్తిగత చట్టాలకే మేం కట్టుబడతాం.. స్పష్టం చేసి జమియత్ చీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uniform Civil Code: కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి(యూనిఫాం సివిల్ కోడ్(UCC))ని తీసుకురావడానికి కసరత్తు ప్రారంభించింది. 2024 ఎన్నికల ముందు యూనిఫాం సివిల్ కోడ్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకు లా కమిషన్ సంప్రదింపులను ప్రారంభించింది. అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ యూనిఫాం సివిల్ కోడ్ పై అత్యున్నత ఇస్లామిక్ సంస్థ అయి జమియల్ చీఫ్ అర్షద్ మదానీ స్పందించారు.
యూసీసీని తాము వ్యతిరేకిస్తున్నామని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్దమని, అయితే దీన్ని వ్యతిరేకించేందుకు వీధుల్లోకి వెళ్లి నిరసన చెపట్టమని అర్షద్ మదానీ ఆదివారం అన్నారు. మాకు గత 1300 ఏళ్లుగా వ్యతిగత చట్టాలు ఉన్నాయి. మేము వాటికి కట్టుబడి ఉంటామని, స్వాతంత్య్రం తరువాత ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయలేదని ఆయన అన్నారు. ప్రస్తుతం యూసీసీ అవసరం లేదని, దీని వల్ల నిరసనలు జరుగాయని, హిందువులకు, ముస్లింలు దూరం అవుతారని తెలిపారు. దీని వల్ల కొంతమంది వ్యక్తుల దురుద్దేశ లక్ష్యం నెరవేరుతుందని మదానీ చెప్పారు.
Also Read
- Supreme Court: రెబల్ ఎంపీలపై పోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న టీఎంసీ
- India-Nepal Border Dispute: భారత్తో సరిహద్దు వివాదం.. ఒప్పంద పత్రాలు పోగొట్టుకున్న నేపాల్..
- Kangana Ranaut: హరియాలీ తీజ్ వేడుకల్లో కంగనా రనౌత్తో కలిసి డ్యాన్స్ చేసిన ముఖ్యమంత్రి
- Uttar Pradesh: మహిళలకు రూ.50,000.. సంచలన నిర్ణయం దిశగా యోగి సర్కార్..
Read Also: Pakistan: ప్రధాని మోడీ అమెరికా పర్యటనపై పాకిస్తాన్ కీలక వ్యాఖ్యలు..
ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మౌలానా తౌకీర్ రజా ఖాన్ మాట్లాడుతూ.. యూసీసీ అమలు చేయడం బీజేపీకి ఎన్నికల్లో గెలిచే ఒక సాధనం మాత్రమే అని అన్నారు. యూసీసీ అనవసరమైనదని, ఆచరణీయం కాదని, దేశానికి అత్యంత హానికరమైనదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు పేర్కొంది. ముస్లిం వ్యక్తిగత చట్టాలు ఖురాన్, సున్నత్ నుంచి ఉద్భవించాయి, అందువల్ల ముస్లింలకు కూడా ఎటువంటి మార్పులు చేయడానికి అధికారం లేదని బోర్డు తన వైఖరిని చెబుతోంది. ప్రభుత్వం తీసుకువచ్చే చట్టాలు గందరగోళం, అస్తవ్యస్తతకు దారి తీస్తాయని, ఇది బుద్ది ఉన్న ప్రభుత్వం చేసే చర్య కాదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విపక్షాలు మండిపడ్డాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ.. ఈ అంశంపై మునపటి లా కమిషన్ 2018లో సంప్రదింపుల నివేదిక ప్రచురించిందని, అయితే తాజా సంప్రదింపుల ఎందుకు అవసరం అవుతాయో ప్రస్తుత లా కమిషన్ స్పష్టం చేయలేదని అన్నారు.
తాజావార్తలు
-
Supreme Court: రెబల్ ఎంపీలపై పోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న టీఎంసీ
-
India-Nepal Border Dispute: భారత్తో సరిహద్దు వివాదం.. ఒప్పంద పత్రాలు పోగొట్టుకున్న నేపాల్..
-
Kangana Ranaut: హరియాలీ తీజ్ వేడుకల్లో కంగనా రనౌత్తో కలిసి డ్యాన్స్ చేసిన ముఖ్యమంత్రి
-
Prashanth Neel: ‘డ్రాగన్’ షూటింగ్కు బ్రేక్.. ప్రభాస్తో ‘సలార్-2’ మొదలుపెట్టనున్న ప్రశాంత్ నీల్?
-
CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!