MK Stalin: రూ. 10,000 కోట్లు ఇచ్చినా ఆ పని చేయను.. ‘‘ఎన్ఈపీ’’పై స్టాలిన్..
- రూ.10,000 కోట్లు ఇచ్చినా ఆ పని చేయను..
- ఎన్ఈపీ అమలుపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు..
- కేంద్రం, తమిళనాడు మధ్య ‘‘హిందీ’’ వివాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MK Stalin: జాతీయ విద్యా విధానం (NEP)పై గత కొన్ని రోజులుగా కేంద్రం, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య గొడవ జరుగుతోంది. తమ రాష్ట్రంపై బలవంతంగా ‘‘హిందీ’’ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు. తాను ఈ NEPకి వ్యతిరేకంగా తన వైఖరిపై రాజీ పడలేనని చెప్పారు. రూ.10,000 కోట్లు ఇచ్చినా కూడా తమిళనాడులో దీనిని అమలు చేయమని చెప్పారు.
చెంగల్పట్టులో జరిగిన ఒక కార్యక్రమంలో స్టాలిన్ మాట్లాడుతూ, విద్య, మహిళల అభ్యున్నతికి సంబంధించి తమిళనాడు మార్గదర్శకంగా ఉందని, తక్కువ అడ్డంకులు ఉంటే రాష్ట్రం మరింత మెరుగ్గా రాణించగలదని అన్నారు. ‘‘ నిన్న పార్లమెంట్లో ఏం జరిగిందో మీరంతా చూసే ఉంటారు. తమిళనాడుకు అందించాల్సిన నిధులు రాష్ట్రంలో త్రిభాషా సూత్రాన్ని వర్తింపచేసి, హిందీ మరియు సంస్కృతాన్ని అంగీకరించడం ద్వారా మాత్రమే విడుదల చేస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అహంకారంలో అన్నారు’’ అని స్టాలిన్ ఆరోపించారు.
Also Read
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
- Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
- Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
Read Also: Bajaj GoGo EV: లాంగ్ రేంజ్తో.. బజాజ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ ఆటో విడుదల
కేంద్రం తమిళనాడు విద్యా విధానాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నారని, మేము దానిని వ్యతిరేకిస్తున్నామని స్టాలిన్ చెప్పారు. విద్యార్థులను విద్యకు అందించే బదులు, విద్యకు దూరం చేయడానికి జాతీయ విద్యావిధానాన్ని తీసుకువచ్చారని దుయ్యబట్టారు. విద్యను ప్రవేటీకరించడం, ఉన్నత విద్యను ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉంచడం, విద్యలో మతాన్ని ప్రవేశపెట్టడం, నీట్ పరీక్షలు తీసుకురావడం, విద్యలో కేంద్రానికి మరింత అధికారాన్ని ఇవ్వడానికి దీనిని తీసుకువచ్చారని ఆరోపించారు. కేంద్ర విద్యా మంత్రి తమిళనాడును బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ మండిపడ్డారు.
‘‘నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా, కేవలం రూ. 2,000 కోట్లు కాదు, మీరు రూ. 10,000 కోట్లు ఇచ్చినా మేము మీ వినాశకరమైన నాగ్పూర్ పథకాన్ని అంగీకరించము. ఈ వేదికపై నేను దానిని మళ్ళీ పునరావృతం చేస్తున్నాను’’ అని స్టాలిన్ ప్రకటించారు. ఎన్ఈపీని ఆర్ఎస్ఎస్ ఎజెండాగా ఆరోపించారు. కేంద్రం విద్యా శాఖ మంత్రి తమిళుల పట్ల ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నారని స్టాలిన్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Dhurandhar 2: ‘ధురంధర్ 2’ OTT రిలీజ్పై ట్విస్ట్..
-
NBK111 : ‘బాలయ్య – నర్గిస్ ఫక్రి’ దబిడి.. దిబిడి.. షూటింగ్ ఫినిష్.. టీజర్ ఎప్పుడంటే?
-
NPS Sanchay Yojana: NPS సంచయ్ యోజన.. ఖాతా ఎలా తెరవాలి? ఎవరికీ ఉపయోగం? పూర్తి వివరాలు
-
Karuppu : ఫైనాన్స్ అడ్డంకులు తొలగి థియేటర్లలోకి వచ్చిన సూర్య ‘కరుప్పు’
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
ట్రెండింగ్
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!