Harassment: విమానంలో మహిళని లైంగికంగా వేధించిన జిందాల్ ఉద్యోగి.. స్పందించిన నవీన్ జిందాల్..
- విమానంలో మహిళని లైంగికంగా వేధించిన జిందాల్ ఉద్యోగి..
- భయకరమైన అనుభవాన్ని షేర్ చేసుకున్న మహిళ..
- తప్పకుండా చర్యలు తీసుకుంటామని నవీన్ జిందాల్ హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harassment: కోల్కతా నుంచి అబుదాబి వెళ్తున్న విమానంలో ఓ మహిళని జిందాల్ గ్రూప్ ఉద్యోగి వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. తనకు జరిగిన భయంకరమైన అనుభవాన్ని సదరు బాధిత మహిళ ఎక్స్ వేదికగా వెల్లడించింది. జిందాల్ గ్రూప్ కంపెనీకి చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒక మహిళకు పోర్న్ క్లిప్లు చూపించి, అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. 65 ఏళ్ల జిందాల్ టాప్ ఎగ్జిక్యూటివ్ దినేష్ కుమార్ సరోగి తనతో అసభ్యంగా ప్రవర్తించిన తీరును సదరు మహిళ చెప్పుకొచ్చింది.
ముందుగా తనను తాను జిందాల్ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడని, తాను బోస్టన్ వెళ్లేందుకు అబుదాబిలో ట్రాన్సిట్ ఫ్లైట్ తీసుకుంటానని తాను అతడికి చెప్పానని మహిళ వెల్లడించింది. తాను జిందాల్ గ్రూప్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నానని చెప్పుకున్న సరోగి, తనది రాజస్థాన్ చరు జిల్లా అని, వివాహం ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారిద్దరు అమెరికాలో సెటిల్ అయినట్లు మహిళకు చెప్పాడు.
Also Read
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
- Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
Read Also: Karnataka video: ఇళ్ల మధ్యకు వచ్చేసిన భారీ కింగ్ కోబ్రా.. బెంబేలెత్తిపోయిన ప్రజలు
ఇద్దరి మధ్య సంభాషణలు ముందుగా బాగానే సాగాయి. అయితే, తన ఫోన్లో కొన్ని క్లిప్స్ ఉన్నాయని చెప్పిన సరయోగి, పోర్న్ వీడియోలు చూపించేందుకు ప్రయత్నించాడని, అతను తనను గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నించాడని, తాను భయంతో వాష్రూం వైపు పరిగెత్తానని, తర్వాత ఎయిర్ సిబ్బందికి ఫిర్యాదు చేసినట్లు మహిళ తన భయంకరమైన క్షణాలను వెల్లడించారు. వెంటనే స్పందించిన సిబ్బంది తనకు వేరే సీటు కేటాయించారని చెప్పారు. తాను వేరే సీటుకి మారిన తర్వాత కూడా, ఆ మహిళ ఎక్కడికి వెళ్లిందని విమాన సిబ్బందిని పదేపదే అడుగుతూనే ఉన్నాడని చెప్పుకొచ్చింది. ఈ విషయాలను ఆమె ఎక్స్లో జిందాల్ గ్రూప్ అధినేత నవీన్ జిందాల్ని ట్యాగ్ చేసింది.
మహిళ ఫిర్యాదుపై బీజేపీ ఎంపీ, సంస్థ అధినేత నవీన్ జిందాల్ స్పందించారు. తమ సంస్థ ఇలాంటి విషయాలను సహించేదే లేదని చెబుతూనే, చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ‘‘ మీరు ఈ విషయాన్ని చెప్పినందుకు ధన్యవాదాలు.. మీరు చేసిన పనిని చేయడానికి చాలా ధైర్యం కావాలి మరియు అలాంటి విషయాల పట్ల మాకు జీరో టాలరెన్స్ పాలసీ ఉంది. ఈ విషయాన్ని వెంటనే విచారించాలని నేను బృందాన్ని కోరాను. కఠినమైన మరియు అవసరమైన చర్యలు తీసుకోబడతాయి’’ అని ఆయన చెప్పారు. మిస్టర్ జిందాల్కు కృతజ్ఞతలు తెలుపిన ఆ మహిళ, తాను చర్య కోసం ఎదురు చూస్తున్నానని చెప్పింది.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!