Harassment: విమానంలో మహిళని లైంగికంగా వేధించిన జిందాల్ ఉద్యోగి.. స్పందించిన నవీన్ జిందాల్..
- విమానంలో మహిళని లైంగికంగా వేధించిన జిందాల్ ఉద్యోగి..
- భయకరమైన అనుభవాన్ని షేర్ చేసుకున్న మహిళ..
- తప్పకుండా చర్యలు తీసుకుంటామని నవీన్ జిందాల్ హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harassment: కోల్కతా నుంచి అబుదాబి వెళ్తున్న విమానంలో ఓ మహిళని జిందాల్ గ్రూప్ ఉద్యోగి వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. తనకు జరిగిన భయంకరమైన అనుభవాన్ని సదరు బాధిత మహిళ ఎక్స్ వేదికగా వెల్లడించింది. జిందాల్ గ్రూప్ కంపెనీకి చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒక మహిళకు పోర్న్ క్లిప్లు చూపించి, అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. 65 ఏళ్ల జిందాల్ టాప్ ఎగ్జిక్యూటివ్ దినేష్ కుమార్ సరోగి తనతో అసభ్యంగా ప్రవర్తించిన తీరును సదరు మహిళ చెప్పుకొచ్చింది.
ముందుగా తనను తాను జిందాల్ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడని, తాను బోస్టన్ వెళ్లేందుకు అబుదాబిలో ట్రాన్సిట్ ఫ్లైట్ తీసుకుంటానని తాను అతడికి చెప్పానని మహిళ వెల్లడించింది. తాను జిందాల్ గ్రూప్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నానని చెప్పుకున్న సరోగి, తనది రాజస్థాన్ చరు జిల్లా అని, వివాహం ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారిద్దరు అమెరికాలో సెటిల్ అయినట్లు మహిళకు చెప్పాడు.
Also Read
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
- Age Limit Increased: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి పెంపు
- KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
Read Also: Karnataka video: ఇళ్ల మధ్యకు వచ్చేసిన భారీ కింగ్ కోబ్రా.. బెంబేలెత్తిపోయిన ప్రజలు
ఇద్దరి మధ్య సంభాషణలు ముందుగా బాగానే సాగాయి. అయితే, తన ఫోన్లో కొన్ని క్లిప్స్ ఉన్నాయని చెప్పిన సరయోగి, పోర్న్ వీడియోలు చూపించేందుకు ప్రయత్నించాడని, అతను తనను గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నించాడని, తాను భయంతో వాష్రూం వైపు పరిగెత్తానని, తర్వాత ఎయిర్ సిబ్బందికి ఫిర్యాదు చేసినట్లు మహిళ తన భయంకరమైన క్షణాలను వెల్లడించారు. వెంటనే స్పందించిన సిబ్బంది తనకు వేరే సీటు కేటాయించారని చెప్పారు. తాను వేరే సీటుకి మారిన తర్వాత కూడా, ఆ మహిళ ఎక్కడికి వెళ్లిందని విమాన సిబ్బందిని పదేపదే అడుగుతూనే ఉన్నాడని చెప్పుకొచ్చింది. ఈ విషయాలను ఆమె ఎక్స్లో జిందాల్ గ్రూప్ అధినేత నవీన్ జిందాల్ని ట్యాగ్ చేసింది.
మహిళ ఫిర్యాదుపై బీజేపీ ఎంపీ, సంస్థ అధినేత నవీన్ జిందాల్ స్పందించారు. తమ సంస్థ ఇలాంటి విషయాలను సహించేదే లేదని చెబుతూనే, చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ‘‘ మీరు ఈ విషయాన్ని చెప్పినందుకు ధన్యవాదాలు.. మీరు చేసిన పనిని చేయడానికి చాలా ధైర్యం కావాలి మరియు అలాంటి విషయాల పట్ల మాకు జీరో టాలరెన్స్ పాలసీ ఉంది. ఈ విషయాన్ని వెంటనే విచారించాలని నేను బృందాన్ని కోరాను. కఠినమైన మరియు అవసరమైన చర్యలు తీసుకోబడతాయి’’ అని ఆయన చెప్పారు. మిస్టర్ జిందాల్కు కృతజ్ఞతలు తెలుపిన ఆ మహిళ, తాను చర్య కోసం ఎదురు చూస్తున్నానని చెప్పింది.
తాజావార్తలు
-
NTRNeel :’డ్రాగన్’ గ్లిమ్స్ అనుకున్న టైమ్ కంటే ఇంకాస్త ముందుగానే
-
Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
-
IPL 2026 playoff scenarios: నేడు కీలక మ్యాచ్.. సీఎస్కే-ఎస్ఆర్హెచ్ పోరుతో మారనున్న ప్లేఆఫ్స్ సమీకరణాలు!
-
Sattu Chaas Recipe: మండుటెండలో కూల్గా ఉండాలా..? ప్రోటీన్ పవర్తో ‘సత్తు ఛాస్’ తాగండి!.. సింపుల్గా తయారు చేయండి..
-
Raghava Lawrence: రాజ్ మోహన్పై ట్రోల్స్.. విజయ్కు అండగా లారెన్స్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..