Puducherry: తన కొడుకే ఫస్ట్ రావాలని.. వేరే విద్యార్థికి విషమిచ్చి చంపిన తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
woman killed son’s classmate in Puducherry:
అభం శుభం తెలియని పసివాడు.. బాగా చదువుకోవడమే అతను చేసిన తప్పయింది. ఓ పిల్లాడి తల్లికి కోపం వచ్చింది.. అసూయ కలిగింది. నా కొడుకు కంటే బాగా చదువుతావా.,. నీ పని చెబుతా అంటూ అతని మీద దాష్టీకం చూపించింది. శీతలపానీయంలో విషం కలిపి ఇచ్చిందో తల్లి… పుదుచ్చేరిలోని కారైక్కాల్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఘటన జరిగింది. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు సహాయరాణి విక్టోరియాను అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి చికిత్స పొందుతూ 8 తరగతి విద్యార్థి మణికందన్ మృతిచెందడం మరింత విషాదం నింపింది.
తన కొడుకు ఆనందం కోసం మరొకరి కొడుకును దారుణంగా చంపింది. తన కొడుకు కన్నా ఎక్కువ మార్కులు రావడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ మహిళ ఏకంగా.. ఓ విద్యార్థినే విషమిచ్చి చంపింది. కొడుకు క్లాస్మెట్ను కొడుకులాగే చూసుకోవాలనే సోయి మరిచి ప్రవర్తించింది. చివరకు కటకటాల పాలైంది. ఈ దారుణ ఘటన పుదుచ్చేరిలో జరిగింది. తన కుమారుడు క్లాస్ ఫస్ట్ రావాలనే ఉద్దేశ్యంతోనే మహిళ ఇలా చేసిందని పోలీస్ విచారణలో తేలింది. సమాజంలో పెరిగిపోతున్న మార్కుల ధోరణి తల్లిదండ్రులను, విద్యార్థులను ఏ విధంగా మారుస్తున్నాయో చూపేలా ఈ ఘటన ఉంది.
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
Read Also: Odisha: ప్రియురాలి గొంతు కోసి హత్య.. నిందితుడి ఆత్మహత్యాయత్నం
పూర్తి వివరాల్లోకి వెళితే.. పుదుచ్చేరి కారైక్కల్ లో ఈ ఘటన జరిగింది. తన కుమారుడి కన్నా ఎక్కవ మార్కులు వస్తున్నాయని సదరు మహిళ కూల్ డ్రింక్ లో విషం ఇచ్చి చంపేసింది. 8వ తరగతి చదువుతున్న రాజేంద్రన్- మాలతి కుమారుడికి స్కూల్ వాచ్మెన్ ద్వారా విషం కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చింది. ఆ తరువాత విద్యార్థి మణికందన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అయితే వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ మరణించాడు మణికందన్.
సీసీ పుటేజీ ద్వారా ఈ కుట్రకు పాల్పడిన సహాయరాణి విక్టోరియాను గుర్తించారు. ఆమెను అరెస్ట్ చేశారు. మొదటి నుంచి తరగతిలో ఫస్ట్ వచ్చే తన కుమారుడిని పక్కకు తోసి రాజేంద్రన్-మాలతిల కుమారుడు ఫస్ట్ వస్తున్నాడనే కోపంతోనే విషమిచ్చానని నిందితురాలు అంగీకరించింది.
తాజావార్తలు
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!