Dowry Harassment: పెళ్లైన ఏడాదికే వివాహిత ఆత్మహత్య.. ఆ వేధింపులు భరించలేకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Commits Suicide Due To Dowry Harassment In Karnataka: పెళ్లి తర్వాత తన జీవితం ఎంతో గొప్పగా ఉంటుందని, అత్తారింట్లో చాలా ఎగ్జైటింగ్గా లైఫ్ సాగుతుందని ఆ యువతి ఎన్నో కలలు కంది. తాను కలలు గన్న రాకుమారుడే భర్తగా వచ్చాడని భావించి, అతనితో సరికొత్త జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆశించింది. కానీ.. పెళ్లైన కొన్నాళ్లకే ఆ యువతి కోరికలన్నీ నీరుగారిపోయాయి. తాను పెళ్లి చేసుకుంది రాకుమారుడ్ని కాదని, రాక్షసుడినని తెలుసుకుంది. అతనితో పాటు కుటుంబ సభ్యులు సైతం తనని వేధింపులకు గురి చేయడంతో.. చావే శరణమని భావించి, సూసైడ్ చేసుకుంది. ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Naxals Audition for Movie: సినిమాల్లోని రియల్ నక్సలైట్లు.. గడ్చిరోలిలో మూవీ ఆడిషన్
Also Read
- School Van Hit by Train: ఘోర ప్రమాదం... స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
- Ganja Seizure : హైదరాబాద్ శివారులో రూ. 1.50 కోట్ల గంజాయి పట్టివేత
చిక్కబళ్లాపురం నగరం కార్కానపేటలో నివసిస్తున్న లోహిత్కు బెంగళూరు రూరల్లోని విజయపురకు చెందిన తేజస్వినితో (28) ఏడాది క్రితం పెళ్లి అయ్యింది. ఇంజనీరింగ్ పూర్తి తేజస్విని.. ఇంట్లో ఏకైక కూతురు కావడంతో, తల్లిదండ్రులు ఆమెను అల్లారుముద్దుగా పెంచారు. తన కూతురి జీవితం బాగుండాలని.. లోహిత్కు భారీగా కట్న కానుకలు ఇచ్చి, పెళ్లి చేశారు. మొదట్లో వీరి సంసార జీవితం సజావుగానే సాగింది. కానీ, కొన్ని రోజుల తర్వాత తేజస్వినికి తన భర్తతో పాటు అన్న, వదినల నుంచి వేధింపులు మొదలయ్యాయి. పుట్టినింటి నుంచి మరింత డబ్బు తేవాలని, అలాగే భూమి రాయించుకు రావాలని చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టారు. వాళ్లు హింసించిన ప్రతీసారి.. తేజస్విని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి, బోరుమని విలపించేది. పేరెంట్స్ ఆమెను సర్దిచెప్పి, తిరిగి అత్తారింటికి పంపించేవారు.
Prabhas: ఆ రికార్డ్ సాధించిన ఏకైక హీరో.. దటీజ్ ప్రభాస్
అయితే.. రానురాను భర్త, అన్న, వదినల వేధింపులు మరీ ఎక్కువైపోయాయి. ఆ వేధింపులు భరించలేకపోయిన తేజస్విని, ఇలాంటి బతుకు బతకడం కన్నా చావడమే శ్రేయస్కరమని అనుకుని, ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన తేజస్విని తల్లిదండ్రులు.. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. భర్త లోహిత్, అతని అన్నయ్య, వదినలు టార్చర్ పెట్టడం వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని.. హంతకుల్ని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు.. పోలీసులు రంగంలోకి దిగి భర్త లోహిత్ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే.. డెత్ నోట్తో పాటు తేజస్వినికి సంబంధించిన కొన్ని వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Delhi Police Commissioner: ఢిల్లీకి కొత్త పోలీస్ బాస్.. ఎవరు ఈ అనురాగ్ కుమార్..?
-
Hydrogen Fuel Cell Train: తొలి “హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్” రైలు షురూ.. రూ.14,700 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..!
-
TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Lenovo Legion R9000P: ప్రపంచంలోనే తొలి IJP OLED డిస్ప్లేతో.. లెనోవో Legion R9000P రిలీజ్
ట్రెండింగ్
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!