Yogi Adityanath : “ఫైజాబాద్లో ఎందుకు ఓడిపోయాం”..ఎమ్మెల్యేలపై సీఎం యోగి ఫైర్..
- అయోధ్య అసెంబ్లీలో సమాజ్వాదీ కంటే బీజేపీ ముందంజలో ఉందన్న ఎమ్మెల్యే
- పార్టీ అభ్యర్థికి సంస్థతో ఎలాంటి సమన్వయం లేదని స్పష్టం
- పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా వాతావరణం సృష్టించారని వివరణ
- లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో బీజేపీ పేలవ ప్రదర్శనపై సీఎం సమీక్ష
- ఇప్పటికే 16 లోక్ సభ నియోజకవర్గాల్లో సమీక్ష పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫైజాబాద్లో ఎందుకు ఓడిపోయాం.? అని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎమ్మెల్యేలు, నాయకులపై ఫైర్ అయ్యారు. అందరూ మౌనంగా ఉన్నారు. సీఎం యోగి మళ్లీ తన ప్రశ్నను రిపీట్ చేశారు. ఈసారి అయోధ్య బీజేపీ ఎమ్మెల్యే బదులిచ్చారు. నా అసెంబ్లీలో సమాజ్వాదీ కంటే బీజేపీ ముందంజలో ఉందన్నారు. ఎమ్మెల్యే వేద్ గుప్తా మాట్లాడుతూ… పార్టీ అభ్యర్థికి సంస్థతో ఎలాంటి సమన్వయం లేదని స్పష్టం చేశారు. ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గానికి చెందిన మరో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా వాతావరణం సృష్టించారని తెలిపారు. సోమవారం ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సీఎం హాజరై ఎమ్మెల్యేలను వివరణ అడిగారు.
READ MORE: CM Revanth Reddy: ఏపీ రాజకీయాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Also Read
- PM Modi: పార్లమెంట్ ఉభయ సభల్లో యాంటీ-పేపర్ లీక్ బిల్ పాస్.. మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోడీ
- Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
- Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- Rahul Gandhi-Kiren Rijiju: సభలో ఫైటింగ్.. బయట ముచ్చట్లు.. రాహుల్గాంధీ-కిరణ్ రిజిజు సరదా సంభాషణ
సీఎం లోక్సభ ఎన్నికల అనంతరం ఉత్తరప్రదేశ్లో బీజేపీ పేలవ ప్రదర్శనపై సమీక్షిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను రోజూ తన ఇంటికి పిలిపించుకుంటున్నారు. బీజేపీ మిత్రపక్షాల ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా పిలుస్తున్నారు. బీజేపీకి ఎందుకు తక్కువ ఓట్లు వచ్చాయని యోగి ఆదిత్యనాథ్ అందరికీ ఒక సాధారణ ప్రశ్న అడిగారు. ఈసారి అమేథీ ఎన్నికల్లో స్మృతి ఇరానీ ఓడిపోయారు. ఈ ఓటమికి గల కారణాలను అందరినీ అడిగి తెలుసుకున్నారు. తమ అభ్యర్థిపై ప్రజలు ఎందుకు తిరగబడ్డారో తెలియడం లేదని బీజేపీ ఎమ్మెల్యేలు సమాధానమిచ్చారు. పార్టీ కార్యకర్తలు కూడా ఈసారి ఉత్సాహంగా లేరని స్పష్టం చేశారు. అమేథీపై సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. యోగి ఆదిత్యనాథ్ ఫైల్ మొత్తం తన వెంట తీసుకుని మీటింగ్ లో కూర్చున్నారు. ఇందులో ప్రతి లోక్సభ నియోజకవర్గం ఓట్ల వివరాలు ఉంటాయి. అది కూడా అసెంబ్లీ ప్రకారం. 2019 లోక్సభ ఎన్నికల డేటా కూడా అతని వద్ద ఉంది. ఓటమికి గల కారణాన్ని అందరినీ అడిగేవాడు, దానిని కూడా నోట్ చేసుకున్నారు. ఇప్పటి వరకు 16 లోక్సభ స్థానాలను సమీక్షించారు.. సీఎం. ఒక్కొక్కరుగా మీటింగ్ లు పెడుతున్నారు. దేవీపటాన్ మండలం నుంచి ఆయన ప్రారంభించారు.
READ MORE: Hathras stampede: హత్రాస్ తొక్కిసలాటపై సుప్రీంలో పిటిషన్..రేపు విచారించినున్న సీజేఐ
ప్రజల మధ్యే ఉండాలని నేతలు సూచన..
ఇక నుంచి ప్రతి ఒక్కరూ ప్రజల మధ్య జీవించాలని సీఎం సూచించారు. సోషల్ మీడియాలో అందరూ యాక్టివ్గా ఉండాలని యోగి అన్నారు. ఏ పని చేసినా ప్రచారం చేయాలని సూచించారు. పది మందితో కూర్చున్నా వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు పొందిన వారి వద్దకు వెళ్లి… ఆ ఇంటి ముందు సెల్ఫీ దిగి పోస్ట్ చేయాలని వెల్లడించారు.
తాజావార్తలు
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మ్యాక్స్ రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP సెల్ఫీ కెమెరా, 10,000mAh బ్యాటరీ!
-
KCR: ‘నమ్మకమైన ఉద్యమ సహచరుడిని కోల్పోయా’.. సుదర్శన్రెడ్డి మృతిపై కేసీఆర్ భావోద్వేగం!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని డబ్బు!
-
Peddi Sudarshan Reddy: కేసీఆర్ అడుగుజాడల్లో నడిచిన ఉద్యమ నాయకుడు.. పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే..
-
Pakistan Coal Mine Blast: బొగ్గు గనిలో భారీ పేలుడు.. 32 మంది కార్మికులు మృతి
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!