Bishnoi community: బిష్ణోయ్ వర్గానికి కృష్ణజింకలు అంటే ఎందుకంత ప్రేమ..? ఇదే సల్మాన్ ఖాన్ని వెంటాడుతోందా..?
- కృష్ణజింకలకు బిష్ణోయిలకు మధ్య 500 ఏళ్ల నాటి బంధం..
- తమ ఆధ్యాత్మిక గురువు జంభేశ్వర్ రూపాలుగా ఆరాధన..
- కృష్ణజింకల వేటతో సల్మాన్ ఖాన్.. బిష్ణోయిలకు మధ్య వివాదం..
- లారెన్స్ బిష్ణోయ్ టార్గెట్ చేస్తుంది అందుకేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bishnoi community: ఎన్సీపీ నేత, మాజీ మహారాష్ట్ర మంత్రి బాబా సిద్ధిఖి హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సల్మాన్ ఖాన్కి అత్యంత ఆప్తుడు, మిత్రుడిగా ఉన్న సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చిచంపినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే, గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అసలు సల్మాన్ ఖాన్కి ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు..? దీనికి కారణం, 1998లో ‘‘హమ్ సాథ్ సాథ్ హై’’ సినిమా షూటింగ్ కోసం జోధ్పూర్ వెళ్లిన సమయంలో.. సల్మాన్ ఖాన్ రెండు కృష్ణ జింకల్ని వేటాడి చంపేశాడు. అప్పటి నుంచి బిష్ణోయ్ తెగకు సల్మాన్ ఖాన్కి మధ్య యుద్ధమే నడుస్తోంది. ఈ ఘటన జరిగిన సమయంలో 5 ఏళ్ల వయసు ఉన్న లారెన్స్ బిష్ణోయ్, ఇప్పుడు ఏకంగా గ్యాంగ్ స్టర్గా మారి సల్మాన్ ఖాన్ని చంపేస్తానని హెచ్చరిస్తున్నాడు.
Read Also: Salman Khan Y Plus Security: సల్మాన్ ఖాన్ Y+ సెక్యూరిటీకి మించి.. అష్టదిగ్బంధనమే!
Also Read
- Annamalai: బీజేపీతో అన్నామలైకి ఎక్కడ చెడింది, కారణాలేంటి.?
- Twisha Sharma: కోర్టు హాల్లో ఘర్షణ.. అత్త గారు అరుపులు.. భర్త చెంపపై కొట్టిన ట్విషా శర్మ లాయర్.. ఏం జరిగిందంటే..!
- Annamalai: బీజేపీకి గుడ్బై చెప్పనున్న అన్నామలై.. సొంత పార్టీపై ఫోకస్
- Bihar: 1992 నాటి కేసు.. 34 ఏళ్ల తర్వాత తీర్పు.. 84 ఏళ్ల వృద్ధుడిని దోషిగా తేల్చిన కోర్టు
బిష్ణోయిలు-కృష్ణజింకలకు మధ్య ఎనలేని ప్రేమ:
బిష్ణోయిలు ప్రధానంగా ప్రకృతితో మమేకమై జీవితాన్ని సాగిస్తుంటారు. వన్యప్రాణులు, వృక్షాలను సంరక్షిస్తుంటారు. బిష్ణోయిలకు-కృష్ణజింకలది ఇనాటి సంబంధం కాదు. గత 550 ఏళ్లనాటి బంధం. 15 శతాబ్ధంలో గురు జంభేశ్వర్(జంబాజీ) బిష్ణోయ్ కమ్యూనిటీని స్థాపించారు. 29 సూత్రాల ఆధారంగా ఈ తెగ ఏర్పడింది. అతని బోధనలు వన్యప్రాణులు, వృక్ష సంపద సంరక్షణను హైలెట్ చేస్తాయి. బిష్ణోయిలు కృష్ణజింకల్ని తమ ఆధ్యాత్మిక గురువు జంభేశ్వరుడి పునర్జమ్మగా గౌరవిస్తారు. తప్పిపోయిన కృష్ణజింకల్ని, బిష్ణోయి మహిళలు సొంత పిల్లల్లాగే పెంచుతారు. ఇవి కూడా భయం లేకుండా వారి మధ్యే తిరుగుతుంటాయి. మరణించిన తర్వాత బిష్ణోయిలు కృష్ణజింకలుగా పుడుతారనే నమ్మకం వారిది.
చివరకు చెట్లను కాపాడేందుకు కూడా ప్రాణాలు లెక్క చేయని తెగువ బిష్ణోయిలది. 1790లో జోధ్పూర్ సమీపంలోని ఖేజర్లీ గ్రామంలో చెట్లను నరకకుండా కాపాడుకునే క్రమంలో 362 మంది బిష్ణోయిలు చంపబడ్డారు. జోధ్పూర్ మహారాజా అభయ్ సింగ్ ఆదేశాల మేరకు ఈ హత్యాకాండ జరిగింది. రాజు కొత్త రాజభవనానికి కలప అవసరం కాగా, చెట్లను నరికివేసేందుకు వచ్చిన వారిని అమృతాదేవీ అనే మహిళ నేతృత్వంలో బిష్ణోయిలు అడ్డుకున్నారు. చెట్లను నరకకుండా కౌగిలించుకున్నారు. ఇప్పటికీ బిష్ణోయి మహిళలు కృష్ణ జింకలకు తమ పాలను ఇస్తుంటారు. అంతలా వీరి మధ్య బంధం ఉంది.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : జర్నలిస్టులకు ఇళ్లు, ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’కి నెలకు రూ.150 కోట్లు.!
-
Annamalai: బీజేపీతో అన్నామలైకి ఎక్కడ చెడింది, కారణాలేంటి.?
-
Twisha Sharma: కోర్టు హాల్లో ఘర్షణ.. అత్త గారు అరుపులు.. భర్త చెంపపై కొట్టిన ట్విషా శర్మ లాయర్.. ఏం జరిగిందంటే..!
-
Trump VS Netanyahu: ఫోన్ కాల్లో నెతన్యాహును బండబూతులు తిట్టిన ట్రంప్..! స్నేహితుడితో అమెరికా ప్రెసిడెంట్కు ఎక్కడ చెడింది?
-
MUFG Fund India: భారతీయ స్టార్టప్ సామ్రాజ్యంపై జపాన్ కన్ను.. రూ.2400 కోట్ల భారీ ఫండ్తో సరికొత్త విప్లవం!
ట్రెండింగ్
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!