WHO Worry: నిబంధనలు గాలికి.. నిర్లక్ష్యం ఖరీదెంత?
ఒక్క చిన్న వైరస్.. వందలాది దేశాలను వణికించింది. ఒకటి కాదు రెండేళ్ళకు పైనే అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయాయి. లక్షలాదిమంది ఆ మహమ్మారికి బలయిపోయారు. కరోనా వైరస్ ఇప్పుడు కొంత తగ్గుముఖం పట్టింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా దిగిరావడంతో అనేక దేశాలు నిబంధనలు వదిలేశాయి. మనదేశంలో 25వేలకు లోపే కరోనా కేసులు నమోదవుతున్నాయి. నెలక్రితం ఈ సంఖ్య రెండు లక్షలకు పైమాటే. కరోనా తగ్గిందని జనం బయట యథావిధిగా విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. అంతేకాదు, కరోనా పరీక్షలను తగ్గించేశాయి. అయితే, కరోనా విషయంలో అలసత్వం పనికిరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరించింది. కరోనా కొత్త వేరియంట్లను గుర్తించేందుకు పరీక్షలు చాలా కీలకమని, వాటిని తక్షణం కొనసాగించాలని కోరింది. కరోనా మన జీవితంలో భాగంగానే వుంటుందని, వాతావరణ పరిస్థితలకు అనుగుణంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా పరీక్షలు చేయడం ఒక్కసారిగా పడిపోయాయి. ఒక వ్యక్తికి కరోనా వైరస్ సంక్రమించిందీ, లేనిదీ తెలుసుకునేందుకు కానీ, వైద్యం అందించాలన్నా పరీక్షలు తప్పనిసరి. పరీక్షల విషయంలో మనం చేసే నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు అంటున్నారు నిపుణులు. ఒమిక్రాన్ వేరియంటే చివరిది కాదని, మరిన్ని ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ఒమిక్రాన్ తర్వాత మరో వేరియంట్ కనుక వెలుగు చూస్తే అది మరింత శక్తమంతంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్ నిరంతర ప్రక్రియగా కొనసాగాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో జీరో కరోనా కేసులు వున్నాయని డబ్ల్యుహెచ్ వో జాబితా విడుదల చేసింది. దక్షిణ పసిఫిక్ మహాపముద్రంలోని టువాలు, టోకిలౌ, సెయింట్ హెలెనా, పిట్ కెయిర్స్ ఐల్యాండ్స్, నియూ, నౌరు, మైక్రోనేషియా, వనౌటు, మార్షల్ ఐల్యాండ్స్, కూక్ ఐల్యాండ్స్ లో కేసులు లేవు. కానీ కూక్ ఐల్యాండ్స్ లో తొలి కేసు నమోదైంది. ఇతర దేశాల నుంచి నిత్యావసరాలు అక్కడకు వెళ్లడంతో కరోనా వ్యాపించిందని చెబుతున్నారు. వీటితో పాటు నార్త్ కొరియా, తుర్కమెనిస్తాన్లో సున్నా కేసులు నమోదయ్యాయి. ఈ రెండు దేశాలు తమ సరిహద్దుల్ని మూసేయడంతో అక్కడి కరోనా పరిస్థితి ఎవరికీ అంతుచిక్కడం లేదంటున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!