Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Who Is Professor Madhavi Lata 17 Years Of Work For The Chenab Railway Bridge Project

Madhavi Latha: ప్రొఫెసర్ మాధవి లత ఎవరు.? చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి

Published Date :June 7, 2025 , 4:31 pm
By BV Reddy
  • చీనాబ్ రైల్వే వంతెన నిర్మాణంలో మాధవి లత కృషి..
  • 17 ఏళ్ల పాటు అత్యంత ఎత్తైన వంతెన నిర్మాణంలో సహకారం..
Madhavi Latha: ప్రొఫెసర్ మాధవి లత ఎవరు.? చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Madhavi Latha: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ వంతెనను శుక్రవారం ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఈ వంతెన దేశాన్ని మొత్తం జమ్మూ కాశ్మీర్‌తో అనుసంధానిస్తుంది. అయితే, ఇప్పుడు ఈ వంతెన నిర్మాణంలో ఒక మహిళా ప్రొఫెసర్ జి మాధవి లత కృషిని అంతా కొనియాడుతున్నారు. 17 ఏళ్లుగా ఆమె తన జీవితాన్ని వంతెన నిర్మాణానికి ధారపోశారు.

ఈ ప్రాజెక్ట్ 272 కి.మీ. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ (USBRL)లో భాగంలో ఈ వంతెన నిర్మించబడింది. వంతెన నిర్మించడంలో ప్రధాన పాత్ర పోషించిన వారిలో మాధవి లత ఒకరు. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)లో ప్రొఫెసర్‌గా ఉన్న ఆమె, జియోటెక్నికల్ కన్సల్టెంట్‌గా చీనాబ్ వంతెన ప్రాజెక్టులో 17 సంవత్సరాలు పాల్గొన్నారు. వంతెన కాంట్రాక్టర్ అయిన ఆఫ్కాన్స్‌తో మాధవి లత కలిసి పనిచేశారు. భూభాగం పరిస్థితులు, ప్రమాదాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వంతెన నిర్మాణం సక్రమంగా జరిగేలా సహకరించారు. అత్యంత పెలుసుగా ఉండే హిమాలయాల ప్రాంతంలో సవాళ్లతో కూడుకున్న వంతెన నిర్మాణంలో ఆమె పాత్ర చాలా కీలకం.

మాధవి లత ఎవరు..?

మాధవి లత ప్రస్తుతం బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)లో ప్రొఫెసర్‌గా ఉన్నారు. 1992లో ఆమె జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో డిస్టింక్షన్‌లో బి.టెక్ పూర్తి చేశారు. వరంగల్ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూడ్ ఆఫ్ టెక్నాలజీలో ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్. జియో టెక్నికల్ ఇంజనీరింగ్‌లో స్పెషలైజేషన్ చేశారు. 2000లో ఐఐటీ మద్రాస్ నుంచి జియో టెక్నికల్ ఇంజనీరింగ్‌లో డాక్టరేట్ పూర్తి చేశారు. 2021లో, ఆమెకు ఇండియన్ జియోటెక్నికల్ సొసైటీ ఉత్తమ మహిళా జియోటెక్నికల్ పరిశోధకురాలిగా అవార్డును ప్రదానం చేసింది. 2022లో స్టీమ్ ఆఫ్ ఇండియాలో టాప్ 75 మహిళలలో ఆమె పేరు కూడా ఉంది.

చీనాబ్ వంతెన నిర్మాణంలో కీలక పాత్ర:

చీనాబ్ వంతెన అత్యంత సవాళ్లతో కూడుకున్న నిర్మాణం. ఆ ప్రదేశం స్థలాకృతి, వాతావరణ పరిస్థితులు, మారుమూల ప్రాంతం ఇంజనీరింగ్ బృందానికి కష్టంగా మారాయి. డాక్టర్ లత బృందం అడ్డంకులను అధిగమించి ‘‘డిజైన్-యాజ్-యు-గో విధానం”ని అవలంబించింది. దీని అర్థం ఏంటంటే సర్వే ముందు కనిపించని రాతి లక్షణాలు, పగిలిన రాళ్లు, రాళ్లలో దాగిన రంధ్రాల వంటి వివిధ రాతి లక్షణాల వంటి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా రియల్ టైమ్‌లో పనిచేయడం.

నిర్మాణ సమయంలో కనుగొన్న రాతి పరిస్థితులు వాటిపై పనిచేయడానికి లత టీమ్ సంక్లిష్టమైన కాలిక్యులేషన్స్, డిజైన్ మార్పులను నిర్వహించింది. స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి రాతి యాంకర్ల రూపకల్పన, ప్లేస్‌మెంట్‌పై ఎప్పటికప్పుడు సలహాలు అందించేవారు. ఆమె ఇటీవల ఇండియన్ జియోటెక్నికల్ జర్నల్ యొక్క మహిళల ప్రత్యేక సంచికలో “డిజైన్ యాజ్ యు గో: ది కేస్ స్టడీ ఆఫ్ చీనాబ్ రైల్వే బ్రిడ్జి” అనే శీర్షికతో ఒక పత్రాన్ని ప్రచురించారు.

చీనాబ్ వంతెన గురించి కీలక వివరాలు:

రూ. 1,486 కోట్ల వ్యయంతో నిర్మించబడిన చీనాబ్ వంతెనను ప్రభుత్వం “ఇటీవలి చరిత్రలో భారతదేశంలో ఏ రైల్వే ప్రాజెక్ట్ ఎదుర్కోని అతిపెద్ద సివిల్-ఇంజనీరింగ్ సవాలు”గా అభివర్ణించింది. 359 మీటర్ల వంతెన ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్లు పొడవుగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కాశ్మీర్ లోయలో రైల్వే కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chenab bridge
  • chenab bridge height
  • chenab bridge inauguration
  • Chenab bridge india
  • Chenab rail bridge

తాజావార్తలు

  • Flight Ticket Price Hike: విమాన టికెట్ ధరలకు రెక్కలు.. ఇంధన సర్‌ఛార్జ్‌ వడ్డింపు..

  • AP High Court: అవినీతి అధికారులకు షాకిచ్చిన హైకోర్టు.. సీజ్‌ చేసిన నగల విడుదలకు బ్రేక్..

  • Off The Record: బ్యాంకుకు కన్నం వేసినోడితోనే టీడీపీ నేత భేరాలు

  • Reliance: ‘దేశ ఇంధన భద్రతే మా ప్రాధాన్యత’.. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్!

  • Off The Record : చిన్నన్నయ్య కోసం పవన్ పవర్‌ను గట్టిగా వాడబోతున్నారా..?

ట్రెండింగ్‌

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions