Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* నేటితో ముగుస్తున్న ట్రంప్‌ గడువు.. హర్మూజ్‌ తెరుస్తారా?.. నరకానికి పంపించమంటారా?.. సహనం కోల్పోయిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌.. ఇరాన్‌పై బూతులతో విరుచుకుపడ్డ ట్రంప్.. మంగళవారం పవర ప్లాంట్, బ్రిడ్జ్‌ డే అంటూ పోస్ట్.. మీరంతా నరకానికి పోతారంటూ శాపనార్థాలు.. ఇరాన్‌పై దాడులకు అంతా సిద్ధంగా ఉన్నాం-ట్రంప్‌

* ఐపీఎల్‌: నేడు కోల్‌కతా వర్సెస్‌ పంజాబ్‌.. రాత్రి 7 గంటలకు ఈడెన్‌ గార్డెన్స్‌లో మ్యాచ్‌

* అనంతపురం: నేడు జేఎన్టీయూలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో 15వ స్నాతకోత్సవ వేడుకలు. ముఖ్యఅతిథిగా హాజరుకానున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. ప్రముఖ విద్యావేత్త డాక్టర్ టేస్సి థామస్ కు డాక్టరేట్ పట్టా ప్రదానం

* నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు.. యాడికి గ్రామ మార్కెట్ యార్డ్‌లో నిర్వహించే “ప్రజా వేదిక”లో పాల్గొననున్న సీఎం.. పెండేకల్లు రిజర్వాయర్ తీర ప్రాంతం పరిశీలన..

* ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన.. ఉదయం 11 గంటలకు బాసరలోని సరస్వతీ దేవి అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం.. 12 గంటలకు ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు భూమి పూజ.. మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్‌ జిల్లా పిప్రిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన.

* అమరావతి : ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్.. మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగుళూరులోని తన నివాసం నుంచి బయలుదేరి సాయంత్రం 5.40 గంటలకు తాడేపల్లి లోని తన నివాసానికి చేరుకోనున్న జగన్..

* శ్రీ సత్యసాయి: హిందూపురంలో పర్యటించనున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ఎమ్మెల్యే కార్యాలయం వద్ద సాయంత్రం 5 గంటలకు పోలీస్ శాఖకు మూడు బొలెరో వాహనాలు అందజేత.

* ప్రకాశం : ఇవాళ సింగరాయకొండ మండలం పాకలలో నాలుగు జిల్లాల మత్స్యకారుల సమావేశం.. తమిళనాడు మత్స్యకారులతో తలెత్తుతున్న వివాదాలపై చర్చించేందుకు సమావేశంకానున్న నాలుగు తీర ప్రాంత జిల్లాల మత్స్యకారులు.. హాజరుకానున్న బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల మత్స్యకార గ్రామాల కాపులు, మత్స్య కారులు..

* యాదాద్రి భువనగిరి జిల్లా: నేడు భువనగిరికి డీజీపీ శివధర్ రెడ్డి… భరోసా సెంటర్, డీపీవో కార్యాలయాన్ని ప్రారంభించనున్న డీజీపీ..

* తిరుమల: 20 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 83,271 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25,018 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.78 కోట్లు

* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రిలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు .. బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చేయనున్న రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. రాజమండ్రి క్వారీ సెంటర్ లో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయం నుండి గోరక్షణ పేట వద్ద ఉన్న దివంగత ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి విగ్రహం వరకు బైక్ ర్యాలీ

* పల్నాడు జిల్లా: నేడు పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణ పనులపై సమీక్ష, పాల్గొనున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, అధికారులు

* కాకినాడ: నేడు, రేపు వేట్లపాలెంలో జాతీయ విపత్తుల నిర్వహణ బృందం ప్రతినిధులు పర్యటన.. ఫిబ్రవరి 28న వేట్లపాలెం లో జరిగిన బాణాసంచా ప్రమాద ఘటనపై క్షేత్రస్థాయి పర్యటన చేయనున్న కేంద్ర బృందం.. క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సిద్ధం చేయనున్న ఎస్ డీ ఎం ఏ.. బాణాసంచా ప్రమాదంలో మృతి చెందిన 28 మంది కార్మికులు

* గుంటూరు: నేడు తాడికొండ మండలం మోతడకలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, పాల్గొనున్న ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్.

* నంద్యాల: నేడు వైసీపీ జిల్లా మహిళా విభాగం ఆత్మీయసమావేశం… హాజరుకానున్న ఎమ్మెల్సీ, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కల్యాణి

* హైదరాబాద్‌: ఇవాళ నెక్లెస్‌ రోడ్‌లో అవేర్‌నెస్‌ వాక్‌.. హాజరుకానున్న మంత్రి దామోదర.. హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌ వరకు కొనసాగనున్న వాకథాన్‌..

* హైదరాబాద్‌: బల్కంపేటలోని నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రిలో ఉదయం 10 గంటల నుంచి ఈట్‌రైట్‌ మేళా.. మధ్యాహ్నం 3 గంటకు సభలో పాల్గొనున్న మంత్రి దామోదర

Exit mobile version