* బెంగళూరు: ఇవాళ మధ్యాహ్నం తర్వాత గవర్నర్ దగ్గరకు సిద్ధరామయ్య.. మధ్యాహ్నం 3 గంటల తర్వాత రాజీనామా లేఖను గవర్నర్కు ఇవ్వనున్న సిద్ధరామయ్య.. సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ను ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు
* అమరావతి: ఇవాళ ఉదయం 10 గంటలకు రెండోరోజు మహానాడు.. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నేతల నివాళులు.. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించనున్న సీఎం చంద్రబాబు.. ఏపీ, తెలంగాణకు సంబంధించిన తీర్మానాలు.. చివర్లో రాజకీయ తీర్మానం
* హైదరాబాద్: మైత్రి వనంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు.. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు NTR విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హామీ ఇచ్చిన సీఎం రేవంత్ .. హామీ అమలులో భాగంగా విగ్రహ ఏర్పాటు
* నేడు అమీర్పేట్లో ట్రాఫిక్ మళ్లింపులు.. ఇవాళ సాయంత్రం మైత్రివనం జంక్షన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ, బహిరంగసభ.. పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి.. సత్యం థియేటర్, ఎస్.ఆర్. నగర్, యూసుఫ్గూడ వైపు వెళ్లే వాహనాలను వెంగళరావు నగర్ కమాన్, కృష్ణకాంత్ పార్క్, పంజాగుట్ట మీదుగా మళ్లింపు
* అమరావతి : ఇవాళ తాడేపల్లి నుంచి బెంగుళూరుకు మాజీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 7.50 గంటలకు తాడేపల్లి లోని తన నివాసం నుంచి బయలుదేరి 8.20 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.. ఉదయం 9 గంటలకు విమానంలో బయలుదేరి 10.15 గంటలకు బెంగుళూరు చేరుకుంటారు.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 10.50 గంటలకు బెంగుళూరు లోని తన నివాసానికి చేరుకుంటారు జగన్.
* తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు అన్ని నిండిపోయి వెలుపల క్యూలైన్లలో వేచివున్న భక్తులు .. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 87,691 మంది భక్తులు .. తలనీలాలు సమర్పించిన 49,958 మంది భక్తులు .. హుండీ ఆదాయం రూ.4.99 కోట్లు
* చిత్తూరు: నేడు పుణ్యధ్వజారోహణానికి సిద్ధమైన నారాయణవనం.. శాస్త్రోక్త అంకురార్పణతో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
* ఖమ్మం: నేడు మధిర నియోజకవర్గం లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
* నిర్మల్: నేడు జిల్లా లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పర్యటన. నిర్మల్, ఖానాపూర్ నియోజక వర్గాల్లో రైతు గోస, బీజేపీ భరోసా లో పాల్గొనన్న బీజేపీ చీఫ్..
* రంగారెడ్డి జిల్లా: నేడు శేరిలింగంపల్లి మండలంలోని రాయదుర్గంలో టిజిఐఐసి భూముల వేలం.. సర్వే నంబర్ 83/1 లోని 6 ఎకరాల 29 గుంటల భూమికి ఈవేలం వేయనున్న టిజిఐఐసి.. 2025 డిసెంబర్ లో రాయదుర్గంలోని 7.67 ఎకరాలకు వేలంలో రికార్డు ధర పలికిన భూమి.. ఎకరానికి 177 కోట్లు ధర పలికిన భూమి.. ఏడు ఎకరాలకు మొత్తం 1357.59 కోట్లు ఆదాయం ఆర్జించిన టిజిఐఐసి.
