* IPL 2026: నేడు పంజాబ్ వర్సెస్ రాజస్థాన్… రాత్రి 7.30 గంటలకు చండీగఢ్ వేదికగా మ్యాచ్
* నేడు విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన.. ఉదయం 9.30కి డేటా సెంటర్కు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు.. రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో 601 ఎకరాల విస్తీర్ణంలో డేటా సెంటర్ నిర్మాణం
* హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ్టి షెడ్యూల్.. ఉదయం 11.30 గంటలకు నీటిపారుదల శాఖపై సమీక్ష .. సాయంత్రం 4 గంటలకు భారత్ ఫ్యూచర్ సిటీలో “ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్” భవనానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి..
* అమరావతి: ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు వద్ద వైసీపీ నిరసనలు.. రాష్ట్రవ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ కొరతతో రైతాంగం సహా సామాన్యుల ఇబ్బందులపై అసంతృప్తి.. పెట్రోల్ బంకుల వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేయనున్న వైసీపీ శ్రేణులు..
* నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు టూర్ షెడ్యూల్.. ఉదయం 9.30 కు తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన… మధ్యాహ్నం సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనం.. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కార్యాలయం సందర్శన.. సీనియర్ అధికారులతో సమావేశం
* విశాఖ: ఛలో నర్సీపట్నంకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు… మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ పై దాడికి నిరసనగా తరలి వెళ్ళనున్న జిల్లా నాయకత్వం…
* తిరుమల: ఇవాళ శ్రీవారిని దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూలైన్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 74,286 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 33,186 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.44 కోట్లు
* తిరుపతి: ఇవాళ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్..
* కర్నూలు: నేడు కోడుమూరు (మం) ప్యాలకుర్తిలో శ్రీ సాయిబాబా మందిర 10 వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, కాకడహారతి, చందనోత్బవం.. మధ్యాహ్నం సాయిబాబా ఊరేగింపు కార్యక్రమం
* కర్నూలు: నేడు లక్ష్మీపురం జగన్నాథ గట్టు రోడ్ అభయాంజనేయస్వామి ఆలయంలో నవగ్రహ విగ్రహ ప్రాణ ప్రతిష్ట.. నేటి నుంచి 3 రోజులు ప్రత్యేక పూజలు
* కామారెడ్డి : నేడు జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటన.. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న సీతక్క.
* నిజమాబాద్ : నేడు జిల్లాలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటన.. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మహేష్ గౌడ్
* సంగారెడ్డి: నేడు కందిలోని సెంట్రల్ జైలుకి రానున్న మాజీ మంత్రి హరీష్ రావు.. జైల్లో ఉన్న BRS పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిశాంక్ ని పరామర్శించనున్న హరీష్ రావు
