* IPL 2026: నేడు లక్నో వర్సెస్ పంజాబ్.. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్
* భారత్కు చేరుకున్న అమెరికా విదేశాంగమంత్రి మార్కోరుబియో.. మే 26 వరకు భారత్లో పర్యటన.. ఇవాళ ప్రధాని మోడీతో సమావేశం.. క్వాడ్ సదస్సుకు హాజరుకానున్న రుబియో.. భారత్-అమెరికా మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలపై చర్చించే అవకాశం.. రేపు విదేశాంగ మంత్రి జైశంకర్తో ద్వైపాక్షిక చర్చలు
* దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన ఇంధన ధరలు.. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసల చొప్పున పెంపు.. ఇవాళ్టి నుంచి అమలులోకి పెంచిన ధరలు
* నేడు చిత్తూరు జిల్లా పూతలపట్టులో సీఎం చంద్రబాబు పర్యటన.. పూతలపట్టు నియోజకవర్గంలోని యాదమరి గ్రామంలో నిర్వహించే సంజీవిని కార్యక్రమానికి సీఎం హాజరు..
* నేడు యాదగిరిగుట్టకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఉదయం 8.45 గంటలకు యాదగిరిగుట్టకు చేరుకోనున్న సీఎం.. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోనున్న ముఖ్యమంత్రి.. రూ.99.55 కోట్లతో యాదగిరి గుట్ట క్షేత్రంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం.. వేద పాఠశాలతోపాటు పాటు ఆలయానికి సంబంధించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి.
* తిరుమల: ఇవాళ ఆన్ లైన్ లో ఆగస్టు నెల దర్శన టికెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకేన్లు విడుదల .. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల .. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టోకెన్లు విడుదల..
* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూలైన్లలో వేచివున్న భక్తులు .. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 87,689 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 44,476 మంది భక్తులు .. హుండీ ఆదాయం రూ.4.29 కోట్లు
* అమరావతి: నేడు సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన శాఖలపై రివ్యూలు చేయనున్న డిప్యూటీ సీఎం..
* నేడు హైదరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన.. ఉదయం 09:00 గంటలకు మాదాపూర్ నాలెడ్జ్ సిటీలో ‘నేషనల్ ఫోరమ్ రెంగీ’ (RENGEY) ఆధ్వర్యంలో నిర్వహించబోయే “రెనర్జైన్-2026” (RENERGYNE-2026) సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఉదయం 09:30 గంటలకు బోయిగూడలోని ‘రైల్ కళారంగ్’ లో నిర్వహించే “రోజ్గార్ మేళా” (Rozgar Mela) కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
* నేటి నుంచి మూడు రోజులు పాటు కాకినాడ పోర్ట్-విశాఖ(17267),విశాఖ-కాకినాడ పోర్ట్(17268) ట్రైన్ రద్దు.. మెయింటినెన్స్ పనులు కారణంగా ట్రైన్ రద్దు అయినట్లు తెలిపిన రైల్వే అధికారులు
* జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరంలో వైభవంగా మూడో రోజుకు చేరిన సరస్వతి అంత్య పుష్కరాలు.. త్రివేణి సంగమంలో భక్తుల రద్దీ.. తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి తరలివస్తున్న భక్తులు..
