Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
* అమెరికాలో మూడు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. క్వాడ్ సదస్సులో పాల్గొననున్న మోడీ.. న్యూయార్క్ యూఎన్ జనరల్ అసెంబ్లీలో ప్రసంగించనున్న భారత ప్రధాని… అమెరికా అధ్యక్షుడు జోబైడెన్తో భేటీ కానున్న ప్రధాని మోడీ
* నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణస్వీకారం.. సాయంత్రం 4.30 గంటలకు రాజ్భవన్లో ప్రమాణస్వీకారం.. ఆతిశీతో పాటు మంత్రులుగా ఐదుగురు ఆప్ ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం
Also Read
* హైదరాబాద్: నేడు సచివాలయంలో రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి పొంగులేటి సమావేశం.. రెవెన్యూ శాఖ బలోపేతం, ఉద్యోగుల సమస్యలపై చర్చ
* హైదరాబాద్: నేడు బీఆర్కే భవన్ లో కాళేశ్వరం కమిషన్ ముందుకు క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు.. గతంలో అఫిడవిట్లు సమర్పించిన అధికారులను బహిరంగ విచారణకు రావాలని ఆదేశించిన కమిషన్
* ప్రకాశం : కొండేపి లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి..
* బాపట్ల : అద్దంకిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్..
* కాకినాడ టూరిజం డిపార్ట్మెంటల్ రివ్యూ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కందుల దుర్గేష్..
* రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణారెడ్డి.. రాష్ట్ర పురపాలక ..పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణలు విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* అనంతపురం : విడపనకల్లు మండలం గడేకల్లులో పర్యటించనున్న మంత్రి పయ్యావుల కేశవ్.
* అనంతపురం : ఈనెల 22న నగరంలో జిల్లా స్థాయి పారా షూటింగ్ పోటీలు.
* విజయవాడ: ముంబై సినీ నటి జిత్వానీ కేసులో అరెస్టు అయిన ఏ1 గా ఉన్న కుక్కల విద్యాసాగర్ ను నేడు విజయవాడ తీసుకు రానున్న పోలీసులు.. నిన్న డెహ్రాడూన్ లో విద్యాసాగర్ ను అరెస్టు చేసిన పోలీసులు
* విజయవాడ: మత్స్యకారులకు చెందిన ముఖ్య నేతలతో నేడు ఆత్మీయ సమావేశం నిర్వహించనున్న మాజీ మంత్రి మోపిదేవి
* నేడు విశాఖకు మిజోరాం గవర్నర్ హరిబాబు.. ఇటీవల అనారోగ్యం బారినపడి హైదరాబాద్లో చికిత్స పొందిన హరిబాబు… కోలుకున్న తర్వాత స్వస్థలం విశాఖకు వస్తున్న గవర్నర్
* నేడు వరంగల్కు నేడు కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ రాక.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండురోజుల పాటు పర్యటన.. నేడు జనగామ జిల్లాలో బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని.. మధ్యాహ్నం 12 గంటలకు హనుమకొండ జిల్లాకు చేరుకొని ఫౌల్ట్రీ రైతుల సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత వరంగల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటారు.. ఆదివారం ఉదయం రామప్పను సందర్శించి అక్కడే భూపాలపల్లి, ములుగు జిల్లాల బీజేపీ నాయకులతో సమావేశం
* ఆదిలాబాద్: ఇవాళ రాష్ట్ర వ్యాప్త బంద్ కు ఆదివాసి హక్కుల పోరాట సమితి పిలుపు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ముందు ఆదివాసిల ధర్నా . బస్సులు బయటకి వెళ్లకుండా గేటు ముందు బైఠాయించిన తుడుం దెబ్బ నాయకులు. జైనూర్ లో ఆదివాసి మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని ఉరి తీయాలనే డిమాండ్ తో బందుకు పిలుపునిచ్చిన తుడుం దెబ్బ.
* కొమురం భీం జిల్లా: జైనూర్ మహిళపై జరిగిన అఘాత్యాన్ని నిరసిస్తూ ఆదివాసీ సంఘాల పిలుపు మేరకు నేడు బంద్.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లాలో భారీ పోలీస్ బందోబస్తు.
* శ్రీ సత్యసాయి : సోమందేపల్లి మండలంలోని గుడిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత.
* అన్నమయ్య జిల్లా : నేడు సంబేపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి…
తాజావార్తలు
-
Toxic: అఫీషియల్.. ‘టాక్సిక్’ రిలీజ్ వయిదా..
-
TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
-
Vaibhav Sooryavanshi Record: మెగా మైలురాయి.. తొలి ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు!
-
Malkajgiri: డేటింగ్ యాప్లతో జాగ్రత్త!! న్యూడ్ వీడియో కాల్తో సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ముంచిన యువతి
-
Nagarjuna-Lenin : ‘లెనిన్’ పై నాగార్జున సాలిడ్ రివ్యూ.. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేసిన కింగ్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో