PM Modi Speech: ప్రధాని మోడీ ‘‘ఆపరేషన్ సిందూర్’’ స్పీచ్పై ప్రపంచ మీడియా ఏం చెప్పిందంటే..
- మోడీ ‘‘ఆపరేషన్ సిందూర్’’ స్పీచ్ని విస్తృతంగా కవర్ చేసిన ప్రపంచ మీడియా..
- హెడ్లైన్స్గా మారిన ప్రధాని హెచ్చరికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Speech: పాకిస్తాన్పై భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’పై సోమవారం ప్రధాని నరేంద్రమోడీ సంచలన ప్రసంగం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదం గురించి మాట్లాడుతూ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ దానికే బలవుతుందని అన్నారు. మరోసారి, భారత్పై ఉగ్రవాద దాడులు జరిగితే దానిని తీవ్రంగా ప్రవర్తిస్తామని ప్రధాని మోడీ పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చారు. న్యూక్లియర్ బ్లాక్మెయిల్ని ఇక సహించేది లేదని చెప్పారు. ఇది యుద్ధాల యుగం కాదంటూనే, ఇది ఉగ్రవాదుల యుగం కూడా కాదని చెప్పారు. అయితే, ప్రధాని మోడీ ప్రసంగాన్ని ప్రపంచ మీడియా విస్తృతంగా కవర్ చేసింది. ప్రధాని మోడీ చేసిన కామెంట్స్ని హైలెట్ చేసింది.
* వాషింగ్టన్ పోస్ట్ ప్రధానమంత్రి ప్రసంగాన్ని హైలైట్ చేస్తూ, భారతదేశం తన సైనిక చర్యను “పాజ్” చేసిందని మరియు భవిష్యత్తులో దేశంపై ఏదైనా ఉగ్రవాద దాడి జరిగితే “తన స్వంత నిబంధనలపై ప్రతీకారం తీర్చుకుంటుందని” ఇస్లామాబాద్కు ఆయన హెచ్చరికను హైలైట్ చేసింది.
Also Read
- Bihar: 1992 నాటి కేసు.. 34 ఏళ్ల తర్వాత తీర్పు.. 84 ఏళ్ల వృద్ధుడిని దోషిగా తేల్చిన కోర్టు
- Congress: సంచలన నిర్ణయాలు దిశగా కాంగ్రెస్.. భారీ నాయకత్వ మార్పుల వైపు అడుగులు?
- Lalit Modi: 'ఆమె డబ్బు కోసం ఆశపడేది కాదు', సుష్మితా సేన్తో తన బ్రేకప్పై మౌనం వీడిన లలిత్ మోడీ..
- Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
* యూకే పత్రిక ది గార్డియన్ కూడా ఇదే ప్రకటనను హెడ్లైన్గా చేసింది. అణు ముప్పుపై ప్రధాని ప్రతిస్పందనను హైలెట్ చేసింది. పాకిస్తాన్తో భవిష్యత్తులో ఏదైనా వివాదంలో, భారత్ని ‘‘అణు బ్లాక్మెయిల్’’ని సహించదని పేర్కొంది.
* బీబీసీ ‘‘ రక్తం, నీరు కలిసి ప్రవహించదు’’ అని ప్రధాన చేసిన వ్యాఖ్యల్ని ప్రధానంగా ప్రస్తావించింది. భవిష్యత్తులో ఏదైనా దాడి జరిగితే పాకిస్తాన్కి బలమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించినట్లు చెప్పింది. ఇది యుద్ధాల యుగం కాదు, అలాగే ఇది ఉగ్రవాద యుగం కాదని చెప్పిన ప్రధాని మోడీ కామెంట్స్ని ప్రస్తావించింది.
* జపాన్ టైమ్స్ కూడా ప్రధాని మోడీ ప్రసంగాన్ని కవర్ చేసింది. ‘‘ఉగ్రవాదంపై కొత్త మార్గాన్ని, న్యూ నార్మల్ స్థితి’’ని మోడీ నిర్దేశించారని చెప్పింది. అణు బెదిరింపులు, పాక్తో చర్చల్లో ఉగ్రవాదం, కాశ్మీర్పైనే దృష్టి పెడుతుందని మోడీ చెప్పినట్లు కవర్ చేసింది.
* పాకిస్తాన్ సమా టీవీ మోడీ చెప్పిన విషయాలను విస్తృతంగా కవర్ చేసింది. ఆపరేషన్ సిందూర్ కేవలం నిలిపివేయబడిందని, ముగియలేదని మోడీ హెచ్చరికల్ని హైలెట్ చేసింది. పాక్ అణు బ్లాక్మెయిల్పై ఇక భారత్ పట్టించుకోదనే ప్రధాని ప్రకటనని ప్రముఖంగా ప్రస్తావించింది.
తాజావార్తలు
-
Best Hollywood Action Thrillers: థియేటర్లను షేక్ చేసిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్లు… వీటిలో ఒక్కటి చూసినా పిచ్చెక్కిపోద్ది భయ్యా
-
ICC: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్లో భారీ మార్పు.. డే టెస్టుల్లో పింక్ బాల్ ట్రయల్.!
-
Vaibhav Sooryavanshi: భారీగా డిమాండ్ చేస్తున్న వైభవ్ సూర్యవంశీ.. ఇక నుంచి డబ్బే డబ్బు!
-
Vaibhav-Abhishek: టీమిండియా ఓపెనింగ్ జోడీగా వండర్ కిడ్-సిక్సర్ల కింగ్.. తలుచుకుంటేనే తడిసిపోతుంది భయ్యా!
-
ASUS T3201: 9,000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల OLED డిస్ప్లేతో.. ASUS కొత్త టాబ్లెట్ విడుదల
ట్రెండింగ్
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!