2 States Elections: బెంగాల్, తమిళనాడులో ప్రారంభమైన పోలింగ్.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు
- బెంగాల్ ఫేజ్-1, తమిళనాడులో ప్రారంభమైన పోలింగ్
- పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు
- సా.5 గంటల వరకు జరగనున్న పోలింగ్
తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఫేజ్-1 ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎండకాలం కావడంతో వడగాల్పుల భయంతో ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చారు. అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు క్యూ కట్టారు.
బెంగాల్లో మొత్తం 294 స్థానాలు ఉండగా ఈరోజు 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. సుమారు 3.6 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక్కడ ప్రధానంగా బీజేపీ-తృణమూల్ కాంగ్రెస్ మధ్య ఫైటింగ్ జరుగుతోంది. ఇక తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ డీఎంకే-ఎన్డీఏ కూటమి, టీవీకే పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నడుస్తోంది. 234 నియోజకవర్గాల్లో 4,023 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 5.73 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
ఇక రెండో విడతలో భాగంగా పశ్చిమ బెంగాల్లో 142 స్థానాలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది. అనంతరం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మాత్రం మే 4న విడుదల కానున్నాయి.
ఓటర్లకు మోడీ విజ్ఞప్తి
తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో పోలింగ్ ప్రారంభమైన సందర్భంగా పెద్ద ఎత్తున ఓటర్లు తరలి రావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ‘‘పశ్చిమ బెంగాల్, తమిళనాడులోని ఓటర్లందరూ ప్రజాస్వామ్యమనే ఈ పవిత్ర కర్తవ్యంలో ఉత్సాహంగా పాల్గొనాలని నేను పిలుపునిస్తున్నాను. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ యువత, మహిళలు రికార్డు స్థాయిలో ఓటు వేయడానికి ముందుకు రావాలని నేను కోరుతున్నాను.’’ అని మోడీ పేర్కొన్నారు.
అమిత్ షా..
బెంగాల్ తల్లీకూతుళ్ల భద్రత కోసం ఓటు వేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ‘‘ఈరోజు బెంగాల్లో మొదటి దశ పోలింగ్ జరుగుతోంది. ఈ బెంగాల్ ఎన్నికలు రాష్ట్ర వర్తమానానికీ, భవిష్యత్తుకూ కీలకం. బెంగాల్ జనాభా స్వరూపాన్ని మార్చేస్తున్న చొరబాటుదారులు, సిండికేట్లు, కట్-మనీ పాలన నుంచి రాష్ట్రాన్ని బలమైన నాయకత్వం ఉన్న ప్రభుత్వం మాత్రమే విముక్తి చేయగలదు. బెంగాల్ తల్లులు, కుమార్తెల కోసం సురక్షితమైన బెంగాల్ను నిర్మించడానికి ఈరోజు పెద్ద సంఖ్యలో ఓటు వేయండి. సుసంపన్నమైన, అభివృద్ధి చెందిన బెంగాల్ను నిర్మించడానికి ఓటర్లందరూ..ముఖ్యంగా యువత, ముందుగా ఓటు వేసి, ఆ తర్వాత ఈరోజు అల్పాహారం తీసుకోవాలి.’’ అని పేర్కొన్నారు.
Phase 1 of the West Bengal Assembly elections takes place today. I urge all citizens to participate in this festival of democracy with full strength. I especially appeal to my young friends and to the women of West Bengal to vote in large numbers.
— Narendra Modi (@narendramodi) April 23, 2026
As Tamil Nadu votes in the Assembly elections, I call upon all voters to take part enthusiastically in this sacred duty of democracy. I urge the youth and the women of Tamil Nadu in particular to come out and vote in record numbers.
— Narendra Modi (@narendramodi) April 23, 2026
#WATCH | West Bengal Elections 2026 | Long queues of voters formed outside a polling station in Birbhum as polling for the first phase of State Assembly elections begins. pic.twitter.com/3g0WBwSV6L
— ANI (@ANI) April 23, 2026
తాజావార్తలు
-
Michael Jackson Biopic: ఇండియాలో ‘మైఖేల్’ మేనియా.. లక్ష దాటిన టికెట్ల అమ్మకాలు
-
SA vs IND Women: వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి కసితీరా పగ తీర్చుకున్న దక్షిణాఫ్రికా.. 3-0తో భారత్ చిత్తు.!
-
Ninnu Kori: నాని ‘నిన్ను కోరి’ రొమాంటిక్ ట్రీట్.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్
-
KING 100 : దూసుకొస్తున్న కింగ్.. జెట్ స్పీడ్ లో సైలెంట్ గా షూటింగ్
-
Today Astrology: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి శుభ ఫలితాలు!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?