Adhir Ranjan Chowdhury: మమతా బెనర్జీ కళ్లలో భయం, ఇలా ఎప్పుడూ చూడలేదు..
- మమతా బెనర్జీ భయపడుతోంది..
- ఇలా ప్రతీ ప్రాంతానికి పరిగెత్తడం ఎప్పుడూ చూడలేదు..
- ఎన్నికల సంఘం పనితీరు భేష్..
- ప్రజలు నిర్భయంగా ఓటేస్తున్నారు..
- కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adhir Ranjan Chowdhury: పశ్చిమ బెంగాల్లో చివరిదైన రెండో విడత ఎన్నికలు బుధవారం జరుగుతున్నాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ఓట్లు వేస్తున్నారు. మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే, రెండో విడతలో 142 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మమతా బెనర్జీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
భుదవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “మమతా బెనర్జీ తన నియోజకవర్గంలో ఒక బూత్ నుండి మరొక బూత్కు పరుగెత్తడం మనం చూడటం ఇదే మొదటిసారి. ఇలా మునుపెన్నడూ చూడలేదు. ఆమె కళ్లలో, ముఖంలో స్పష్టమైన ఆందోళన కనిపిస్తోంది. నిజానికి, ఈసారి గెలుస్తాననే నమ్మకం ఆమెకు అస్సలు లేదు.” అని అన్నారు. భవానీపూర్ వంటి నియోజకవర్గంలో కూడా ముఖ్యమంత్రి స్వయంగా పరిస్థితిని సమీక్షించడానికి రావడం చూస్తే ఆమె రాజకీయ పరిస్థితి అర్థమవుతుందని ఆయన అన్నారు.
Also Read
- CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
- IMD Alert: దేశ వ్యాప్తంగా రుతుపవనాలు.. ఈ రాష్ట్రాలకు భారీ వర్షాలు
- Nitin Gadkari: 2016కు ముందు వాహనాలకు కొన్ని మార్పులు అవసరం.. E20 పెట్రోల్పై గడ్కరీ..
- Trump-Iran: జోర్డాన్లో అమెరికా స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి.. తీవ్ర ప్రతీకారం ఉంటుందని ట్రంప్ హెచ్చరిక
Read Also: Watermelon Prices: నలుగురు మృతి.. రూ. 7కు పడిపోయిన వాటర్మిలన్ ధరలు..
ఈసారి బెంగాల్ ఎన్నికల్లో భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. ఈ సీటు నుంచే బీజేపీ కీలక నేత సువేందు అధికారి పోటీ చేస్తున్నారు. మమతా బెనర్జీని 2021 ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి సువేందు ఓడించారు. ఈసారి భవానీపూర్ నుంచి కూడా ఓడించేందుకు సిద్ధమైనట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో భవానీపూర్ లోని ప్రతీ ప్రాంతంలో పోలింగ్ రోజున మమతా పర్యటించారు.
బెంగాల్ బర్హంపూర్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి, ఎన్నికల సంఘం ఏర్పాట్లను ప్రశంసించారు. తొలిసారిగా బెంగాల్లో ప్రజలు ఎలాంటి భయం లేకుండా ఓట్లు వేస్తున్నారని అన్నారు. బెంగాల్లో హింసా సంస్కృతి టీఎంసీ వ్యూహంలో భాగమని ఆయన ఆరోపించారు. ఇక్కడ భారీ స్థాయిలో కేంద్ర బలగాలు మోహరించడంతో ప్రజలు నిర్భయంగా ఓటేస్తున్నారని అన్నారు.
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!