Adhir Ranjan Chowdhury: మమతా బెనర్జీ కళ్లలో భయం, ఇలా ఎప్పుడూ చూడలేదు..
- మమతా బెనర్జీ భయపడుతోంది..
- ఇలా ప్రతీ ప్రాంతానికి పరిగెత్తడం ఎప్పుడూ చూడలేదు..
- ఎన్నికల సంఘం పనితీరు భేష్..
- ప్రజలు నిర్భయంగా ఓటేస్తున్నారు..
- కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adhir Ranjan Chowdhury: పశ్చిమ బెంగాల్లో చివరిదైన రెండో విడత ఎన్నికలు బుధవారం జరుగుతున్నాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ఓట్లు వేస్తున్నారు. మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే, రెండో విడతలో 142 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మమతా బెనర్జీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
భుదవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “మమతా బెనర్జీ తన నియోజకవర్గంలో ఒక బూత్ నుండి మరొక బూత్కు పరుగెత్తడం మనం చూడటం ఇదే మొదటిసారి. ఇలా మునుపెన్నడూ చూడలేదు. ఆమె కళ్లలో, ముఖంలో స్పష్టమైన ఆందోళన కనిపిస్తోంది. నిజానికి, ఈసారి గెలుస్తాననే నమ్మకం ఆమెకు అస్సలు లేదు.” అని అన్నారు. భవానీపూర్ వంటి నియోజకవర్గంలో కూడా ముఖ్యమంత్రి స్వయంగా పరిస్థితిని సమీక్షించడానికి రావడం చూస్తే ఆమె రాజకీయ పరిస్థితి అర్థమవుతుందని ఆయన అన్నారు.
Also Read
- PM Modi: తొలిసారి ‘బుక్మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్ఫుల్ బోర్డు
- National Film Awards: దశాబ్దాల సంప్రదాయానికి స్వస్తి.. జాతీయ చలనచిత్ర అవార్డుల వేదిక మార్పు!
- Nitin Gadkari: అండర్వరల్డ్, రెడ్లైట్ ఏరియాల నుంచి ఎక్కువ ఓట్లు.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు..
- Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం..
Read Also: Watermelon Prices: నలుగురు మృతి.. రూ. 7కు పడిపోయిన వాటర్మిలన్ ధరలు..
ఈసారి బెంగాల్ ఎన్నికల్లో భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. ఈ సీటు నుంచే బీజేపీ కీలక నేత సువేందు అధికారి పోటీ చేస్తున్నారు. మమతా బెనర్జీని 2021 ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి సువేందు ఓడించారు. ఈసారి భవానీపూర్ నుంచి కూడా ఓడించేందుకు సిద్ధమైనట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో భవానీపూర్ లోని ప్రతీ ప్రాంతంలో పోలింగ్ రోజున మమతా పర్యటించారు.
బెంగాల్ బర్హంపూర్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి, ఎన్నికల సంఘం ఏర్పాట్లను ప్రశంసించారు. తొలిసారిగా బెంగాల్లో ప్రజలు ఎలాంటి భయం లేకుండా ఓట్లు వేస్తున్నారని అన్నారు. బెంగాల్లో హింసా సంస్కృతి టీఎంసీ వ్యూహంలో భాగమని ఆయన ఆరోపించారు. ఇక్కడ భారీ స్థాయిలో కేంద్ర బలగాలు మోహరించడంతో ప్రజలు నిర్భయంగా ఓటేస్తున్నారని అన్నారు.
తాజావార్తలు
-
Jr NTR: ఆ హీరోల సినిమాలకు హెల్ప్ ఓకే.. మన సినిమాల మాటేంటి?
-
PM Modi: తొలిసారి ‘బుక్మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్ఫుల్ బోర్డు
-
Sajjala Ramakrishna Reddy: ‘డీఎస్సీలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి’..
-
National Film Awards: దశాబ్దాల సంప్రదాయానికి స్వస్తి.. జాతీయ చలనచిత్ర అవార్డుల వేదిక మార్పు!
-
Nitin Gadkari: అండర్వరల్డ్, రెడ్లైట్ ఏరియాల నుంచి ఎక్కువ ఓట్లు.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!