Adhir Ranjan Chowdhury: మమతా బెనర్జీ కళ్లలో భయం, ఇలా ఎప్పుడూ చూడలేదు..
- మమతా బెనర్జీ భయపడుతోంది..
- ఇలా ప్రతీ ప్రాంతానికి పరిగెత్తడం ఎప్పుడూ చూడలేదు..
- ఎన్నికల సంఘం పనితీరు భేష్..
- ప్రజలు నిర్భయంగా ఓటేస్తున్నారు..
- కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adhir Ranjan Chowdhury: పశ్చిమ బెంగాల్లో చివరిదైన రెండో విడత ఎన్నికలు బుధవారం జరుగుతున్నాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ఓట్లు వేస్తున్నారు. మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే, రెండో విడతలో 142 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మమతా బెనర్జీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
భుదవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “మమతా బెనర్జీ తన నియోజకవర్గంలో ఒక బూత్ నుండి మరొక బూత్కు పరుగెత్తడం మనం చూడటం ఇదే మొదటిసారి. ఇలా మునుపెన్నడూ చూడలేదు. ఆమె కళ్లలో, ముఖంలో స్పష్టమైన ఆందోళన కనిపిస్తోంది. నిజానికి, ఈసారి గెలుస్తాననే నమ్మకం ఆమెకు అస్సలు లేదు.” అని అన్నారు. భవానీపూర్ వంటి నియోజకవర్గంలో కూడా ముఖ్యమంత్రి స్వయంగా పరిస్థితిని సమీక్షించడానికి రావడం చూస్తే ఆమె రాజకీయ పరిస్థితి అర్థమవుతుందని ఆయన అన్నారు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
Read Also: Watermelon Prices: నలుగురు మృతి.. రూ. 7కు పడిపోయిన వాటర్మిలన్ ధరలు..
ఈసారి బెంగాల్ ఎన్నికల్లో భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. ఈ సీటు నుంచే బీజేపీ కీలక నేత సువేందు అధికారి పోటీ చేస్తున్నారు. మమతా బెనర్జీని 2021 ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి సువేందు ఓడించారు. ఈసారి భవానీపూర్ నుంచి కూడా ఓడించేందుకు సిద్ధమైనట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో భవానీపూర్ లోని ప్రతీ ప్రాంతంలో పోలింగ్ రోజున మమతా పర్యటించారు.
బెంగాల్ బర్హంపూర్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి, ఎన్నికల సంఘం ఏర్పాట్లను ప్రశంసించారు. తొలిసారిగా బెంగాల్లో ప్రజలు ఎలాంటి భయం లేకుండా ఓట్లు వేస్తున్నారని అన్నారు. బెంగాల్లో హింసా సంస్కృతి టీఎంసీ వ్యూహంలో భాగమని ఆయన ఆరోపించారు. ఇక్కడ భారీ స్థాయిలో కేంద్ర బలగాలు మోహరించడంతో ప్రజలు నిర్భయంగా ఓటేస్తున్నారని అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!