Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఎలా.? వచ్చే 2 రోజులు బెంగాల్ను ఎవరు పాలిస్తారు.?
- మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఎలా.?
- వచ్చే 2 రోజుల పాటు రాష్ట్రంలో ఎవరి పాలన ఉంటుంది..?
- కీలకంగా మారనున్న గవర్నర్ పాత్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజ్యాంగ సంక్షోభం వైపు పయణిస్తోంది. ఓడిపోయినప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సీఎంగా రాజీనామా చేయనని చెబుతోంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ పదవీకాలం ఈరోజు, మే 7వ తేదీతో ముగుస్తుంది. ఈరోజు అర్ధరాత్రి 12 గంటలలోపు మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే, మే 8వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుండి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు పశ్చిమ బెంగాల్ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? అనేది ప్రశ్నగా మారింది.
మరోవైపు, బెంగాల్లో బీజేపీ కొత్త ప్రభుత్వం మే 09న కొలువుదీరబోతోంది. ఈ రెండు రోజులు బెంగాల్లో పాలన ఎవరు చూసుకుంటారనే దానిపై ప్రజలకు సందేహాలు ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 172 ప్రకారం రాష్ట్ర శాసనసభ కాలపరిమితి 5 ఏళ్లు. ఈ కాలం పూర్తయిన తర్వాత అసెంబ్లీ ఆటోమెటిక్గా రద్దవుతుంది. దీనికి ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదు. గురువారం అర్ధరాత్రి 12 గంటలకు పాత శాసనసభ అంటే టీఎంసీ ప్రభుత్వం రద్దవుతుంది. దీంతో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ ఉండరు, వారి చట్టబద్ధమైన అధికారాలను కోల్పోతారు.
Also Read
- CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
- Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
- Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
- Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
గవర్నర్ పాత్రే కీలకం:
రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం, ముఖ్యమంత్రి, అతడి మంత్రివర్గం గవర్నర్ అభీష్టం మేరకు మాత్రమే పదవిలో ఉంటారు. ఎన్నికల తర్వాత సీఎం మెజారిటీ కోల్పోతే, గవర్నర్ వారిని తొలగించి, మెజారిటీ పార్టీ నాయకుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించవచ్చు. అధికారం కోల్పోయిన సీఎం రాజీనామా చేయకుంటే, మంత్రివర్గాన్ని తొలగించే హక్కు గవర్నర్కు ఉంటుంది.
అయితే, 5 ఏళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత అసెంబ్లీ రద్దవుతుంది. తదుపరి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం జరిగే వరకు మమతా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగే సంప్రదాయాన్ని కొనసాగించాలా? వద్దా.? అనే విషయాన్ని గవర్నర్ నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు గవర్నర్ ఆర్ఎన్ రవి తన విచక్షణాధికారాలు ఉపయోగిస్తారు. మమతను ఆపద్ధర్మ సీఎంగా ఉంచుతారా? లేక కొత్త ప్రభుత్వం ఏర్పాటు వరకు రాష్ట్రపతి పాలన విధిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతి పాలన విధిస్తే, గవర్నర్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు వరకు పాలనాబాధ్యతలు చూస్తారు.
ఎన్నికల సంఘం ప్రకారం, బెంగాల్ శాసనసభ పదవీకాలం 2021 మే 8న ప్రారంభమై మే 7న ముగుస్తుంది. దీని తర్వాత గవర్నర్ కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేసి, కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ మమతా రాజీనామా చేయకుంటే భారత రాజకీయ చరిత్రలో ఇది ఒక కొత్త పరిణామంగా మిగిలిపోతుంది.
తాజావార్తలు
-
PEDDI Ki Aawaz: నమస్తే భోపాల్.. దసరా మైదాన్లో ‘పెద్ది’ దిగుతున్నాడు!
-
CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
-
Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
-
UPSC Exam Calendar 2027: UPSC పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. కీలక పరీక్షల తేదీలు ప్రకటించిన కమిషన్
-
Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్కప్లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!