Stolen in Police Station: పోలీస్ స్టేషన్లోనే దొంగతనం.. ఏం ఎత్తుకెళ్లాడో తెలిస్తే షాకే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎవరైనా దొంగతనం జరిగితే పోలీస్ స్టేషన్కు వెళ్తారు.. కానీ, పోలీస్ స్టేషన్లోనే దొంగలు పడితే పరిస్థితి ఏంటి? ఇక, పోలీసులు ధరించే ఖాకీ యూనిఫాం చూస్తేనే చాలా మంది హడలిపోతారు.. కానీ, ఇక్కడ ఆ దొంగ యూనీఫాం కూడా ఎత్తుకెళ్లారు…. పోలీసుల తుపాకీని కూడా కొట్టేశారు.. పది కాట్రిజ్లును కూడా దొంగిలించాడు. పోలీసు డిపార్ట్మెంట్లోనే కలకలం రేపుతోన్న ఈ దొంగతనం ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది..
Read Also: Rs 2,000 notes: మరోసారి రూ.2000 నోట్లపై రచ్చ.. క్లారిటీ ఇదిగో..!
Also Read
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాన్పూర్లోని న్యూ ఆజాద్ నగర్ పరిధిలోని బిద్నూ ఔట్పోస్టులో గత రాత్రి దొంగతనం జరిగింది.. పోలీసు తుపాకీతో పాటు యూనిఫాంను ఎత్తుకెళ్లారు. అయితే, తుపాకీ కనింపించకపోవడంతో.. ఔట్పోస్ట్ ఇన్ఛార్జ్ సుధాకర్ పాండేపై కేసు నమోదు చేశారు.. ఈ విషయం కాస్తా ఉన్నతాధికారుల వరకు వెళ్లింది.. దీంతో.. సుధారక్ పాండేను సస్పెండ్ చేశారు ఆ జిల్లా ఎస్పీ.. ఇక, పోలీస్ స్టేషన్ను పరిశీలించిన ఉన్నతాధికారులు.. తుపాకీతోపాటు యూనీఫాం, పది కాట్రిజ్లు కనిపించకుండా పోయాయని గుర్తించారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.. గురువారం ఉదయం జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న ఎస్పీ, ఫోరెన్సిక్ బృందం సహా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని.. పరిసర ప్రాంతాల్లో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
సమాచారం ప్రకారం, సబ్-ఇన్స్పెక్టర్ సుధాకర్ పాండే న్యూ ఆజాద్ నగర్ చౌకీకి పోస్ట్-ఇన్ఛార్జ్గా నియమితులయ్యారు. నిన్న అర్థరాత్రి దొంగలు పోస్ట్లో ఉన్న పెట్టెను అపహరించి పారిపోయారు. చోరీ జరిగిన విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో పోలీసు శాఖలో కలకలం రేగింది. హడావుడిగా ఐజీ రేంజ్, ఎస్పీ ఔటర్ సహా సర్కిల్ ఫోర్స్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.. ఘటన తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ఫోరెన్సిక్ బృందాన్ని వెంటనే సంఘటనా స్థలానికి రప్పించారు. ఈ దొంగతనం సమయంలో, అవుట్పోస్ట్లో ఉన్న అవుట్పోస్ట్ ఇన్ఛార్జ్ సుధాకర్ పాండే నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సస్పెండ్ చేశారు. ఇక, నిందితులను పట్టుకోవడానికి ఐదు బృందాలను రంగంలోకి దించారు.
తాజావార్తలు
-
UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
-
Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్లో రెండో సెంచరీ నమోదు..
-
North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
-
Spirit: స్పిరిట్ షూటింగ్’కి నెల రోజుల బ్రేక్
-
Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!