PM Modi: “కాంగ్రెస్ ఫేక్ వీడియోల ఫ్యాక్టరీని తెరిచింది”.. రాజ్యాంగాన్ని మార్చే పాపం మేం చేయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: సొంత రాష్ట్రం గుజరాత్లో కాంగ్రెస్పై ప్రధాని నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ‘‘నకిలీ ఫ్యాక్టరీ’’ని నడుపుతోందని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఇటీవల అమిత్ షా చెప్పినట్లు డీప్ ఫేక్ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోను కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్, ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పంచుకున్నారు.
ఈ రోజు బయస్కాంతలో జరిగి ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ ఫేక్ వీడియోల మార్కెట్ను తెరిచింది. ఎన్నికల్లో ఏం మాట్లాడినా పనికిరాదని వారికి తెలుసు కాబట్టే ఇప్పుడు ఫేక్ వీడియోలు తీస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, 60 ఏళ్లుగా దేశాన్ని పాలించిన, ఎంతో మంది ప్రధాన మంత్రులు కలిగిన పార్టీ ప్రజలతో నిజాలు మాట్లాడదు’’ అని ఆయన విమర్శించారు. ప్రేమ దుకాణం అని చెప్పుకుని ద్వేషపూరిత మార్కెట్ని తెరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని కాంగ్రెస్ చూస్తోందని అన్నారు.
Also Read
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
- New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
Read Also: Michael Vaughan: టీ20 ప్రపంచ కప్లో సెమీ ఫైనల్ వెళ్లే జట్లు ఇవే.. టీమిండియాకు నో ఛాన్స్..!
రాజ్యాంగాన్ని మార్చడానికి, రిజర్వేషన్లు తొలగించేందుకు బీజేపీ 400 సీట్లు కోరుతోందని ఆ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తో్ందని కాంగ్రెస్ని విమర్శించారు. ఎన్డీయేలో లేని బిజూ జనాతాదళ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మద్దతుతో ఐదేళ్ల పాటు తమకు 400 మంది ఎంపీలు ఉన్న సంగతి కాంగ్రెస్ పార్టీకి తెలియదా.. కానీ మేం రిజర్వేషన్లు తీసేసే పాపం చేయడానికి పుట్టలేదని మోడీ అన్నారు. ఇదే దారిలో బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం స్వచ్ఛతను కాపాడుకుంటామని, మోడీ జీవించి ఉన్నంత వరకు మతం అధారంగా రిజర్వేషన్లను అనుమతించనని అన్నారు. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలు, సాధారణ కేటగిరీలోని పేదలకు ఇచ్చిన రిజర్వేషన్లు రాజ్యాంగం ఆధారంగానే ఇచ్చామని, దానిని ఎవరూ మార్చలేరని ప్రధాని తన సభకు హామీ ఇచ్చారు.
రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ.. యువరాజు, కాంగ్రెస్ ళితులు, గిరిజనులు, OBCలు మరియు పేదల నుండి రిజర్వేషన్లను లాక్కోవాలని, మతం ఆధారంగా ముస్లింలకు ఇవ్వాలని కోరుకుంటోందని అన్నారు. ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో తమ ఓటు బ్యాంకు కోసం రిజర్వేషన్లు తీసేయాలని కాంగ్రెస్ చూస్తోందని, అందుకే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రధాని అన్నారు. గుజరాత్లోని మొత్తం 26 స్థానాలకు మే 7న మూడో దశలో ఓటింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
తాజావార్తలు
-
Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..