PM Modi: “కాంగ్రెస్ ఫేక్ వీడియోల ఫ్యాక్టరీని తెరిచింది”.. రాజ్యాంగాన్ని మార్చే పాపం మేం చేయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: సొంత రాష్ట్రం గుజరాత్లో కాంగ్రెస్పై ప్రధాని నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ‘‘నకిలీ ఫ్యాక్టరీ’’ని నడుపుతోందని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఇటీవల అమిత్ షా చెప్పినట్లు డీప్ ఫేక్ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోను కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్, ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పంచుకున్నారు.
ఈ రోజు బయస్కాంతలో జరిగి ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ ఫేక్ వీడియోల మార్కెట్ను తెరిచింది. ఎన్నికల్లో ఏం మాట్లాడినా పనికిరాదని వారికి తెలుసు కాబట్టే ఇప్పుడు ఫేక్ వీడియోలు తీస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, 60 ఏళ్లుగా దేశాన్ని పాలించిన, ఎంతో మంది ప్రధాన మంత్రులు కలిగిన పార్టీ ప్రజలతో నిజాలు మాట్లాడదు’’ అని ఆయన విమర్శించారు. ప్రేమ దుకాణం అని చెప్పుకుని ద్వేషపూరిత మార్కెట్ని తెరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని కాంగ్రెస్ చూస్తోందని అన్నారు.
Also Read
- Fraud: షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. లాభాలు చూపిస్తామంటూ బురిడీ..
- Suvendu Adhikari: దీదీ ‘ఖతం’ చేయాలనుకున్న గూర్ఖా దళానికి ఊపిరి పోస్తున్న సువేందు అధికారి.. బెంగాల్లో రాజకీయాల్లో కొత్త రచ్చ!
- IMD Rain Alert: తెలంగాణతో పాటు ఈ రాష్ట్రాల్లో రుతుపవనాలు.. ఎప్పటి నుంచి వర్షాలంటే..!
- Melodi: ‘‘ఇన్స్టాలో మనమే ఫేమస్ కపుల్’’.. జీ7లో స్పెషల్ అట్రాక్షన్గా మోడీ-మెలోనీ
Read Also: Michael Vaughan: టీ20 ప్రపంచ కప్లో సెమీ ఫైనల్ వెళ్లే జట్లు ఇవే.. టీమిండియాకు నో ఛాన్స్..!
రాజ్యాంగాన్ని మార్చడానికి, రిజర్వేషన్లు తొలగించేందుకు బీజేపీ 400 సీట్లు కోరుతోందని ఆ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తో్ందని కాంగ్రెస్ని విమర్శించారు. ఎన్డీయేలో లేని బిజూ జనాతాదళ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మద్దతుతో ఐదేళ్ల పాటు తమకు 400 మంది ఎంపీలు ఉన్న సంగతి కాంగ్రెస్ పార్టీకి తెలియదా.. కానీ మేం రిజర్వేషన్లు తీసేసే పాపం చేయడానికి పుట్టలేదని మోడీ అన్నారు. ఇదే దారిలో బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం స్వచ్ఛతను కాపాడుకుంటామని, మోడీ జీవించి ఉన్నంత వరకు మతం అధారంగా రిజర్వేషన్లను అనుమతించనని అన్నారు. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలు, సాధారణ కేటగిరీలోని పేదలకు ఇచ్చిన రిజర్వేషన్లు రాజ్యాంగం ఆధారంగానే ఇచ్చామని, దానిని ఎవరూ మార్చలేరని ప్రధాని తన సభకు హామీ ఇచ్చారు.
రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ.. యువరాజు, కాంగ్రెస్ ళితులు, గిరిజనులు, OBCలు మరియు పేదల నుండి రిజర్వేషన్లను లాక్కోవాలని, మతం ఆధారంగా ముస్లింలకు ఇవ్వాలని కోరుకుంటోందని అన్నారు. ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో తమ ఓటు బ్యాంకు కోసం రిజర్వేషన్లు తీసేయాలని కాంగ్రెస్ చూస్తోందని, అందుకే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రధాని అన్నారు. గుజరాత్లోని మొత్తం 26 స్థానాలకు మే 7న మూడో దశలో ఓటింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
తాజావార్తలు
-
Tea and Biscuits: ఖాళీ కడుపుతో టీ, బిస్కెట్లు తింటున్నారా..? ఎయిమ్స్ వైద్యుల కీలక హెచ్చరిక
-
INDA Vs AFGA: ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా.. ఆప్ఘనిస్థాన్పై భారీ విజయం..
-
G7 Summit: ఉక్రెయిన్కు పెరిగిన సైనిక, ఇంధన మద్దతు.. రష్యాపై ఆంక్షలకు జీ7 దేశాలు గ్రీన్సిగ్నల్
-
Anil Ravipudi: రేపే అనిల్ రావిపూడి కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!
-
Kitchen Hacks: వర్కింగ్ ఉమెన్స్ కోసం కిచెన్ సీక్రెట్స్.. ఈ చిట్కాలతో వంట పని ఇక చిటికెలోనే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!