CM Siddaramaiah: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. భారత సైన్యం సర్వం సిద్ధంగా ఉంది. మరోవైపు, పాకిస్తాన్ కూడా ఇండియా నుంచి ఎదురయ్యే దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటిస్తోంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం కాంగ్రెస్ నేత, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
Read Also: CM Chandrababu: మత్స్యకార భరోసా పథకానికి సీఎం శ్రీకారం.. రూ.20 వేలకు పెరిగిన భృతి..
శనివారం మైసూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్పై యుద్ధం చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ‘‘యుద్ధం చేయానికి అనుకూలంగా మేము లేము. శాంతితో ఉండాలి’’ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం భద్రతా చర్యల్ని బలోపేతం చేయాలని కోరారు. పాకిస్తాన్ పౌరుల్ని దేశం నుంచి బయటకు పంపాలని అన్ని రాష్ట్రాలని కేంద్రం కోరడంపై స్పందిస్తూ.. మేము సహకరిస్తున్నామని, రాష్ట్రంలో పాకిస్తాన్ పౌరుల గురించి సమాచారాన్ని కేంద్రానికి అందిస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే, ఆయన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్, పాకిస్తాన్ ఒకే భాష మాట్లాడుతాయని విమర్శించింది.