Bengaluru: ఎయిర్పోర్టులో పగిలిన పైపు లైన్.. జలమయమైన కార్యాలయాలు
- బెంగళూరు ఎయిర్పోర్టులో పగిలిన పైపు లైన్
- ఎయిర్లైన్ కార్యాలయాలు జలమయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరు ఎయిర్పోర్టులోని టెర్మినల్-2 దగ్గర వాటర్ పైపు పగిలిపోయింది. దీంతో విమానాశ్రయంలో ఉన్న కార్యాలయాల్లోకి నీరు వచ్చి చేరింది. దీంతో ఆఫీసులన్నీ నీటితో జలమయం అయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఘటనతో విమాన రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఏర్పడలేదని బీఐఏఎల్ అధికారులు తెలిపారు. ఆయా ఎయిర్లైన్స్ కార్యాలయాల్లోకి మాత్రం నీరు వచ్చి చేరిందని వెల్లడించారు. బెంగళూరు విమానాశ్రయంలోని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని స్వంకీ టెర్మినల్ 2లో జనవరి 1న పైప్ పేలడంతో నీరు లీకేజ్ అయిందని చెప్పారు. ఎయిర్లైన్ కార్యాలయాలు ఉన్న మొదటి అంతస్తులో నీరు చేరిందని తెలిపారు.
Also Read
ఇది కూడా చదవండి: Switzerland: స్విట్జర్లాండ్లో బుర్ఖా నిషేధం.. చట్టాన్ని అతిక్రమిస్తే ఫైన్ ఎంతంటే..!
నీరు లీకేజీ కావడంతో విమానాశ్రయం, ఎయిర్లైన్ సిబ్బంది తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. బుధవారం రాత్రి 7:30 గంటల నుంచి సీలింగ్లోంచి నీరు కారుతూనే ఉంది. దీంతో ఎయిరిండియా ఎక్స్ప్రెస్, సౌదీ, జపాన్ ఎయిర్లైన్స్ సంస్థల కార్యాలయాలు జలమయం అయ్యాయి. సిబ్బంది తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఎయిర్లైన్ ఆపరేటర్ల బ్యాగేజ్ ట్యాగ్లు, రోల్స్, బోర్డింగ్ పాస్లు వంటి వస్తువులు నీటిలో నానిపోయాయి. సమస్యను గుర్తించి మరమ్మత్తులు చేపట్టారు.
టెర్మినల్-2 రూ.5,000 కోట్లతో నిర్మించారు. 2022, నవంబర్ 11న ఎయిర్పోర్టును ప్రారంభించారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమైంది. దీనిని ‘టెర్మినల్ ఇన్ ఎ గార్డెన్’గా నామకరణం చేశారు. ప్రపంచంలోని అత్యంత అందమైన విమానాశ్రయాలలో ఒకటిగా గుర్తించబడింది. దేశీయ కార్యకలాపాలు జనవరి 15, 2023న ప్రారంభం కాగా… అంతర్జాతీయ కార్యకలాపాలు సెప్టెంబరు 12, 2023న ప్రారంభమయ్యాయి. అయితే టెర్మినల్లో మే 2023లోనే మొదటి నీటి లీకేజీని ఎదుర్కొంది. మే 9, 2024న భారీ వర్షాల కారణంగా కన్వేయర్ బెల్ట్ దగ్గర నీటి లీకేజీ ఏర్పడింది. అప్పటి నుంచి టెర్మినల్ ఈ ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంది.
ఇది కూడా చదవండి: Rohit Sharma : ఐదో టెస్టు నుంచి కెప్టెన్ రోహిత్ ఔట్?
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!