Bengaluru: ఎయిర్పోర్టులో పగిలిన పైపు లైన్.. జలమయమైన కార్యాలయాలు
- బెంగళూరు ఎయిర్పోర్టులో పగిలిన పైపు లైన్
- ఎయిర్లైన్ కార్యాలయాలు జలమయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరు ఎయిర్పోర్టులోని టెర్మినల్-2 దగ్గర వాటర్ పైపు పగిలిపోయింది. దీంతో విమానాశ్రయంలో ఉన్న కార్యాలయాల్లోకి నీరు వచ్చి చేరింది. దీంతో ఆఫీసులన్నీ నీటితో జలమయం అయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఘటనతో విమాన రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఏర్పడలేదని బీఐఏఎల్ అధికారులు తెలిపారు. ఆయా ఎయిర్లైన్స్ కార్యాలయాల్లోకి మాత్రం నీరు వచ్చి చేరిందని వెల్లడించారు. బెంగళూరు విమానాశ్రయంలోని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని స్వంకీ టెర్మినల్ 2లో జనవరి 1న పైప్ పేలడంతో నీరు లీకేజ్ అయిందని చెప్పారు. ఎయిర్లైన్ కార్యాలయాలు ఉన్న మొదటి అంతస్తులో నీరు చేరిందని తెలిపారు.
Also Read
- Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
- Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
- Bharat Gaurav: నేపాల్కు 'భారత్ గౌరవ్' పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇది కూడా చదవండి: Switzerland: స్విట్జర్లాండ్లో బుర్ఖా నిషేధం.. చట్టాన్ని అతిక్రమిస్తే ఫైన్ ఎంతంటే..!
నీరు లీకేజీ కావడంతో విమానాశ్రయం, ఎయిర్లైన్ సిబ్బంది తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. బుధవారం రాత్రి 7:30 గంటల నుంచి సీలింగ్లోంచి నీరు కారుతూనే ఉంది. దీంతో ఎయిరిండియా ఎక్స్ప్రెస్, సౌదీ, జపాన్ ఎయిర్లైన్స్ సంస్థల కార్యాలయాలు జలమయం అయ్యాయి. సిబ్బంది తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఎయిర్లైన్ ఆపరేటర్ల బ్యాగేజ్ ట్యాగ్లు, రోల్స్, బోర్డింగ్ పాస్లు వంటి వస్తువులు నీటిలో నానిపోయాయి. సమస్యను గుర్తించి మరమ్మత్తులు చేపట్టారు.
టెర్మినల్-2 రూ.5,000 కోట్లతో నిర్మించారు. 2022, నవంబర్ 11న ఎయిర్పోర్టును ప్రారంభించారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమైంది. దీనిని ‘టెర్మినల్ ఇన్ ఎ గార్డెన్’గా నామకరణం చేశారు. ప్రపంచంలోని అత్యంత అందమైన విమానాశ్రయాలలో ఒకటిగా గుర్తించబడింది. దేశీయ కార్యకలాపాలు జనవరి 15, 2023న ప్రారంభం కాగా… అంతర్జాతీయ కార్యకలాపాలు సెప్టెంబరు 12, 2023న ప్రారంభమయ్యాయి. అయితే టెర్మినల్లో మే 2023లోనే మొదటి నీటి లీకేజీని ఎదుర్కొంది. మే 9, 2024న భారీ వర్షాల కారణంగా కన్వేయర్ బెల్ట్ దగ్గర నీటి లీకేజీ ఏర్పడింది. అప్పటి నుంచి టెర్మినల్ ఈ ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంది.
ఇది కూడా చదవండి: Rohit Sharma : ఐదో టెస్టు నుంచి కెప్టెన్ రోహిత్ ఔట్?
తాజావార్తలు
-
Tollywood : చదువుకోవడం కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్
-
Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
-
Donald Trump: త్వరగా నిర్ణయం తీసుకోండి, లేకపోతే మీకు ఏమీ మిగలదు.. ఇరాన్ను మళ్లీ హెచ్చరించిన ట్రంప్
-
Veera Bhadrudu : ‘వీర భద్రుడు’కు అసలు పరీక్ష ఇదే..
-
Axar Patel: మిచెల్ స్టార్క్తో చర్చ.. ఆసక్తికర సమాధానం చెప్పిన అక్షర్ పటేల్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..