Bengaluru: ఎయిర్పోర్టులో పగిలిన పైపు లైన్.. జలమయమైన కార్యాలయాలు
- బెంగళూరు ఎయిర్పోర్టులో పగిలిన పైపు లైన్
- ఎయిర్లైన్ కార్యాలయాలు జలమయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరు ఎయిర్పోర్టులోని టెర్మినల్-2 దగ్గర వాటర్ పైపు పగిలిపోయింది. దీంతో విమానాశ్రయంలో ఉన్న కార్యాలయాల్లోకి నీరు వచ్చి చేరింది. దీంతో ఆఫీసులన్నీ నీటితో జలమయం అయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఘటనతో విమాన రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఏర్పడలేదని బీఐఏఎల్ అధికారులు తెలిపారు. ఆయా ఎయిర్లైన్స్ కార్యాలయాల్లోకి మాత్రం నీరు వచ్చి చేరిందని వెల్లడించారు. బెంగళూరు విమానాశ్రయంలోని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని స్వంకీ టెర్మినల్ 2లో జనవరి 1న పైప్ పేలడంతో నీరు లీకేజ్ అయిందని చెప్పారు. ఎయిర్లైన్ కార్యాలయాలు ఉన్న మొదటి అంతస్తులో నీరు చేరిందని తెలిపారు.
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
ఇది కూడా చదవండి: Switzerland: స్విట్జర్లాండ్లో బుర్ఖా నిషేధం.. చట్టాన్ని అతిక్రమిస్తే ఫైన్ ఎంతంటే..!
నీరు లీకేజీ కావడంతో విమానాశ్రయం, ఎయిర్లైన్ సిబ్బంది తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. బుధవారం రాత్రి 7:30 గంటల నుంచి సీలింగ్లోంచి నీరు కారుతూనే ఉంది. దీంతో ఎయిరిండియా ఎక్స్ప్రెస్, సౌదీ, జపాన్ ఎయిర్లైన్స్ సంస్థల కార్యాలయాలు జలమయం అయ్యాయి. సిబ్బంది తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఎయిర్లైన్ ఆపరేటర్ల బ్యాగేజ్ ట్యాగ్లు, రోల్స్, బోర్డింగ్ పాస్లు వంటి వస్తువులు నీటిలో నానిపోయాయి. సమస్యను గుర్తించి మరమ్మత్తులు చేపట్టారు.
టెర్మినల్-2 రూ.5,000 కోట్లతో నిర్మించారు. 2022, నవంబర్ 11న ఎయిర్పోర్టును ప్రారంభించారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమైంది. దీనిని ‘టెర్మినల్ ఇన్ ఎ గార్డెన్’గా నామకరణం చేశారు. ప్రపంచంలోని అత్యంత అందమైన విమానాశ్రయాలలో ఒకటిగా గుర్తించబడింది. దేశీయ కార్యకలాపాలు జనవరి 15, 2023న ప్రారంభం కాగా… అంతర్జాతీయ కార్యకలాపాలు సెప్టెంబరు 12, 2023న ప్రారంభమయ్యాయి. అయితే టెర్మినల్లో మే 2023లోనే మొదటి నీటి లీకేజీని ఎదుర్కొంది. మే 9, 2024న భారీ వర్షాల కారణంగా కన్వేయర్ బెల్ట్ దగ్గర నీటి లీకేజీ ఏర్పడింది. అప్పటి నుంచి టెర్మినల్ ఈ ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంది.
ఇది కూడా చదవండి: Rohit Sharma : ఐదో టెస్టు నుంచి కెప్టెన్ రోహిత్ ఔట్?
తాజావార్తలు
-
OTT Movies: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే తెలుగు, తమిళ సినిమాలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
OG Universe : OG – 2 ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ – సుజీత్
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..