Devendra Fadnavis: లోక్సభ ఎన్నికల వలే ఓట్ జీహాద్ ఈసారి పనిచేయదు..
- రాబోయే ఎన్నికల్లో ఓట్ జిహాద్ పనిచేయదు..
- లోక్సభ సమయంలో కాంగ్రెస్ నకిలీ వ్యాఖ్యలు చేసింది..
- ఈ ఎన్నికల్లో గెలిచేది బీజేపీ కూటమి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devendra Fadnavis: రాబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో ‘‘ఓట్ జిహాద్’’, నకిలీ కథనాలు పని చేయలేయవని బీజేపీ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఎన్డీటీవీతో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేవారు. నవంబర్ 20 ఎన్నికల తర్వాత మహాయుతి కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన ఈ రోజు ధీమా వ్యక్తం చేశారు. ‘‘లోక్సభ ఎన్నికల్లో ఓట్ జిహాద్ నిజమైన ఫ్యాక్టర్. ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు. మోడీని తొలగించడమే వీరి లక్ష్యం. ఈ సారి అది పనిచేయదు’’ అని ఫడ్నవీస్ అన్నారు.
Read Also: Jharkhand: జార్ఖండ్ ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్గా టీమిండియా మాజీ కెప్టెన్..
Also Read
లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని మొత్తం 48 సీట్లలో బీజేపీ కూటమి 17 సీట్లు మాత్రమే సాధించింది. కాంగ్రెస్-శరద్ పవార్-ఉద్ధవ్ ఠాక్రే కూటమి 30 సీట్లు గెలుచుకుంది. ‘‘లోక్సభ ఎన్నికల సమయంలో మహా వికాస్ అఘాడి ఒక నకిలీ కథనాన్ని సృష్టించారు. మేము దానిని సూటిగా ఎదుర్కొన్నాము. ఇప్పుడు వారు అబద్ధాలు చెప్పారని ప్రజలకు తెలుసు. వారు (ప్రధాని నరేంద్ర) మోడీజీ వచ్చి రాజ్యాంగాన్ని మార్చివేస్తారని, రిజర్వేషన్లను అంతం చేస్తారని అన్నారు. ప్రజలు మహావికాస్ అఘాడీకి ఓటేశారు. అయితే, రాహుల్ గాంధీ మాత్రం విదేశాలకు వెళ్లి రిజర్వేషన్లు తగ్గిస్తాం. వాటిని అంతం చేస్తామని అన్నారు’’ అని ఫడ్నవీస్ అన్నారు.
మహారాష్ట్రలో దళితుల ఓట్లు ముఖ్యమే కానీ, మహరాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాల్లో ఏ వర్గం కూడా ఎన్నికలను నిర్ణయించలేదని, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నకిలీ వ్యాఖ్యల వల్లే దళితులు మాకు దూరమయ్యారని, కానీ ఇప్పుడు అలా జరగదని చెప్పారు. ఓ వర్గం మీడియా అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా, నాయకుల విమర్శలపై మాత్రమే చూపిస్తుందని అన్నారు. అయితే, ఫడ్నవీస్ వ్యాఖ్యల్ని ఉద్ధవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్ తిప్పికొట్టారు. మీకు ముస్లింలు ఓటేస్తే ఓట్ జిహాద్ కాదు, మాకు ఓటేస్తే ఓట్ జిహాద్ అవుతుందా.? అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్పై పోరాటం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!