Devendra Fadnavis: లోక్సభ ఎన్నికల వలే ఓట్ జీహాద్ ఈసారి పనిచేయదు..
- రాబోయే ఎన్నికల్లో ఓట్ జిహాద్ పనిచేయదు..
- లోక్సభ సమయంలో కాంగ్రెస్ నకిలీ వ్యాఖ్యలు చేసింది..
- ఈ ఎన్నికల్లో గెలిచేది బీజేపీ కూటమి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devendra Fadnavis: రాబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో ‘‘ఓట్ జిహాద్’’, నకిలీ కథనాలు పని చేయలేయవని బీజేపీ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఎన్డీటీవీతో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేవారు. నవంబర్ 20 ఎన్నికల తర్వాత మహాయుతి కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన ఈ రోజు ధీమా వ్యక్తం చేశారు. ‘‘లోక్సభ ఎన్నికల్లో ఓట్ జిహాద్ నిజమైన ఫ్యాక్టర్. ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు. మోడీని తొలగించడమే వీరి లక్ష్యం. ఈ సారి అది పనిచేయదు’’ అని ఫడ్నవీస్ అన్నారు.
Read Also: Jharkhand: జార్ఖండ్ ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్గా టీమిండియా మాజీ కెప్టెన్..
Also Read
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
- Passport Row: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
- Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని మొత్తం 48 సీట్లలో బీజేపీ కూటమి 17 సీట్లు మాత్రమే సాధించింది. కాంగ్రెస్-శరద్ పవార్-ఉద్ధవ్ ఠాక్రే కూటమి 30 సీట్లు గెలుచుకుంది. ‘‘లోక్సభ ఎన్నికల సమయంలో మహా వికాస్ అఘాడి ఒక నకిలీ కథనాన్ని సృష్టించారు. మేము దానిని సూటిగా ఎదుర్కొన్నాము. ఇప్పుడు వారు అబద్ధాలు చెప్పారని ప్రజలకు తెలుసు. వారు (ప్రధాని నరేంద్ర) మోడీజీ వచ్చి రాజ్యాంగాన్ని మార్చివేస్తారని, రిజర్వేషన్లను అంతం చేస్తారని అన్నారు. ప్రజలు మహావికాస్ అఘాడీకి ఓటేశారు. అయితే, రాహుల్ గాంధీ మాత్రం విదేశాలకు వెళ్లి రిజర్వేషన్లు తగ్గిస్తాం. వాటిని అంతం చేస్తామని అన్నారు’’ అని ఫడ్నవీస్ అన్నారు.
మహారాష్ట్రలో దళితుల ఓట్లు ముఖ్యమే కానీ, మహరాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాల్లో ఏ వర్గం కూడా ఎన్నికలను నిర్ణయించలేదని, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నకిలీ వ్యాఖ్యల వల్లే దళితులు మాకు దూరమయ్యారని, కానీ ఇప్పుడు అలా జరగదని చెప్పారు. ఓ వర్గం మీడియా అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా, నాయకుల విమర్శలపై మాత్రమే చూపిస్తుందని అన్నారు. అయితే, ఫడ్నవీస్ వ్యాఖ్యల్ని ఉద్ధవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్ తిప్పికొట్టారు. మీకు ముస్లింలు ఓటేస్తే ఓట్ జిహాద్ కాదు, మాకు ఓటేస్తే ఓట్ జిహాద్ అవుతుందా.? అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Specific Carbohydrate Diet for Gut Health: పేగుల సమస్యలకు డైట్ థెరపీ.. వైద్యులు ఏమంటున్నారు?
-
Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!