Devendra Fadnavis: లోక్సభ ఎన్నికల వలే ఓట్ జీహాద్ ఈసారి పనిచేయదు..
- రాబోయే ఎన్నికల్లో ఓట్ జిహాద్ పనిచేయదు..
- లోక్సభ సమయంలో కాంగ్రెస్ నకిలీ వ్యాఖ్యలు చేసింది..
- ఈ ఎన్నికల్లో గెలిచేది బీజేపీ కూటమి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devendra Fadnavis: రాబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో ‘‘ఓట్ జిహాద్’’, నకిలీ కథనాలు పని చేయలేయవని బీజేపీ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఎన్డీటీవీతో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేవారు. నవంబర్ 20 ఎన్నికల తర్వాత మహాయుతి కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన ఈ రోజు ధీమా వ్యక్తం చేశారు. ‘‘లోక్సభ ఎన్నికల్లో ఓట్ జిహాద్ నిజమైన ఫ్యాక్టర్. ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు. మోడీని తొలగించడమే వీరి లక్ష్యం. ఈ సారి అది పనిచేయదు’’ అని ఫడ్నవీస్ అన్నారు.
Read Also: Jharkhand: జార్ఖండ్ ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్గా టీమిండియా మాజీ కెప్టెన్..
Also Read
- CJI Surya Kant: లండన్లో సీజేఐ సూర్యకాంత్కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
- Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
- Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
- Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని మొత్తం 48 సీట్లలో బీజేపీ కూటమి 17 సీట్లు మాత్రమే సాధించింది. కాంగ్రెస్-శరద్ పవార్-ఉద్ధవ్ ఠాక్రే కూటమి 30 సీట్లు గెలుచుకుంది. ‘‘లోక్సభ ఎన్నికల సమయంలో మహా వికాస్ అఘాడి ఒక నకిలీ కథనాన్ని సృష్టించారు. మేము దానిని సూటిగా ఎదుర్కొన్నాము. ఇప్పుడు వారు అబద్ధాలు చెప్పారని ప్రజలకు తెలుసు. వారు (ప్రధాని నరేంద్ర) మోడీజీ వచ్చి రాజ్యాంగాన్ని మార్చివేస్తారని, రిజర్వేషన్లను అంతం చేస్తారని అన్నారు. ప్రజలు మహావికాస్ అఘాడీకి ఓటేశారు. అయితే, రాహుల్ గాంధీ మాత్రం విదేశాలకు వెళ్లి రిజర్వేషన్లు తగ్గిస్తాం. వాటిని అంతం చేస్తామని అన్నారు’’ అని ఫడ్నవీస్ అన్నారు.
మహారాష్ట్రలో దళితుల ఓట్లు ముఖ్యమే కానీ, మహరాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాల్లో ఏ వర్గం కూడా ఎన్నికలను నిర్ణయించలేదని, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నకిలీ వ్యాఖ్యల వల్లే దళితులు మాకు దూరమయ్యారని, కానీ ఇప్పుడు అలా జరగదని చెప్పారు. ఓ వర్గం మీడియా అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా, నాయకుల విమర్శలపై మాత్రమే చూపిస్తుందని అన్నారు. అయితే, ఫడ్నవీస్ వ్యాఖ్యల్ని ఉద్ధవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్ తిప్పికొట్టారు. మీకు ముస్లింలు ఓటేస్తే ఓట్ జిహాద్ కాదు, మాకు ఓటేస్తే ఓట్ జిహాద్ అవుతుందా.? అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
The Earth: భూగర్భ జలాల దోపిడి.. 31.5 అంగుళాలు వంగిన భూమి!
-
CJI Surya Kant: లండన్లో సీజేఐ సూర్యకాంత్కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
-
IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
-
SKY: కెప్టెన్సీ తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..
-
Stree Ride : మహిళల కోసం ‘స్త్రీ రైడ్’.. ఇక డ్రైవర్ కూడా మహిళే..!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!