Virender Sehwag: మనసున్నోడు మా వీరు.. రైలు ప్రమాదంలో అనాథలైన పిల్లలకు ఉచిత విద్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virender Sehwag: ఒడిశా బాలాసోర్ రైలు దుర్ఘటన అందర్ని కలిచి వేస్తోంది. ఇప్పటికే ఈ ప్రమాదంలో 270కి పైగా మంది చనిపోయారు. 1000 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. చాలా మంది పరిస్థితి విషమంగానే ఉంది. అయితే ఈ ప్రమాదంపై సెలబ్రెటీలు చలించిపోతున్నారు. వివిధ దేశాని నేతలు, ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. చాలా మంది రైలు ప్రమాదంలో తల్లిదండ్రులు మరణించడంతో అనాథలుగా మిగిలిన పిల్లలకు అండగా నిలబడేందుకు ముందుకు వస్తున్నారు.
Read Also: Maruti Suzuki Jimny: రేపు లాంచ్ కాబోతున్న మారుతి సుజుకీ జిమ్నీ..
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
ఇప్పటికే ప్రముఖ బిలియనీర్, వ్యాపారవేత్త గౌతమ్ అదానీ తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను చదివించేందుకు ముందుకు వచ్చారు. ఉచితంగా విద్యను అందిస్తానని ప్రకటించారు. తాజాగా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా అనాథలైన పిల్లలను అదుకునేందుకు ముందుకు వచ్చారు. తన స్కూల్ లో ఉచితంగా విద్యను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ‘‘ ఈ చిత్రం చాలా కాలం పాటు మనల్ని వెంటాడుతుంది. ఈ విషాద సమయంలో, ఈ విషాద ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లల చదువుల పట్ల శ్రద్ధ వహించడమే నేను చేయగలిగింది. నేను అలాంటి పిల్లలకు సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ బోర్డింగ్ సదుపాయంలో ఉచిత విద్యను అందిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు.
శుక్రవారం సాయంత్రం ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో మూడు రైళ్లు- షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్, ఒక గూడ్స్ రైలు ప్రమాదానికి గురయ్యాయి. మూడు దశాబ్ధాల రైల్వే చరిత్రలో ఇదే అత్యంత పెద్ద ప్రమాదంగా నిలిచింది. మరోవైపు ఈ ప్రమాదంపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని రైల్వే బోర్డు సిఫారసు చేసింది.
This image will haunt us for a long time.
In this hour of grief, the least I can do is to take care of education of children of those who lost their life in this tragic accident. I offer such children free education at Sehwag International School’s boarding facility 🙏🏼 pic.twitter.com/b9DAuWEoTy
— Virrender Sehwag (@virendersehwag) June 4, 2023
తాజావార్తలు
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
Strait of Hormuz: హోర్ముజ్పై ఇరాన్ కొత్త ప్లాన్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..
-
KA Productions: కిరణ్ అబ్బవరం బ్యానర్లో మరో డిఫరెంట్ మూవీ.. గూస్బంప్స్ తెప్పిస్తున్న మిస్టరీ పోస్టర్!
-
Irumudi Movie Controversy : ‘ఇరుముడి’ సినిమాపై వివాదం.. ఆ సీన్లు తొలగించాలని డిమాండ్
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!