Vijay: ‘‘తలవంచేది లేదు, ఒంటరిగా గెలుస్తాం’’.. టీవీకే చీఫ్ విజయ్ కీలక వ్యాఖ్యలు..
- ‘‘భయపడేది లేదు, తలవంచేది లేదు’’..
- ఎన్నికల్లో ఒంటరిగానే గెలుస్తాం..
- పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసిన టీవీకే విజయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay: కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే చీఫ్, సినీ నటుడు విజయ్ను సీబీఐ విచారిస్తోంది. ఆయన చివరి సినిమాగా చెప్పబడుతున్న ‘‘జన నాయగన్’’ విడుదల కూడా వివాదంలో చిక్కుకుంది. ఈ పరిణామాల తర్వాత తొలిసారిగా విజయ్ తన పార్టీ టీవీకే సమావేశానికి హాజరయ్యారు. 3000 మంది రాష్ట్ర, జిల్లా స్థాయి కార్యకర్తలతో మామల్లపురంలో జరిగిన వ్యూహాత్మక సమావేశంలో విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు తాను ‘‘ఒత్తిడికి లొంగిపోవనని’’, ‘‘తలవంచనని’’ అన్నారు.
మరికొన్ని రోజుల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో ఈ సమావేశం నుంచి పదునైన విమర్శలు చేశారు. ఇది కేవలం ఎన్నికలు మాత్రమే కాదని, ప్రజాస్వామ్య యుద్ధమని అన్నారు. ఈ యుద్ధంలో పోరాడే నా కమాండోలు కార్యకర్తలే అని చెప్పారు. డీఎంకే, అన్నాడీఎంకేలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ప్రతీ ఓటును రక్షంచాలని, ప్రతీ ఒక్కరిని కలవాలని కార్యకర్తల్ని ఉత్తేజపరిచారు. దుష్ట శక్తి’ (డీఎంకే) మరియు ‘అవినీతి శక్తి’ (ఏఐఏడీఎంకే)లను ఎదుర్కొనే ధైర్యం కేవలం టీవీకేకు మాత్రమే ఉందని విజయ్ అన్నారు.
Also Read
- AC Temperature Guidelines: విద్యుత్ బిల్లులకు చెక్..! ఏసీ ఎన్ని డిగ్రీల్లో వాడాలి..? ప్రభుత్వం సూచనలు
- Shakambari Devi Temple Flood: వరదల్లో చిక్కుకున్న శాకంబరి ఆలయం.. ఇద్దరు మహిళా భక్తులు మృతి.!
- Supreme Court: దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్ ‘112’.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు
- Supreme Court: సె*క్స్ వర్కర్ల హక్కుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. చారిత్రాత్మక మార్గదర్శకాలు..
Read Also: T20 World Cup: దెబ్బకు దిగొచ్చిన పాకిస్తాన్.. ఐసీసీ వార్నింగ్లో జట్టు ప్రకటన..
రాష్ట్రవ్యాప్తం ప్రచారాన్ని సోమవారం నుంచి ప్రారంభించబోతున్నట్లు టీవీకే నాయకులు చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసేలా ప్లాన్ రూపొందించారు. అయితే, పొత్తులపై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు(ఆదివారం) జరిగిన కార్యక్రమంలో విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘తాము ఏ స్నేహితుడు లేకుండా ఒంటరిగానే గెలుస్తాము’’ అని అన్నారు.
గత సంవత్సరం సెప్టెంబర్లో, తమిళనాడులోని కరూర్లో విజయ్ ప్రసంగించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు. ఈ విషయమై ప్రస్తుతం సీబీఐ అతడిపై దర్యాప్తు చేస్తోంది, ఢిల్లీలో అతడిని రెండుసార్లు విచారించింది. విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదలను సెన్సార్ బోర్డు నిలిపివేయడంతో అది వార్తల్లో నిలిచింది. సినిమా వివాదం ప్రస్తుతం కోర్టుల పరిధిలో ఉంది.
తాజావార్తలు
-
LIC Shares: ఎల్ఐసీ షేర్స్ లో భారీ పతనం.. రూ.820 నుండి రూ.414 కు పడిపోయిన షేర్స్.. అసలు కారణం ఇదే!
-
Peddi : బెజవాడలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. సెలబ్రేషన్స్ పీక్స్
-
Pawan Kalyan: గోదావరి పుష్కరాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కార్యాచరణ ప్రకటన..
-
Vaibhav Sooryavanshi: “రెండు సెంచరీలు మిస్.. ఫీల్ అవుతున్నావా?”.. క్వాలిఫయర్ 2కు ముందు వైభవ్ ఆసక్తికర సమాధానం..
-
Vaibhav Sooryavanshi: ఇది గమనించారా? SRHపై వైభవ్ కొట్టిన 12 సిక్సర్లలో ఓ కామన్ పాయింట్ ఉందండోయ్..
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!