Periyar: తమిళనాడులో ఎవరూ చేయలేని పని ‘‘విజయ్’’ చేశాడు..
- పెరియార్ సిద్ధాంతాలకు దూరంగా విజయ్..
- దేవుడు లేడనే సిద్ధాంతాన్ని తాము నమ్మం..
- తమిళనాడులో ఎవరూ చేయని పని చేసిన దళపతి..
Periyar: తమిళనాట యాక్టర్ విజయ్ పార్టీ ‘‘తమిళగ వెట్రి కజగం(టీవీకే)’’ సంచలనంగా మారింది. ఆదివారం విల్లుపురం వేదికగా జరిగిన తొలి సభకే దాదాపుగా 8 లక్షల మంది హాజరు కావడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్న్నికలే టార్గెట్గా విజయ్ పావులు కదుపుతున్నాడు. ఈ సభలో అధికార డీఎంకే పార్టీని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఒకే కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోందని చెప్పారు. ఇదే విధంగా మతతత్వ రాజకీయాలు చేసే పార్టీలకు తాము వ్యతిరేకమని పరోక్షంగా బీజేపీ పేరు తీసుకువచ్చారు.
ఇదిలా ఉంటే, తమిళనాడులో రాజకీయాలు ముఖ్యంగా ద్రవిడవాదం, పెరియార్ సిద్ధాంతాల ఆధారంగా నడుస్తాయి. అయితే, విజయ్ మాత్రం పెరియార్ సిద్ధాంతాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ద్రావిడ ఐకాన్గా భావించే పెరియార్ ‘‘దేవుళ్లను తిరస్కరించే సిద్ధాంతం’’ని తాము తీసుకోవడం లేదని, కానీ ఆయన చెప్పిన సామాజిక న్యాయం, మహిళా సాధికారత అనే పెరియార్ చెప్పిన అంశాలను మాత్రం తీసుకుంటామని చెప్పారు. డీఎంకే వ్యవస్థాపకులు అన్నాదురై చెప్పినట్లు ‘‘అందరూ ఒక్కరే, ఒక్కడే దేవుడు’’ అనేదే తమ భావజాలమని ప్రకటించాడు.
Also Read
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
Read Also: NBK 109: సారీ.. పండక్కి అప్డేట్ ఇవ్వలేకపోతున్నాం: నాగవంశీ
ఇలా పెరియార్ వైఖరి నుంచి విజయ్ తప్పుకోవడం సంచలనంగా మారింది. సాధారణంగా తమిళనాడు రాజకీయాలు అన్ని పెరియార్ చుట్టూ తిరుగుతుంటాయి. అలాంటిది ఆయన సిద్ధాంతాలకు విజయ్ దూరంగా ఉండటం ప్రధాన చర్చగా మారింది. పెరియార్ అతడి రాజకీయాలే తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకేలకు పునాది. జస్టిస్ పార్టీ అధినేత పెరియార్ 1944లో దాని పేరును ద్రవిడర్ కజగంగా మార్చారు.1949లో అన్నాదురై పార్టీని విభజించి డీఎంకేను స్థాపించారు. ఆ తర్వాత 1972లో ఎంజీ రామచంద్రన్ డీఎంకేను చీల్చి ఏఐఏడీఎంకేను స్థాపించారు.
ప్రముఖ దేశాలయాలు ఉన్న తమిళనాడు రాష్ట్రంలో మతపరమైన భావాలు పుంజుకుంటున్న తరుణంలో విజయ్ రాజకీయ అరంగ్రేటం జరిగింది. తమిళనాడులో మాజీ ఐఏఎస్ అన్నామలై ఆధ్వర్యంలో బీజేపీ అక్కడ జాతీయవాదాన్ని, హిందుత్వాన్ని తట్టిలేపుతోంది. 2024 ఎన్నికల్లో బీజేపీ సీట్లు గెలవకున్నా, ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకోగలిగింది. నిజానికి జోసెఫ్ విజయ్ క్రిష్టియన్, కానీ ఆ మతాన్ని పెద్దగా ఆచరించడం లేదు. ఆయన తల్లి, భార్య హిందూ ముదలియర్లు. ఈ సమీకరణం విజయ్కి కలిసి వస్తుందని అనుకుంటున్నారు. దీనికి తోడు ఆయనకు ఉన్న ఫ్యాన్ బేస్ కూడా ఇందుకు ఓ కారణం.
డిప్యూటీసీఎం ఉదయనిధి స్టాలిన్ సనాతనాన్ని తుడిచిపెట్టాలి అని చేసిన వ్యాక్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అక్కడి హిందువుల్లో కూడా కాస్త వ్యతిరేఖత ఉంది. ఈ నేపథ్యంలో విజయ్ మతాల విషయంలో న్యూట్రల్గా ఉంటడం కలిసి రావచ్చు. గతంలో ఉన్నంత బలంగా ఏఐడీఎంకే లేదు. బీజేపీ అన్నామలై నేతృత్వంలో ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. ఈ రాజకీయ శూన్యత అనేది విజయ్కి కలిసి రావచ్చు.
తాజావార్తలు
-
Rakasa : ‘రాకాస’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
-
AshuReddy : నటి అషు రెడ్డిపై నమోదైన చీటింగ్ కేసు వివరాలు..పెద్ద స్కెచ్చే
-
IPL Historic Day: బ్యాట్స్మెన్ల మెరుపులు, భారీ స్కోర్లు, రికార్డు ఛేజింగ్లు.. ఐపీఎల్ చరిత్రలో చారిత్రాత్మక రోజు!
-
Gayapadda Simham: తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’లో శ్రీ విష్ణు మేజిక్..
-
New OTT Rules 2026 : ఓటీటీలో కొత్త రూల్స్.. నిర్మాతలకు ‘షాక్’.. వసూళ్లు లేకపోతే రైట్స్ కట్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!