Honeymoon Murder Case: రాజా రఘువంశీ కుటుంబం కీలక నిర్ణయం.. నిందితురాలిపై కొత్త పిటిషన్!
- హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం
- రాజా రఘువంశీ కుటుంబం కీలక నిర్ణయం
- నిందితురాలిపై కొత్త పిటిషన్ దాఖలకు నిర్ణయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హనీమూన్ మర్డర్ కేసులో బాధిత కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది. నిందితురాలు సోనమ్ రఘువంశీ.. భర్తను ఎందుకు చంపాల్సి వచ్చిందో తెలుసుకోవాలని బాధిత కుటుంబం నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో నిందితురాలు సోనమ్కు నార్కో పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రాజా రఘువంశీ కుటుంబ సభ్యులు తెలిపారు. అంతేకాకుండా నిందితురాలికి సహకరించిన వ్యక్తికి బెయిల్ మంజూరు చేయడాన్ని కూడా సవాల్ చేస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం షిల్లాంగ్లో న్యాయవాదిని నియమిస్తామని రాజా రఘువంశీ కుటుంబం తెలిపింది.
ఇది కూడా చదవండి: Kerala: కేరళలో షాకింగ్ ఘటన.. హత్యాచార ఖైదీ జైలు గోడ దూకి పరారీ
Also Read
- Wedding Fight: మటన్ పెడతామని ఒప్పుకొని.. చికెన్ పెడతారా?.. పెళ్లి విందులో పొట్టు పొట్టు తన్నుకున్న వైనం
- LPG Connection Transfer Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. ఈ 5 రూల్స్ పాటించకపోతే కనెక్షన్ కట్..!
- PM Modi: 2030 నాటికి వాణిజ్యం రెట్టింపు లక్ష్యం.. మోడీ పర్యటనలో భారత్-న్యూజిలాండ్ కీలక నిర్ణయాలు
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
రాజా రఘువంశీ హత్యకు గురైన ప్రాంతాన్ని బాధిత కుటుంబం సందర్శించింది. ఆ ప్రదేశంలోనే మతపరమైన ఆచారాలు నిర్వహించాలని కుటుంబం నిర్ణయం తీసుకుందని విపిన్ రఘువంశీ మీడియాకు తెలిపారు. వివాహం తర్వాత సోనమ్ తన భర్తను ఎందుకు చంపాల్సి వచ్చిందో.. అసలు కారణాన్ని తెలుసుకోవడానికి ఆమెకు నార్కో పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ రాజా రఘువంశీ కుటుంబం పిటిషన్ దాఖలు చేస్తుందని చెప్పారు.
ఇక సోనమ్ అన్నయ్య గోవింద్ ఆమె కోసం బెయిల్ దరఖాస్తు దాఖలు చేయడానికి షిల్లాంగ్, పొరుగున ఉన్న అస్సాంలోని గౌహతిలో న్యాయవాదిని నియమించుకోవాలని చూస్తున్నారని వర్గాలు తెలిపాయి. అయితే సోనమ్ కుటుంబం మాత్రం ఈ విషయాన్ని ధృవీకరించలేదు.
ఇది కూడా చదవండి: PM Modi: మాల్దీవులు చేరుకున్న మోడీ.. స్వయంగా స్వాగతం పలికిన ముయిజ్జు
సోనమ్కు మే 11న ఇండోర్కు చెందిన రాజా రఘువంశీతో వివాహం అయింది. అయితే మే 20న హనీమూన్ పేరుతో మేఘాలయకు తీసుకెళ్లి కిరాయి హంతకులుతో చంపేసి లోయలో పడేసింది. అనంతరం ప్రియుడితో కలిసి పారిపోయింది. జూన్ 2న లోయలో రాజా మృతదేహం లభించింది. ఇక జూన్ 7న పోలీసుల ఎదుట సోనమ్ లొంగిపోయింది. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

తాజావార్తలు
-
Donald Trump: నన్ను చంపడానికి ట్రై చేస్తే 1,000 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయ్.. ట్రంప్ షాకింగ్ ప్రకటన..
-
Ashwini Vaishnaw: వికసిత్ భారత్-2047 లక్ష్యంతో టెక్నాలజీ విప్లవం.. హైదరాబాద్కు 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు.!
-
VIDA VX2 Plus: 187KM రేంజ్తో హీరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫాస్ట్ ఛార్జింగ్, రిమూవబుల్ బ్యాటరీ
-
Vinayakan: చిన్నారి ఫోటో పోస్ట్ వివాదం.. ‘జైలర్’ విలన్ వినాయకన్పై మరో కేసు
-
BCCI: టీమ్ ఇండియా కోచింగ్ టీమ్లో మార్పులు..! గంభీర్ సహాయకుల్లో ఇద్దరిని తొలగిస్తారా..?
ట్రెండింగ్
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!