Vice-President Election 2022: రేపే ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్.. అదే రోజు ఫలితాలు
Vice-President Election 2022: ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం రేపు పోలింగ్ జరనుంది. శనివారం పార్లమెంట్ భవనం మొదటి అంతస్తులోని రూం నెంబర్ 63లో పోలింగ్ జరగనుంది. సీక్రెట్ బ్యాలెట్ విధానం ద్వారా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉపరాష్ట్రపతి పదవి కోసం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థిగా జగదీప్ ధన్కర్, ప్రతిపక్ష పార్టీ కూటమి అభ్యర్థిగా మార్గరేట్ ఆల్వాను పోటీలో దించారు. పోలింగ్ జరిగిన శనివారమే ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
పార్లమెంట్ లోని ఉభయ సభల్లోని సభ్యులు ఉప రాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎలక్టోరల్ కాలేజీలోని పార్లమెంట్ 790 మంది సభ్యులు ఉంటారు. రాజ్యసభలో 233 మంది ఎంపీలతో పాటు 12 మంది నామినేటెడ్ సభ్యులు, లోక్ సభలోని 543 మంది సభ్యులతో పాటు ఇద్దరు నామినేటెడ్ సభ్యులు ఓటింగ్ లో పాల్గొననున్నారు. అయితే ప్రస్తుతం రెండు సభల్లో కలిపి 788 మంది ఎంపీలు ఉన్నారు. వీరంతా ఎన్నికల్లో పాల్గొననున్నారు.
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
Read Also: Tejas Aircraft: భారత తయారీ “తేజస్” యుద్ధవిమానంపై విదేశాల ఆసక్తి.
అయితే గతంలో రాష్ట్రపతి ఎన్నికల్లో మాదిరిగానే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్ కర్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇటు లోక్ సభలో, అటు రాజ్యసభలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికే ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు. అయితే కాంగ్రెస్ ప్రతిపాదించిన విపక్షాల అభ్యర్థి మార్గరేట్ ఆల్వా ఎంత వరకు పోటీ ఇస్తుందో చూడాలి. ప్రస్తుతం జగదీప్ ధన్ కర్ కు వైసీపీ, టీడీపీ, ఏఐఏడీఎంకే, శివసేన, బీజేడీ, ఆర్ఎల్పీ పార్టీలు మద్దతు ప్రకటించాయి.
మరో వైపు మార్గరేట్ ఆల్వాకి కాంగ్రెస్ తో పాటు ఎన్సీపీ, డీఎంకే, టీఆర్ఎస్, ఆప్, ఆర్జేడీ, సీపీఎం, ఆర్ఎల్డీ, ఎండీఎంకే, ఎంఐఎం పార్టీలు మద్దతు ప్రకటించాయి. అయితే గతంలో రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిని నిలబెట్టిన త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఉన్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి పదవీ కాలం ఆగస్టు 10తో ముగుస్తోంది.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!