Jammu Kashmir: స్కూల్స్లో ‘‘వందేమాతరం’’ తప్పనిసరి.. ముస్లిం సంఘాల నుంచి వ్యతిరేకత..
- స్కూల్స్లో ‘‘వందేమాతరం’’ తప్పనిసరి..
- నిర్ణయంపై జమ్మూ కాశ్మీర్ ముస్లిం సంఘాల అభ్యంతరం..
- వందేమాతరం పాడటం ఇస్లాంకు వ్యతిరేకమని కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ పాఠశాలల్లో ‘‘వందేమాతరం’’ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, దీనిని అక్కడి ముస్లిం మతం సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ముస్లిం మత సంస్థల సమాఖ్య అయిన ముతాహిదా మజ్లిస్-ఎ-ఉలేమా (MMU) ప్రభుత్వం నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్యను ‘‘బలవంతపు ఆదేశాలు’’గా అభివర్ణించింది. జాతీయ గీతం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని స్కూళ్లలో విద్యార్థులు, సిబ్బంది సంగీత-సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని ముస్లిం సంఘాలు తప్పుపట్టాయి. ఇది అన్యాయమని, ఇస్లాంకు వ్యతిరేకం అని ఆరోపిస్తున్నాయి.
Also Read
- UK Roads Melt at 40°C: 40°Cకే UK రోడ్లు కరుగుతుంటే.. 45°C దాటినా తట్టుకుంటున్న భారతీయ రోడ్లు.. ఆసక్తికరమైన కారణాలు
- Ayodhya: "వాష్రూమ్లలో డబ్బు దాచాం".. అయోధ్య కేసులో నిందితుడు బయటపెట్టిన సంచలన నిజాలు
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Pradeep Kumar IAS: పదవీ విరమణ రోజే సీబీఐ షాక్.. ఐఏఎస్ ప్రదీప్ కుమార్ అరెస్టు.. కారణం ఇదే!
ముతాహిదా మజ్లిస్-ఎ-ఉలేమా (MMU)కు నాయకత్వం వహిస్తున్న కాశ్మీరీ వేర్పాటువాద నాయకుడు మిర్వైజ్ ఉమర్ ఫరూఖ్ ఈ ఆర్డర్స్పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇది ముస్లిం విద్యార్థులు, సంస్థలను వారి మత సూత్రాలకు వ్యతిరేకంగా వ్యవహరించేలా బలవంతం చేస్తుందని అన్నారు. ముస్లింలకు వందేమాతరం పాడటం అనుమతించబడదు అని ఎంఎంయూ చెప్పింది. “వందేమాతరం పాడటం లేదా పఠించడం ఇస్లాంకు విరుద్ధం, ఎందుకంటే అందులో అల్లాహ్ యొక్క సంపూర్ణ ఏకత్వం (తౌహీద్) పై ప్రాథమిక ఇస్లామిక్ నమ్మకానికి విరుద్ధంగా భక్తి వ్యక్తీకరణలు ఉన్నాయి” అని మీర్వైజ్ కార్యాలయం ఒక ట్వీట్లో పేర్కొంది.
కేంద్రం జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, వివిధ రాష్ట్రాల్లోని పాఠశాలలు అక్టోబర్ 31- నవంబర్ 7, 2025 మధ్య ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కోరింది, అక్కడ విద్యార్థులు,ఉపాధ్యాయులు జాతీయ గీతాన్ని పాడాలని చెప్పింది. ఈ ఆదేశాలు నిజమైన ఐక్యత, వైవిధ్యం పట్ల గౌరవాన్ని ప్రోత్సహించడం కన్నా సాంస్కృతిక వేడుక ముసుగులో ముస్లిం మెజారిటీ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ హిందుత్వ భావజాలాన్ని రుద్దే ప్రయత్నం అని ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఏ విద్యార్థి లేదా సంస్థ వారి మత విశ్వాసాలకు వ్యతిరేకంగా వ్యవహరించాలని బలవంతం చేయకుండా చూసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా , ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాలను ఎంఎంయూ కోరింది
తాజావార్తలు
-
YS Jagan: పీఎస్కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి.. జగన్ సంచలన వ్యాఖ్యలు
-
UK Roads Melt at 40°C: 40°Cకే UK రోడ్లు కరుగుతుంటే.. 45°C దాటినా తట్టుకుంటున్న భారతీయ రోడ్లు.. ఆసక్తికరమైన కారణాలు
-
Varanasi : ‘వారణాసి’ వార్ సీన్స్.. మైండ్ బ్లోయింగ్ అంతే
-
Ayodhya: “వాష్రూమ్లలో డబ్బు దాచాం”.. అయోధ్య కేసులో నిందితుడు బయటపెట్టిన సంచలన నిజాలు
-
Yadagirigutta: మెగా ఫ్యామిలీకి గుడ్ న్యూస్.. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డులో కొనిదెల సురేఖకు చోటు
ట్రెండింగ్
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!