Vande Bharat Trains: వందే భారత్ రైలుపై రాళ్లదాడి.. ఇద్దరు మైనర్ల అరెస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Bharat Trains: వందే భారత్ రైలుపై రాళ్లదాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన వారిలో ఇద్దరు మైనర్లను అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. హై స్పీడ్తో వెళుతున్న రైళ్లు ప్రజలను తమ ఊర్తకు చేస్తున్నాయి. అటువంటి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లపై కర్ణాటకలో రాళ్లు రువ్విన ఇద్దరు బాలురను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బాలురు రాళ్లు రువ్వడంతో రైలు అద్దాలకు పగుళ్లు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించిన వివరాలను రైల్వే అధికారులు మీడియాకు తెలిపారు.
Read also: CPI Ramakrishna: కేంద్రమే బాధ్యత తీసుకొని.. పోలవరంను పూర్తి చేయాలి
Also Read
- Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
- NTA Exam Reform: పరీక్షా సంస్కరణల హైపవర్ కమిటీ సభ్యులు వీరే..
- PM Modi: పరీక్షా సంస్కరణలకు ప్రధాని మోడీ శ్రీకారం.. నందన్ నీలేకనికి కీలక బాధ్యత..
- Gen Z Protest: ‘‘ మా దేశంలో బిర్యానీ ప్లేట్కే అమ్ముడుపోతారు’’.. భారత యువతపై పాకిస్తాన్ యూత్ ప్రశంసలు..
ధార్వాడ్-బెంగళూరు నగరాల మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై రాళ్లు రువ్విన కేసులో ఇద్దరు మైనర్ బాలురను రైల్వే అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్లను చిత్రదుర్గ అబ్జర్వేషన్ హోమ్లో ఉంచినట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అధికారులు తెలిపారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై బాలురు రాళ్లు రువ్విన ఘటన జూలై 1న జరిగింది. రాళ్లదాడి చేసిన బాలురను ఎస్.ఎస్.నాగర, బాషాగా గుర్తించారు. బాలురు రాళ్లు రువ్వడంతో రైలు కిటికీ అద్దాలకు పగుళ్లు ఏర్పడ్డాయి. రెండో విడతలో వందేభారత్ రైలు సేవలను ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 26న జెండా ఊపి ప్రారంభించారు. వారం తర్వాత వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్లదాడి జరగడంతొ ప్రయాణికులు, అధికారుల్లో ఆందోళన నెలకొంది. దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే రాళ్లదాడి చేసిన ఇద్దరు మైనర్ బాలురను అదుపులోకి తీసుకున్నారు.
Read also: Shilpa Shetty Hot Pics: లేటు వయసులోనూ అన్ని చూపించేస్తున్న శిల్పా శెట్టి.. లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్!
వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్ల దాడి ఘటనలు ఈ మధ్య కాలంలో చాలానే జరిగాయి. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్లు రువ్విన ఘటన పశ్చిమబెంగాల్లోనూ జనవరిలో చోటుచేసుకుంది. హౌరా నుంచి న్యూ జల్పాయిగురి వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్లు రువ్వారు. ప్రారంభించిన నాలుగు రోజుల తర్వాత ఈ ఘటన జరగడం గమనార్హం. మాల్దా స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు అద్దాలు పగిలిపోయాయి. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Ram Charan: రామ్ చరణ్కు గాయం.. సర్జరీ కోసం కోయంబత్తూరు, RC17పై ప్రభావం?
-
CM Revanth Reddy : యువతే గేమ్చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!