Vande Bharat Sleeper: పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్.. ప్రారంభ తేదీ ఎప్పుడంటే..!
- పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్
- త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రానికి రైలు
భారతీయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ స్లిపర్ రైలు త్వరలోనే పట్టాలెక్కబోతుంది. ఈ మేరకు రైల్వేశాఖ నుంచి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. వందే భారత్ స్లిపర్ రైలును దీపావళికి ప్రారంభించాలని రైల్వేశాఖ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. పైగా దీపావళి పండుగకు పెద్ద ఎత్తున బీహారీయులు తరలివెళ్తారు. ఇంకోవైపు నవంబర్లోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీపావళికి ఢిల్లీ-పాట్నా రూట్లో వందే భారత్ స్లిపర్ రైలును ప్రారంభించాలని రైల్వేశాఖ భావిస్తోంది.
ఇది కూడా చదవండి: US: ఓ భారతీయ మహిళ పిచ్చిచేష్టలు.. స్టోర్లో చోరీ చేస్తూ పట్టివేత
Also Read
- Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
- JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
- West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
దీపావళి సమయంలో ఢిల్లీ-పాట్నా అత్యంత రద్దీగా ఉండే కారిడార్లో ఇదొకటి. దీపావళి పండుగకు కచ్చితంగా లక్షలాది మంది ప్రజలు బీహార్కు ప్రయాణిస్తుంటారు. బస్సులు, రైళ్లు కిక్కిరిసివెళ్తుంటాయి. ఈ నేపథ్యంలో రైల్వే వ్యవస్థలో మొట్టమొదటి వందే భారత్ స్లిపర్ ఎక్స్ప్రెస్ను ప్రవేశపెట్టబోతుంది. కేవలం రాత్రిపూట ప్రయాణం కోసమే ఈ సర్వీస్ నిర్వహిస్తోంది. ఢిల్లీ-పాట్నా రూట్లో ప్రయాగ్రాజ్ను కలుపుకుని వెళ్తుంది. ఈ రైలు ప్రయాణ సమయాన్నికూడా తగ్గిస్తుంది. ఇక విమాన శైలి సౌకర్యాన్ని అందించనుంది.
ఇది కూడా చదవండి: Bihar: తేజస్వి యాదవ్ భార్యపై ఓ మాజీ నేత అనుచిత వ్యాఖ్యలు.. బీహార్లో ఆర్జేడీ నేతల ఆందోళన
మామూలుగా ఎక్స్ప్రెస్లకు 23 గంటల సమయం పడుతుంది. ఈ వందే భారత్ స్లిపర్ రైలు మాత్రం కేవలం 11 గంటలకే తీసుకెళ్లిపోతుంది. అంటే దాదాపు 12-17 గంటల సమయం ఆదా అవుతుంది. ఈ సర్వీసు ఢిల్లీలో రాత్రి 8 గంటలకు ప్రారంభమైతే.. ఉదయం 7:30 గంటలకు పాట్నా చేరుకుంటుంది. తిరిగి పాట్నాలో రాత్రి 8గంటలకు బయల్దేరుతుంది. ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. భద్రతా ప్రమాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆధునిక సౌకర్యాల సూట్తో అమర్చారు. సీసీటీవీ నిఘా ఉంటుంది. వినోద తెరలు ఉంటాయి. సెన్సార్ తలుపులు ఉంటాయి. అగ్నిమాపక వ్యవస్థ ఉంది. విమానంలో ఉండే ఇంటీరియర్ సౌకర్యాలు ఉంటాయి.
ప్రస్తుతం ఉన్న వందే భారత్ రైళ్లు పగటిపూట ప్రయాణానికి అనుకూలంగా ఉండే చైర్-కార్ మోడల్స్ మాత్రమే ఉన్నాయి. కొత్తగా వచ్చే స్లిపర్ రైళ్లు రాత్రిపూట కోసమే వినియోగించనున్నారు. ఇక ఈ రైళ్లు సుదీర ప్రయాణాలకు మాత్రం వినియోగించనున్నారు.
తాజావార్తలు
-
Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
-
మోహన్లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్మెంట్!
-
Salman Khan-RR: సారీ భాయ్, ఈ రోజు కాదు.. సల్మాన్ ఖాన్ పోస్ట్కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై!
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
-
Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో