Vande Bharat Sleeper: పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్.. ప్రారంభ తేదీ ఎప్పుడంటే..!
- పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్
- త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రానికి రైలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ స్లిపర్ రైలు త్వరలోనే పట్టాలెక్కబోతుంది. ఈ మేరకు రైల్వేశాఖ నుంచి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. వందే భారత్ స్లిపర్ రైలును దీపావళికి ప్రారంభించాలని రైల్వేశాఖ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. పైగా దీపావళి పండుగకు పెద్ద ఎత్తున బీహారీయులు తరలివెళ్తారు. ఇంకోవైపు నవంబర్లోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీపావళికి ఢిల్లీ-పాట్నా రూట్లో వందే భారత్ స్లిపర్ రైలును ప్రారంభించాలని రైల్వేశాఖ భావిస్తోంది.
ఇది కూడా చదవండి: US: ఓ భారతీయ మహిళ పిచ్చిచేష్టలు.. స్టోర్లో చోరీ చేస్తూ పట్టివేత
Also Read
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
దీపావళి సమయంలో ఢిల్లీ-పాట్నా అత్యంత రద్దీగా ఉండే కారిడార్లో ఇదొకటి. దీపావళి పండుగకు కచ్చితంగా లక్షలాది మంది ప్రజలు బీహార్కు ప్రయాణిస్తుంటారు. బస్సులు, రైళ్లు కిక్కిరిసివెళ్తుంటాయి. ఈ నేపథ్యంలో రైల్వే వ్యవస్థలో మొట్టమొదటి వందే భారత్ స్లిపర్ ఎక్స్ప్రెస్ను ప్రవేశపెట్టబోతుంది. కేవలం రాత్రిపూట ప్రయాణం కోసమే ఈ సర్వీస్ నిర్వహిస్తోంది. ఢిల్లీ-పాట్నా రూట్లో ప్రయాగ్రాజ్ను కలుపుకుని వెళ్తుంది. ఈ రైలు ప్రయాణ సమయాన్నికూడా తగ్గిస్తుంది. ఇక విమాన శైలి సౌకర్యాన్ని అందించనుంది.
ఇది కూడా చదవండి: Bihar: తేజస్వి యాదవ్ భార్యపై ఓ మాజీ నేత అనుచిత వ్యాఖ్యలు.. బీహార్లో ఆర్జేడీ నేతల ఆందోళన
మామూలుగా ఎక్స్ప్రెస్లకు 23 గంటల సమయం పడుతుంది. ఈ వందే భారత్ స్లిపర్ రైలు మాత్రం కేవలం 11 గంటలకే తీసుకెళ్లిపోతుంది. అంటే దాదాపు 12-17 గంటల సమయం ఆదా అవుతుంది. ఈ సర్వీసు ఢిల్లీలో రాత్రి 8 గంటలకు ప్రారంభమైతే.. ఉదయం 7:30 గంటలకు పాట్నా చేరుకుంటుంది. తిరిగి పాట్నాలో రాత్రి 8గంటలకు బయల్దేరుతుంది. ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. భద్రతా ప్రమాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆధునిక సౌకర్యాల సూట్తో అమర్చారు. సీసీటీవీ నిఘా ఉంటుంది. వినోద తెరలు ఉంటాయి. సెన్సార్ తలుపులు ఉంటాయి. అగ్నిమాపక వ్యవస్థ ఉంది. విమానంలో ఉండే ఇంటీరియర్ సౌకర్యాలు ఉంటాయి.
ప్రస్తుతం ఉన్న వందే భారత్ రైళ్లు పగటిపూట ప్రయాణానికి అనుకూలంగా ఉండే చైర్-కార్ మోడల్స్ మాత్రమే ఉన్నాయి. కొత్తగా వచ్చే స్లిపర్ రైళ్లు రాత్రిపూట కోసమే వినియోగించనున్నారు. ఇక ఈ రైళ్లు సుదీర ప్రయాణాలకు మాత్రం వినియోగించనున్నారు.
తాజావార్తలు
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
-
UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
-
Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!