Uttarakhand: ఉత్తరాఖండ్లో కోల్కతా లాంటి ఘటన.. నర్స్పై అత్యాచారం, హత్య
- ఉత్తరాఖండ్ లో జరిగిన అత్యాచారం.. హత్య ఘటనను చేధించిన పోలీసులు
- అదృశ్యమైన 33 ఏళ్ల నర్సుపై అత్యాచారం చేసి హత్య చేసిన.. నిందితుడు ధర్మేందను అరెస్టు చేసిన పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటన జరిగి దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. అయినప్పటికీ కామాంధుల కళ్లు కామంతో మూసుకుపోతున్నాయి. తాజాగా.. ఉత్తరాఖండ్ లో జరిగిన అత్యాచారం, హత్య ఘటనను పోలీసులు చేధించారు. అదృశ్యమైన 33 ఏళ్ల నర్సుపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు ధర్మేందను బుధవారం అరెస్టు చేశారు. ఈ ఘటన ఉధమ్ సింగ్ నగర్ జిల్లా రుద్రాపూర్లో జూలై 30న జరిగింది.
Ajit pawar: అజిత్ పవర్ కీలన ప్రకటన.. ఎన్నికల్లో పోటీ చేయడంలేదని వెల్లడి.. రంగంలోకి కుమారుడు?
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
మృతురాలు.. నైనిటాల్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. ఆమె బిలాస్పూర్ లో తన 11 ఏళ్ల కుమార్తెతో కలిసి జీవిస్తుంది. కాగా.. బాధితురాలి సోదరి జులై 31న రుద్రాపూర్ పోలీస్ స్టేషన్లో తన సోదరి మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఒక వారం తర్వాత.. నర్సు మృతదేహం ఉత్తరప్రదేశ్లోని దిబ్దిబా ప్రాంతంలో గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Army Dog Kent: ‘ఆపరేషన్ సుజలిగల’లో హీరోగా నిలిచిన జాగిలానికి శౌర్య అవార్డు..
నిందితుడు నర్సుపై అత్యాచారం చేసి, హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. నిందితుడిని రాజస్థాన్లోని జోధ్పూర్లో అరెస్టు చేశారు. అతను ఉత్తరప్రదేశ్లోని బరేలీకి చెందిన కార్మికుడు. కాగా.. నిందితుడు ధర్మేంద్ర నర్సును పొదల్లోకి తీసుకెళ్లి మొదట అత్యాచారం చేశాడు. ఆ తర్వాత.. ఆమె గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం తన ఒంటిపై ఉన్న నగలు తీసుకుని వెళ్లాడు. అయితే.. సీసీటీవీ కెమెరా ఫుటేజీ ద్వారా పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చోరీకి గురైన బాధితురాలి మొబైల్ ఫోన్ లొకేషన్ను ట్రేస్ చేయడం ద్వారా నిందితుడు ధర్మేంద్రను పట్టుకున్నారు. విచారణలో.. నర్సుపై దాడి చేసినట్లు నిందితుడు వెల్లడించాడు. అనంతరం ఆమెను ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి గొంతుకోసి హత్య చేసినట్లు తెలిపాడు. హత్య చేసిన తర్వాత పర్సులో ఉన్న డబ్బు, నగలు తీసుకుని పారిపోయినట్లు నిందితుడు పోలీసులకు చెప్పాడు.
తాజావార్తలు
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
-
Honda Hybrid Sedan: హోండా నెక్స్ట్ జనరేషన్ హైబ్రిడ్ సెడాన్.. 10% ఎక్కువ మైలేజ్, 30% తక్కువ ఖర్చు!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..