Uttarakhand: ఉత్తరాఖండ్లో కోల్కతా లాంటి ఘటన.. నర్స్పై అత్యాచారం, హత్య
- ఉత్తరాఖండ్ లో జరిగిన అత్యాచారం.. హత్య ఘటనను చేధించిన పోలీసులు
- అదృశ్యమైన 33 ఏళ్ల నర్సుపై అత్యాచారం చేసి హత్య చేసిన.. నిందితుడు ధర్మేందను అరెస్టు చేసిన పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటన జరిగి దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. అయినప్పటికీ కామాంధుల కళ్లు కామంతో మూసుకుపోతున్నాయి. తాజాగా.. ఉత్తరాఖండ్ లో జరిగిన అత్యాచారం, హత్య ఘటనను పోలీసులు చేధించారు. అదృశ్యమైన 33 ఏళ్ల నర్సుపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు ధర్మేందను బుధవారం అరెస్టు చేశారు. ఈ ఘటన ఉధమ్ సింగ్ నగర్ జిల్లా రుద్రాపూర్లో జూలై 30న జరిగింది.
Ajit pawar: అజిత్ పవర్ కీలన ప్రకటన.. ఎన్నికల్లో పోటీ చేయడంలేదని వెల్లడి.. రంగంలోకి కుమారుడు?
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
మృతురాలు.. నైనిటాల్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. ఆమె బిలాస్పూర్ లో తన 11 ఏళ్ల కుమార్తెతో కలిసి జీవిస్తుంది. కాగా.. బాధితురాలి సోదరి జులై 31న రుద్రాపూర్ పోలీస్ స్టేషన్లో తన సోదరి మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఒక వారం తర్వాత.. నర్సు మృతదేహం ఉత్తరప్రదేశ్లోని దిబ్దిబా ప్రాంతంలో గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Army Dog Kent: ‘ఆపరేషన్ సుజలిగల’లో హీరోగా నిలిచిన జాగిలానికి శౌర్య అవార్డు..
నిందితుడు నర్సుపై అత్యాచారం చేసి, హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. నిందితుడిని రాజస్థాన్లోని జోధ్పూర్లో అరెస్టు చేశారు. అతను ఉత్తరప్రదేశ్లోని బరేలీకి చెందిన కార్మికుడు. కాగా.. నిందితుడు ధర్మేంద్ర నర్సును పొదల్లోకి తీసుకెళ్లి మొదట అత్యాచారం చేశాడు. ఆ తర్వాత.. ఆమె గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం తన ఒంటిపై ఉన్న నగలు తీసుకుని వెళ్లాడు. అయితే.. సీసీటీవీ కెమెరా ఫుటేజీ ద్వారా పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చోరీకి గురైన బాధితురాలి మొబైల్ ఫోన్ లొకేషన్ను ట్రేస్ చేయడం ద్వారా నిందితుడు ధర్మేంద్రను పట్టుకున్నారు. విచారణలో.. నర్సుపై దాడి చేసినట్లు నిందితుడు వెల్లడించాడు. అనంతరం ఆమెను ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి గొంతుకోసి హత్య చేసినట్లు తెలిపాడు. హత్య చేసిన తర్వాత పర్సులో ఉన్న డబ్బు, నగలు తీసుకుని పారిపోయినట్లు నిందితుడు పోలీసులకు చెప్పాడు.
తాజావార్తలు
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!