Uttarakhand: హిమపాతంలో చిక్కుకున్న 28 మంది.. పలువురి మృతి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarakhand Avalanche Incident: ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. హిమాలయాల్లో పర్వతారోహనకు వెళ్లిన 28 మంది హిమపాతంలో చిక్కుకున్నారు. నెహ్రూ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్లో 28 మంది ట్రైనీ పర్వతారోహకులు చిక్కుకుపోయారని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ఇందులో 20 మంది వరకు మరణించినట్లు సమాచారం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీటీకి చెందిన బలగాలు సంఘటనా స్థలానికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. సహాయక, రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నట్లు సీఎం వెల్లడించారు. ద్రౌపది దండ-2 శిఖరం వద్ద ఈ ప్రమాదం జరిగింది.
హిమపాతంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహస్రధార హెలిప్యాడ్ నుంచి బయలుదేరాయి. ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ట్వీట్ చేశారు. 28 మంది పర్వతారోహకులు హిమపాతంలో చిక్కుకున్నట్లు వెల్లడించారు. సైన్యం సహాయసహకారం కోసం కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కోరామని.. అందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు.
Also Read
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
ఉత్తరాఖండ్ లోని హిమాలయాల్లో విపరీతంగా మంచు కురుస్తోంది. శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో పితోర్ గఢ్ ప్రాంతంలో హిమాలయాల్లో మంచు కురుస్తోంది. దర్మా లోయలో చైనా సరిహద్దుకు సమీపంలో లోతట్టు ప్రాంతాల్లో సుమారు 1 అడుగు మేర మంచు కురుస్తోంది. అదే విధంగా 17,500 అడుగుల ఎత్తులో ఉన్న పర్వతాల్లో నాలుగు అడుగుల మేర మంచు కురస్తోంది.
శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో దర్మాలోయిలోని 14 గ్రామాలు, బియాస్ లోయలోని ఏడు గ్రామాల ప్రభావితం అవుతాయి. ఈ రెండు గ్రామాల్లోని ప్రజలు నవంబర్ మొదటి వారంల నుంచి లోయ దిగువకు వస్తారని భావిస్తున్నారు. అక్టోబర్ 2న దిగువ లోయలో వర్షం కారణంగా జ్యోలికాంగ్, నాభిధాంగ్, ఓం పర్వతం, ఆది కౌలాష్, బియస్ లోయలోని పంచచూలి శిఖరంపై హిమపాతం సంభవించింది. విపరీతమైన మంచు ప్రభావం వల్ల అవలాంచ్ ఏర్పడి 28 మంది చిక్కకున్నారు. ప్రస్తుతం వీరందరిని రక్షించే ప్రయత్నం జరుగుతోంది.
द्रौपदी का डांडा-2 पर्वत चोटी में हिमस्खलन में फंसे प्रशिक्षार्थियों को जल्द से जल्द सकुशल बाहर निकालने के लिए NIM की टीम के साथ जिला प्रशासन, NDRF, SDRF, सेना और ITBP के जवानों द्वारा तेजी से राहत एवं बचाव कार्य चलाया जा रहा है।
— Pushkar Singh Dhami (@pushkardhami) October 4, 2022
తాజావార్తలు
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!