Uttarakhand: హిమపాతంలో చిక్కుకున్న 28 మంది.. పలువురి మృతి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarakhand Avalanche Incident: ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. హిమాలయాల్లో పర్వతారోహనకు వెళ్లిన 28 మంది హిమపాతంలో చిక్కుకున్నారు. నెహ్రూ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్లో 28 మంది ట్రైనీ పర్వతారోహకులు చిక్కుకుపోయారని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ఇందులో 20 మంది వరకు మరణించినట్లు సమాచారం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీటీకి చెందిన బలగాలు సంఘటనా స్థలానికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. సహాయక, రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నట్లు సీఎం వెల్లడించారు. ద్రౌపది దండ-2 శిఖరం వద్ద ఈ ప్రమాదం జరిగింది.
హిమపాతంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహస్రధార హెలిప్యాడ్ నుంచి బయలుదేరాయి. ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ట్వీట్ చేశారు. 28 మంది పర్వతారోహకులు హిమపాతంలో చిక్కుకున్నట్లు వెల్లడించారు. సైన్యం సహాయసహకారం కోసం కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కోరామని.. అందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు.
Also Read
- Divorce Drama: ప్రేమ కథగా మారిన విడాకుల ఎపిసోడ్.. భర్తపై కేసులు పెట్టిన భార్యకు కోర్టులో ఊహించని ట్విస్ట్!
- Explained: ఇథనాల్ పెట్రోల్ వాడకంలో బ్రెజిల్ సక్సెస్.. భారత్లో ఈ85 ఎందుకు సవాల్గా మారుతుంది?
- IMD: భారత్కు ఐఎండీ కీలక హెచ్చరిక.. ఈ ఏడాది కరువు తప్పదా?
- TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
ఉత్తరాఖండ్ లోని హిమాలయాల్లో విపరీతంగా మంచు కురుస్తోంది. శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో పితోర్ గఢ్ ప్రాంతంలో హిమాలయాల్లో మంచు కురుస్తోంది. దర్మా లోయలో చైనా సరిహద్దుకు సమీపంలో లోతట్టు ప్రాంతాల్లో సుమారు 1 అడుగు మేర మంచు కురుస్తోంది. అదే విధంగా 17,500 అడుగుల ఎత్తులో ఉన్న పర్వతాల్లో నాలుగు అడుగుల మేర మంచు కురస్తోంది.
శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో దర్మాలోయిలోని 14 గ్రామాలు, బియాస్ లోయలోని ఏడు గ్రామాల ప్రభావితం అవుతాయి. ఈ రెండు గ్రామాల్లోని ప్రజలు నవంబర్ మొదటి వారంల నుంచి లోయ దిగువకు వస్తారని భావిస్తున్నారు. అక్టోబర్ 2న దిగువ లోయలో వర్షం కారణంగా జ్యోలికాంగ్, నాభిధాంగ్, ఓం పర్వతం, ఆది కౌలాష్, బియస్ లోయలోని పంచచూలి శిఖరంపై హిమపాతం సంభవించింది. విపరీతమైన మంచు ప్రభావం వల్ల అవలాంచ్ ఏర్పడి 28 మంది చిక్కకున్నారు. ప్రస్తుతం వీరందరిని రక్షించే ప్రయత్నం జరుగుతోంది.
द्रौपदी का डांडा-2 पर्वत चोटी में हिमस्खलन में फंसे प्रशिक्षार्थियों को जल्द से जल्द सकुशल बाहर निकालने के लिए NIM की टीम के साथ जिला प्रशासन, NDRF, SDRF, सेना और ITBP के जवानों द्वारा तेजी से राहत एवं बचाव कार्य चलाया जा रहा है।
— Pushkar Singh Dhami (@pushkardhami) October 4, 2022
తాజావార్తలు
-
Allu Arjun Happy: హ్యాపీ రీ రిలీజ్’తో కేరళలో అల్లు అర్జున్ సెన్సేషన్.!
-
Devara : ట్రోల్స్పై మౌనం వీడిన ‘దేవర’ డీఓపీ… హీరోల హైట్ పై షాకింగ్ కామెంట్స్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
Telangana High Court: హైడ్రా కమిషనర్కు హైకోర్టు షాక్.. రంగనాథ్కు భారీ జరిమానా విధింపు..
-
Divorce Drama: ప్రేమ కథగా మారిన విడాకుల ఎపిసోడ్.. భర్తపై కేసులు పెట్టిన భార్యకు కోర్టులో ఊహించని ట్విస్ట్!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!