Uttarakhand: హిమపాతంలో చిక్కుకున్న 28 మంది.. పలువురి మృతి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarakhand Avalanche Incident: ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. హిమాలయాల్లో పర్వతారోహనకు వెళ్లిన 28 మంది హిమపాతంలో చిక్కుకున్నారు. నెహ్రూ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్లో 28 మంది ట్రైనీ పర్వతారోహకులు చిక్కుకుపోయారని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ఇందులో 20 మంది వరకు మరణించినట్లు సమాచారం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీటీకి చెందిన బలగాలు సంఘటనా స్థలానికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. సహాయక, రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నట్లు సీఎం వెల్లడించారు. ద్రౌపది దండ-2 శిఖరం వద్ద ఈ ప్రమాదం జరిగింది.
హిమపాతంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహస్రధార హెలిప్యాడ్ నుంచి బయలుదేరాయి. ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ట్వీట్ చేశారు. 28 మంది పర్వతారోహకులు హిమపాతంలో చిక్కుకున్నట్లు వెల్లడించారు. సైన్యం సహాయసహకారం కోసం కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కోరామని.. అందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు.
Also Read
- Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
- Rahul Gandhi on NEET Paper Leak: "యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే".. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
- PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
ఉత్తరాఖండ్ లోని హిమాలయాల్లో విపరీతంగా మంచు కురుస్తోంది. శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో పితోర్ గఢ్ ప్రాంతంలో హిమాలయాల్లో మంచు కురుస్తోంది. దర్మా లోయలో చైనా సరిహద్దుకు సమీపంలో లోతట్టు ప్రాంతాల్లో సుమారు 1 అడుగు మేర మంచు కురుస్తోంది. అదే విధంగా 17,500 అడుగుల ఎత్తులో ఉన్న పర్వతాల్లో నాలుగు అడుగుల మేర మంచు కురస్తోంది.
శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో దర్మాలోయిలోని 14 గ్రామాలు, బియాస్ లోయలోని ఏడు గ్రామాల ప్రభావితం అవుతాయి. ఈ రెండు గ్రామాల్లోని ప్రజలు నవంబర్ మొదటి వారంల నుంచి లోయ దిగువకు వస్తారని భావిస్తున్నారు. అక్టోబర్ 2న దిగువ లోయలో వర్షం కారణంగా జ్యోలికాంగ్, నాభిధాంగ్, ఓం పర్వతం, ఆది కౌలాష్, బియస్ లోయలోని పంచచూలి శిఖరంపై హిమపాతం సంభవించింది. విపరీతమైన మంచు ప్రభావం వల్ల అవలాంచ్ ఏర్పడి 28 మంది చిక్కకున్నారు. ప్రస్తుతం వీరందరిని రక్షించే ప్రయత్నం జరుగుతోంది.
द्रौपदी का डांडा-2 पर्वत चोटी में हिमस्खलन में फंसे प्रशिक्षार्थियों को जल्द से जल्द सकुशल बाहर निकालने के लिए NIM की टीम के साथ जिला प्रशासन, NDRF, SDRF, सेना और ITBP के जवानों द्वारा तेजी से राहत एवं बचाव कार्य चलाया जा रहा है।
— Pushkar Singh Dhami (@pushkardhami) October 4, 2022
తాజావార్తలు
-
Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
-
Vivienne Pitt : బ్రాడ్ పిట్ ఇంటిపేరుకు మరో షాక్.. లీగల్గా తొలగించేందుకు ఏంజెలీనా కుమార్తె పిటిషన్!
-
Objection My Lord Trailer : మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘అబ్జెక్షన్ మై లార్డ్’ ట్రైలర్ విడుదల
-
Rahul Gandhi on NEET Paper Leak: “యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే”.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!