Uttar Pradesh: మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. వీడియో తీసి వైరల్ చేస్తామని బెదిరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Physical assault on minor girl in uttar pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రంలోని అలీఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఈ దారుణాన్ని సెల్ ఫోన్ కెమెరాలో చిత్రీకరించి బాలికను బ్లాక్ మెయిల్ చేశారు. ఈ ఘటనపై బాలిక తల్లి హర్దుగంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
Read Also: Breath Analyser Tests: పైలెట్లు, విమాన సిబ్బందికి బ్రీత్ అనలైజర్ టెస్టులు.. డీజీసీఏ ఆదేశం
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
- Jaipur Tension Over School Row: జైపూర్లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
- Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్కు రూ. 1 లక్ష జరిమానా.!
ఈ కేసులో ముగ్గురు నిందితులకు ఓ మహిళ కూడా సహకరించింది. ప్రస్తుతం వీరందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాచారం విషయాన్ని ఎవరికైనా చెబితే.. వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని నిందితులు బెదిరించినట్లు బాధిత బాలిక తల్లి ఆరోపించింది. ప్రస్తుతం అత్యాచారానికి సహకరించిన మహిళతో పాటు నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత కుటుంబం నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్లు 376డి (గ్యాంగ్రేప్), 506 (నేరపూరిత బెదిరింపు), పోక్సో చట్టాల కింద నిందితులపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ విశాల్ కుమార్ వెల్లడించారు.
13 ఏళ్ల బాలికను ఆదివారం మధ్యాహ్నం అత్యాచారానికి సహకరించిన మహిళ తన ఇంటిలో ఓ గదిలో బంధించింది. ఆ తరువాత అక్కడుకు చేరుకున్న ముగ్గురు నిందితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీన్ని మొత్తం కెమెరాతో షూట్ చేశారు. సాయంత్రం నిందితురాలు, బాధిత బాలికను తన ఇంటి నుంచి వెళ్లడానికి అనుమతి ఇచ్చింది. అయితే ఈ కేసుపై బాధితురాలి తల్లి ముందు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. నిందితులతో రాజీ కుదుర్చుకోవాలని ఒత్తడి తెచ్చినట్లు బాధిత బాలిక తల్లి ఆరోపించింది. ఆ తరువాత ఈ విషయం సీనియర్ అధికారుల దృష్టికి రావడంతో ఈ ఘటన గురించి వివరాలు తెలిశారు. పోలీసులు ఈ అత్యాచారంపై కేసు నమోదు చేసినట్లు.. విచారణ కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
-
Varanasi Movie Update: ‘వారణాసి’కి రాజమౌళి డెడ్లైన్.. పక్కా ప్లాన్ ప్రకారమే!
-
Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Bethlehem Kudumba Unit : 2026 ఓనమ్ విన్నర్గా నివిన్ పౌలి.. ‘బెత్లేహెమ్ కుటుంబ యూనిట్’ బ్లాక్ బస్టర్
ట్రెండింగ్
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!