Mary Millben: ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించిన అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్..
- ప్రధాని మోడీని ప్రశంసించిన యూఎస్ సింగర్..
- క్రిస్మస్ వేడుకల్లో మోడీ పాల్గొనడంపై మిల్బెన్ పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mary Millben: అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్ మరోసారి ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీ అభిమానిగా పేరుగాంచిన ఆఫ్రికన్-అమెరికన్ సింగర్, నటీ మిల్బెన్ మంగళవారం మోడీకి క్రిస్మన్ శుభాకాంక్షలు తెలిపారు. ఒక కార్యక్రమంలో ఏసుక్రీస్తును గౌరవించినందుకు ప్రశంసించారు. భారతదేశంలోని క్యాథలిక్ చర్చి ప్రధాన కార్యాలయంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ప్రధాని మోడీ హాజరుకావడంపై ఆమె ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘‘జీసస్ అత్యుత్తమ బహుమతి, ప్రేమకు నిదర్శనం. జీసస్ క్రీస్తును బహిరంగంగా గౌరవించినందుకు ప్రధాని మోడీకి థాంక్స్. మీ మాటలను నన్ను కదిలించాయి. భారతీయ సహోదరులందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు’’ అంటూ పోస్ట్ చేశారు.
‘‘ప్రభువైన క్రీస్తు బోధనలు ప్రేమ, సామరస్యం, సోదరభావాన్ని చెబుతాయి. ఈ స్పూర్తిని మరింత బలోపేతం చేయడానికి మనమందరి కృషి చేయాలి’’ అని ప్రధాని మోడీ ప్రతిస్పందించారు. 2023 జూన్లో అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు మిల్బెన్ తొలిసారి ప్రధాని మోడీని కలిశారు. ఆమె 2023లో వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్లో భారత జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆమె ప్రదర్శన తర్వాత, ప్రధాని మోడీ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవడం ఒక్కసారి ప్రపంచ మీడియాలో వైరల్ అయింది.
Also Read
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
Read Also: CP Avinash Mohanty : ఈ ఏడాది 70 కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్ల నుంచి బాధితులకు రిఫండ్ చేసి ఇచ్చాం..
మిల్బెన్ గతంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ప్రజాస్వామ్య నిజమైన చర్య అని పేర్కొన్నారు. హింసించబడిని మైనారిటీలకు ఆశ్రయం కల్పించినందుకు భారత ప్రధానిని ప్రశంసించారు. భారత్తో మరింత దౌత్యసంబంధాలు పెంచుకోవాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరారు. భారతదేశ పురోగతికి మోడీ ఉత్తమ నాయకుడని, మహిళా సాధికారత కోసం ఆయన పనిచేస్తున్నాడని ప్రశింసించారు.
సోమవారం, కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (CBCI) ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన క్రిస్మస్ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సమాజంలో హింసను ప్రేరేపించే ప్రయత్నాలను ఖండించారు, యేసుక్రీస్తు బోధనలు ప్రేమ, సామరస్యం మరియు సోదరభావాన్ని పెంపొందిస్తాయని ఎత్తిచూపారు. జర్మనీలోని మాగ్డేబర్గ్ క్రిస్మస్ మార్కెట్లో గత వారం జరిగిన ఉగ్రదాడిని కూడా ఆయన ఖండించారు. కారు జనాలపైకి దూసుకెళ్లడంతో నలుగురు మహిళలు, 9 ఏళ్ల చిన్నారి మరణించగా.. 205 మంది ఈ ఘటనలో గాయపడ్డారు.
తాజావార్తలు
-
AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
-
Varuna Yagam : ముగిసిన వరుణయాగం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు
-
Kumari Aunty: సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు!
-
Director Arrested: డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి రేప్.. దర్శకుడు అరెస్ట్
-
Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!