Mary Millben: ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించిన అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్..
- ప్రధాని మోడీని ప్రశంసించిన యూఎస్ సింగర్..
- క్రిస్మస్ వేడుకల్లో మోడీ పాల్గొనడంపై మిల్బెన్ పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mary Millben: అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్ మరోసారి ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీ అభిమానిగా పేరుగాంచిన ఆఫ్రికన్-అమెరికన్ సింగర్, నటీ మిల్బెన్ మంగళవారం మోడీకి క్రిస్మన్ శుభాకాంక్షలు తెలిపారు. ఒక కార్యక్రమంలో ఏసుక్రీస్తును గౌరవించినందుకు ప్రశంసించారు. భారతదేశంలోని క్యాథలిక్ చర్చి ప్రధాన కార్యాలయంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ప్రధాని మోడీ హాజరుకావడంపై ఆమె ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘‘జీసస్ అత్యుత్తమ బహుమతి, ప్రేమకు నిదర్శనం. జీసస్ క్రీస్తును బహిరంగంగా గౌరవించినందుకు ప్రధాని మోడీకి థాంక్స్. మీ మాటలను నన్ను కదిలించాయి. భారతీయ సహోదరులందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు’’ అంటూ పోస్ట్ చేశారు.
‘‘ప్రభువైన క్రీస్తు బోధనలు ప్రేమ, సామరస్యం, సోదరభావాన్ని చెబుతాయి. ఈ స్పూర్తిని మరింత బలోపేతం చేయడానికి మనమందరి కృషి చేయాలి’’ అని ప్రధాని మోడీ ప్రతిస్పందించారు. 2023 జూన్లో అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు మిల్బెన్ తొలిసారి ప్రధాని మోడీని కలిశారు. ఆమె 2023లో వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్లో భారత జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆమె ప్రదర్శన తర్వాత, ప్రధాని మోడీ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవడం ఒక్కసారి ప్రపంచ మీడియాలో వైరల్ అయింది.
Also Read
- Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
- Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
Read Also: CP Avinash Mohanty : ఈ ఏడాది 70 కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్ల నుంచి బాధితులకు రిఫండ్ చేసి ఇచ్చాం..
మిల్బెన్ గతంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ప్రజాస్వామ్య నిజమైన చర్య అని పేర్కొన్నారు. హింసించబడిని మైనారిటీలకు ఆశ్రయం కల్పించినందుకు భారత ప్రధానిని ప్రశంసించారు. భారత్తో మరింత దౌత్యసంబంధాలు పెంచుకోవాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరారు. భారతదేశ పురోగతికి మోడీ ఉత్తమ నాయకుడని, మహిళా సాధికారత కోసం ఆయన పనిచేస్తున్నాడని ప్రశింసించారు.
సోమవారం, కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (CBCI) ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన క్రిస్మస్ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సమాజంలో హింసను ప్రేరేపించే ప్రయత్నాలను ఖండించారు, యేసుక్రీస్తు బోధనలు ప్రేమ, సామరస్యం మరియు సోదరభావాన్ని పెంపొందిస్తాయని ఎత్తిచూపారు. జర్మనీలోని మాగ్డేబర్గ్ క్రిస్మస్ మార్కెట్లో గత వారం జరిగిన ఉగ్రదాడిని కూడా ఆయన ఖండించారు. కారు జనాలపైకి దూసుకెళ్లడంతో నలుగురు మహిళలు, 9 ఏళ్ల చిన్నారి మరణించగా.. 205 మంది ఈ ఘటనలో గాయపడ్డారు.
తాజావార్తలు
-
Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
-
New Oppo: టెక్ లవర్స్ను తెగ ఆకట్టుకుంటున్న ఒప్పో కొత్త లుక్.. ఈ ఫీచర్లు తెలిస్తే వెంటనే అప్డేట్ చేస్తారు..
-
TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!