Arunachal Pradesh Clash: భారత్-చైనా సరిహద్దు ఘర్షణలపై స్పందించిన అమెరికా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Reacted To India-China Border Clash: భారత్, చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ లో ఇరు దేశాల సైనికులు తలపడ్డారు. ఇరు దేశాల సైనికులు ఈ ఘర్షణల్లో గాయపడ్డారు. అయితే ఈ ఘటనలపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు వెల్లడించింది. తవాంగ్ ప్రాంతం నుంచి ఇరుదేశాల బలగాలు వైదొలగడంపై బైడెన్ ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసినట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ వెల్లడించారు. వివాదాస్పద సరిహద్దుపై ఇరు దేశాలు ద్వైపాక్షికంగా చర్చించుకోవాలని సూచించింది అమెరికా. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కూడా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి వివాదాస్పద ప్రాంతం నుంచి చైనా, భారతదేశాల తమ బలగాలను ఉపసంహరించుకోవాలని కోరారు.
Read Also: Uttar Pradesh: అంత్యక్రియలకు డబ్బు లేక రోజుల తరబడి తల్లి మృతదేహంతోనే..
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్లోని యాంగ్ట్సే ప్రాంతంలో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఎసి)ని అతిక్రమించకుండా చైనా సైన్యాన్ని భారత ఆర్మీ దళాలు ధైర్యంగా అడ్డుకున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. చైనా దురక్రమణను భారత సైన్యం అడ్డుకుంది. ఈ ఘర్షణల్లో భారత్ తో పోలిస్తే చైనా సైనికులే ఎక్కువగా గాయపడ్డారు. ఇదిలా ఉంటే ఎప్పటిలాగే చైనా తన వక్రబుద్ధిని బయటపెట్టింది. భారత బలగాలే ముందుగా దురాక్రమణకు పాల్పడటానికి ప్రయత్నించాయని ఆరోపించింది.
జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్, జాట్ రెజిమెంట్, సిక్కు లైట్ ఇన్ఫాంట్రీతో సహా మూడు వేర్వేరు బెటాలియన్లకు చెందిన దళాలు చైనా దురాక్రమణలను అడ్డుకున్నాయి. వాస్తవ నియంత్రణ రేఖపై యథాతథస్థితిని మార్చేందుకు చైనా సైనికులు ప్రయత్నిస్తున్న సమయంలో భారత బలగాలు ప్రతిఘటించాయి. క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణలు ఏర్పడ్డాయి. చైనా సైన్యం రాడ్లు, కర్రలతో భారత సైనికులపై దాడికి ప్రయత్నించారు. దీనిని భారత బలగాలు తిప్పికొట్టాయి. 2020 జూన్ లో గాల్వాల్ ఘర్షణల తర్వాత మళ్లీ మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!