USA: భారత్ ఒక ‘‘సూపర్ పవర్’’: అమెరికా రక్షణ మంత్రి..
- భారత్ శక్తివంతమైన దేశం,సైన్యాన్ని వేగంగా ఆధునీకరిస్తోంది.
- హిందూ మహాసముద్రంలో శక్తి సమతుల్యతకు భారత్ కీలకం
- భారత్తో కలిసి ఆయుధాల తయారీకి సిద్ధమన్న అమెరికా.
- అమెరికా రక్షణ మంత్రి హెగ్సేత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA: సింగపూర్లో జరుగుతున్న షాంగ్రి-లా డైలాగ్లో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ భారత్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఒక ‘‘శక్తివంతమైన దేశం’’ అని, భారత్ తన సైన్యాన్ని ఆధునీకీకరిస్తోందని అన్నారు. ఇదే సమయంలో గతేడాది జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాక్ మధ్య శాంతి నెలకొల్పడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృషి చేసినట్లు చెప్పారు. అయితే, పలు సందర్బాల్లో సిందూర్ ఆపే విషయంలో ఏ దేశం కూడా జోక్యం చేసుకోలేదని, పాక్ కాళ్ల బేరానికి రావడంతోనే నిలిపేశామని భారత ప్రభుత్వం ప్రకటించింది.
ప్రతీ ఏడాది సింగపూర్ వేదికగా ఈ సమావేశం జరుగుతుంది. ప్రపంచ దేశాలకు చెందిన రక్షణ మంత్రులు, ఉన్నత సైనికాధికారులు ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ ఏడాది ఈ కార్యక్రమంలో 44 దేశాలు పాల్గొన్నాయి. శనివారం అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ ప్రసంగిస్తూ కీలక విషయాలు వెల్లడించారు. ఇరాన్ యుద్ధాన్ని ఆపే విషయంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.
Also Read
- Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
- Antivenom: ఇక డోంట్ వర్నీ.. పామువిషానికి చెక్ పెట్టే సరికొత్త యాంటీవెనమ్ వచ్చేసింది!
- BRICS Summit 2026: బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీకి చేరుకున్న పుతిన్.. నేడు మోడీతో కీలక భేటీ
భారత్ తన సైన్యాన్ని ఆధునీకీకరిస్తోందని చెప్పడంతో పాటు, హిందూ మహాసముద్రంలో పవర్ బ్యాలెన్స్ను కాపాడటంలో సహాయపడుతుందని తెలిపారు. భారతదేశం తన భారీ, ముఖ్యమైన సైనిక అవసరాలను తీర్చడానికి సొంత కర్మాగారాలను, సరఫరా వ్యవస్థలను అభివృద్ధి చేసుకుంటోందని కూడా ఆయన పేర్కొన్నారు. భారతదేశంతో కలిసి సంయుక్తంగా ఆయుధాలు, సైనిక సామగ్రిని తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఆసియా ముఖ్యమైన ప్రాంతమని, ఈ ప్రాంతంపై ఒక్క దేశం ఆధిపత్యం చెలాయించడాన్ని కోరుకోవడం లేదని చైనాను గుర్తించి ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Bank Strike 2026: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. నేటి నుంచి వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్..
-
Indian 3: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ని శంకర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ?
-
Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
-
AP Collectors Conference Day 2: కలెక్టర్ల సదస్సు రెండో రోజు.. ఈ-గవర్నెన్స్ నుంచి భూ పరిపాలన వరకు కీలక చర్చలు
-
Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!