Sambhal violence: సంభాల్ అల్లర్లపై యోగీ సర్కార్ ఉక్కుపాదం.. 3000 పేజీల చార్జిషీట్..
- సంభాల్ అల్లర్లపై 3000 పేజీల చార్జిషీట్..
- హింసాకాండపై సీఎం యోగి ఉక్కుపాదం..
- షాహీ జామా మసీద్ సర్వే సమయంలో హింస..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sambhal violence: గతేడాది నవంబర్ నెలలో ఉత్తర్ ప్రదేశ్ లోని సంభాల్ పట్టణలో అల్లర్లు చెలరేగాయి. ఈ అలర్లకు కేరాఫ్గా ‘‘షాహీ జామా మసీదు’’ మారింది. ఈ అల్లర్లలో పాల్గొన్న వారిపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. యూపీ పోలీసులు మొత్తం 124 మంది నిందితులపై చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో 3000 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ చార్జిషీట్లో ఉన్నవారిలో కొందరు జైలులో ఉండగా, మరికొందర్ని పోలీసులు గుర్తించారు. హింసకు సంబంధించి రెండు పోలీస్ స్టేషన్లలో ఆరు కేసులు నమోదయ్యయాయి. వీటి ఆధారంగా సంభాల్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం చార్జిషీట్ సమర్పించింది. హింసకు సంబంధించి మొత్తం 7 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
ఈ మొత్తం అల్లర్ల కేసులో సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీ జియావుర్ రెహ్మాన్ బార్క్ ప్రాన నిందితుడివగా ఉన్నాడు. స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్ మొహమూద్ కొడుకు సోహల్ ఇక్బాల్తో పాటు మరో ఆరుగురు కీలకంగా ఉన్నారు. వీరే అధికారుపై హింసకు ప్రేరేపించారని, అశాంతిని రెచ్చగొట్టారని, జనాన్ని సమీకరించారనే ఆరోపణలు ఉన్నాయి. కేసులో ఇప్పటి వరకు 80 మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ప్రభుత్వం న్యాయవాది రాహుల్ దీక్షిత్ తెలిపారు. మరికొందరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
Read Also: Donald Trump: ‘‘గవర్నర్ ట్రూడో’’.. కెనడా ప్రధానిపై ట్రంప్ ఫైర్..
నవంబర్ 24 హింసకు నిందితులు ఎలా కుట్ర పన్నారనే వివరాలను పోలీసులు చార్జిషీట్లో పొందుపరిచారు. గత నెలలో, ఈ కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్ పోలీసులు ముల్లా అఫ్రోజ్ సహా 10 మందిని అరెస్టు చేశారు. అతను అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మరియు పాకిస్తాన్ నిఘా సంస్థ, ISI తో సంబంధం ఉన్న ముఠాలో సభ్యుడని తేలింది. ఈ కేసులో పోలీసులపై కాల్పులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నిందితుడు ఢిల్లీ సీలంపూర్లో ఉన్న సమయంలో పోలీసులు అరెస్ట్ చేసి, సంభాల్ తీసుకువచ్చారు.
షాహీ జామా మసీదుని, ప్రాచీన హిందూ ఆలయం హరిహర్ మందిరాన్ని కూల్చి కట్టారని కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సర్వే చేయాలని కోర్టు ఆదేశించడంతో నవంబర్ 24న అధికారులు మసీదు సర్వేకి వెళ్లే సమయంలో స్థానిక ముస్లిం గుంపు అధికారులపై దాడికి తెగబడింది. రాళ్లతో దాడులు చేశారు. అధికారుల విధులను అడ్డగించారు. వాహనాలకు నిప్పు పెట్టడంతో పాటు స్థానిక నివాసాలను ధ్వంసం చేశారు. అల్లరి మూకల కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మరణించారు. 30 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు.
తాజావార్తలు
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
-
IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..