UP By Election: అల్లరి మూకలకు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వార్నింగ్..
- ఉత్తరప్రదేశ్ లోని తొమ్మిది స్థానాలకు ఉప ఎన్నిక..
- యూపీలోని ఓటర్ల ఓటు వేసేందుకు భారీగా తరలి వస్తున్నారు..
- ఎన్నికల్లో ఎవరూ అల్లర్లకు పాల్పడకూడదు: ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP By Election: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ ఈరోజు నేటి (బుధవారం) ఉదయం నుంచి కొనసాగుతోంది. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటిన సమాజ్ వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామని గంపెడాశలు పెట్టుకుంది. తాజాగా పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఒక్క ఓటు కూడా వృథా కానప్పుడే సంపూర్ణ ఫలితాలు వస్తాయన్నారు. యూపీలోని ఓటర్లు తమ ఓటు హక్కును 100 శాతం వినియోగించుకునేందుకు తమ ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈసీ నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తుందని అనుకుంటున్నాం.. ఎన్నికల్లో ఎవరూ అల్లర్లకు పాల్పడకూడదని పేర్కొన్నారు. తమ కార్యకర్తలు అన్ని బూత్లను పరిశీలిస్తున్నారు.. అన్ని చోట్లా వీడియోగ్రఫీ కొనసాగుతుందన్నారు. ఇలాంటి వారికి ప్రజా చైతన్యమే హెచ్చరిక అని అఖిలేష్ యాదవ్ తెలిపారు.
Read Also: Deputy CM Pawan Kalyan: ఉద్ధానంలోనే కాదు రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో కిడ్నీ బాధితులు..
Also Read
- Sakshi Jha: సాక్షి ఝా 'మ్యాన్ హేటర్' వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Abhijeet Dipke: సోనమ్వాంగ్చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
ఇక, యూపీలోని మిరాపూర్, కుందర్కి, ఘజియాబాద్, ఖైర్ , కర్హల్, సిసామావు, ఫుల్పూర్, కతేహరి, మజ్వాన్ స్థానాలకు ఉప ఎన్నిక కొనసాగుతుంది. ఓటింగ్ ప్రక్రియ ఈరోజు సాయంత్రం 5గంటల వరకు కొనసాగుతుందని ఎలక్షన్ కమిషన్ పేర్కొనింది. బైపోల్ కోసం మొత్తం 1917 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీగా పారామిలటరీ బలగాలను మోహరించింది. ఉప ఎన్నికల్లో 18.46 లక్షల మంది పురుషులు, 15.88 లక్షల మందికి పైగా మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బైపోల్ ఫలితాలు నవంబర్ 23వ తేదీన వెలువడనున్నాయి.
वोट की प्रक्रिया को लेकर जो प्रयास ‘रात-दिन’ किया जा रहा है, उससे ये स्पष्ट हो गया है कि अब तो मतदाता दुगुने उत्साह से वोट डालनें जाएंगे।
परिणाम तभी निकलते हैं जब एक भी वोट न तो बँटता है, न घटता है। उप्र के जागरूक और साहसी मतदाता अपने वोट करने के उस अधिकार के लिए शत-प्रतिशत घर… pic.twitter.com/muqlzJ7Zsu
— Akhilesh Yadav (@yadavakhilesh) November 20, 2024
తాజావార్తలు
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?