Viral: సొంత ప్రభుత్వంపైనే ఉద్యమం.. వైన్ షాపుపై పేడతో దాడిచేసిన మాజీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ సీనియర్ నేత, ఫైర్ బ్రాండ్గా పేరున్న మాజీ సీఎం ఉమాభారతి సొంతపార్టీపైనే ఉద్యమాన్ని చేస్తున్నారు.. గత కొంత కాలంగా మద్యపాన నిషేధంపై పోరాటం చేస్తున్న ఆమె… తాజాగా, మధ్యప్రదేశ్లోని నివారీ జిల్లాలోని ఓర్చా పట్టణంలోని ఒక మద్యం షాపుపై ఆవు పేడను విసిరారు, బీజేపీ పాలిత రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం ఆమె డిమాండ్ చేశారు. మంగళవారం జరిగిన ఆ ఘటనకు సంబంధించిన వీడియోను ఉమాభారతి సోషల్ మీడియాలో పంచుకున్నారు.. మద్యం షాపు ఉన్న ప్రదేశం ఆమోదయోగ్యమైనది కాదు.. పవిత్ర పట్టణమైన ఓర్చాలో ఇలాంటి దుకాణాన్ని తెరవడం నేరం అని పేర్కొన్నారు.
Read Also: Vizag: ఆర్కే బీచ్ రోడ్డులో కారు బీభత్సం
Also Read
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
రాష్ట్ర రాజధాని భోపాల్కు 330 కి.మీ దూరంలో ఉన్న రామరాజ ఆలయానికి ప్రసిద్ధి చెందింది ఓర్చా.. ఇక్కడ మంగళవారం సాయంత్రం ఉమాభారతి మద్యం షాపుపై ఆవు పేడ విసురుతున్న వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారింది.. ఆ క్లిప్లో ఉమాభారతి వీడియో షూట్ చేస్తున్న వ్యక్తితో.. చూడండి, నేను ఆవు పేడను విసిరాను.. రాళ్లు వేయలేదు అని చెబుతున్నారు. కాగా, ఈ ఏడాది మార్చిలో ఉమాభారతి.. భోపాల్లోని ఓ మద్యం దుకాణంపై రాయి విసిరిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి వరుస ట్వీట్లలో.. ఓర్చా ప్రధాన ద్వారం వద్ద ఉన్న మద్యం దుకాణం ఉన్న ప్రాంతం ఆమోదించబడలేదు, కానీ, సుదూర గ్రామానికి ఆమోదించబడింది. ప్రజలు మరియు మా సంస్థ సభ్యులు దీనికి వ్యతిరేకంగా నిరంతరం నిరసనలు వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
మరో ట్వీట్లో, ప్రజలు ప్రభుత్వానికి మెమోరాండంలు సమర్పించారని.. ఈ దుకాణాన్ని తొలగించాలని పాలకులకు పదే పదే విజ్ఞప్తి చేశారని, ఎందుకంటే ఈ పవిత్ర నగరం యొక్క నుదిటిపై ఇది పెద్ద కళంకంగా పేర్కొన్నారు ఉమాభారతి. అన్ని విధాలుగా, ఈ దుకాణానికి వ్యతిరేకంగా ప్రజల ప్రతిస్పందనను నేరంగా పేర్కొనలేం, ఎందుకంటే ఇక్కడ (మతపరమైన స్థలంలో) మద్యం దుకాణాన్ని తెరవడం పెద్ద నేరం అన్నారు. ఓర్చాలో నిర్వహించిన ‘దీపోత్సవ్’ కార్యక్రమంలో రామనవమి నాడు ఐదు లక్షల దీపాలను వెలిగించినప్పుడు ఈ దుకాణం తెరిచి ఉందని తనకు సమాచారం వచ్చిందని గుర్తుచేశారు.. ఇది అయోధ్య వలె పవిత్రంగా పరిగణించబడుతుంది.. అందుకే నేను ఒక పవిత్రమైన గోశాల నుండి కొంత ఆవు పేడను మద్యం దుకాణంపై విసిరినట్టు పేర్కొన్నారు ఉమాభారతి.
6. शराबबंदी राजनीतिक नहीं सामाजिक अभियान है। समाज की शक्ति और एकता से ही इसका समाधान होगा, किंतु ओरछा के दरवाजे पर रामराजा सरकार के दर्शन के लिए आते और जाते हुए यह शराब की दुकान हमारी रामभक्ति को चुनौती दे रही है। pic.twitter.com/2Y7vlRuBLn
— Uma Bharti (@umasribharti) June 14, 2022
తాజావార్తలు
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!