Ukraine-India: ఉక్రెయిన్ లో ఇండియా ఎంబసీ తిరిగి ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా- ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల మధ్య రాజధాని కీవ్ లో మూతపడిన భారత రాయబార కార్యాలయం తిరిగి ప్రారంభం కానుంది. రష్యా దాడి తీవ్రమవుతున్న సమయంలో భారత రాయబార కార్యాలయాన్ని మార్చి 13 పోలాండ్ లోని వార్సాకు తరలించారు. తాజాగా మే 17 నుంచి కీవ్ లో ఎంబసీని తెరవనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఉక్రెయిన్ నుంచి పనిచేసేందుకు వివిధ పాశ్చాత్య దేశాలు సమాయత్తం అవుతున్న వేళ భారత్ కూడా తన ఎంబసీని ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. రష్యా దాడి కారణంగా కీవ్ చాలా వరకు ధ్వంసం అయింది. అయితే భారత్ తన మిషన్లను ప్రారంభించేందుకు కీవ్ నుంచి ఎంబసీ కార్యక్రమాలు నిర్వహించనుంది.
Also Read
- PM Modi: ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’.. GDPపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
- PM Modi: ఎస్ఆర్సీసీ నుంచి బయటకొచ్చినోళ్లు గొప్పోళ్లు కాకపోవచ్చు.. కానీ..!
- Kangana Ranaut: అధికారులపై కంగనా రనౌత్ రుసరుసలు.. ఏం చేశారంటే..!
- Ketan Agrawal Case: కేతన్ అగర్వాల్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతన్, సియాల తర్వాత మరొకరి అరెస్ట్..
యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల కోసం మోదీ ప్రభుత్వం ఫిబ్రవరి 26న ‘ ఆపరేషన్ గంగా’ను ప్రారంభించింది. దాదాపుగా 20 వేల మంది భారతీయులను ప్రభుత్వం ప్రైవేటు విమానాలు, ఇండియన్ ఏయిర్ ఫోర్స్ విమానాల ద్వారా స్వదేశానికి చేర్చారు. పోలాండ్, చెక్ రిపబ్లిక్, రొమానియా దేశాల మీదుగా భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తిరిగి తీసుకువచ్చారు. అయితే కేవలం ఒకే భారతీయుడు, కర్ణాటకకు చెందిన మెడికల్ విద్యార్థి మాత్రమే మరణించారు.
ఇదిలా ఉంటే గత రెండు నెలలుగా రష్యా, ఉక్రెయిన్ పై దాడులు చేస్తోంది. దాదాపుగా కొన్ని వారాలు ప్రయత్నించినా.. రాజధాని కీవ్ ను రష్యన్ బలగాలు స్వాధీనం చేసుకోలేకపోయాయి. దీంతో రష్యా అనేక భవనాలపై రాకెట్లతో విరుచుకుపడింది. కీవ్ తో పాటు మరో కీలక నగరం ఖార్కీవ్, ఎల్వీవ్, సుమీ, మరియోపోల్ వంటి నగరాలను రష్యా దారుణంగా దెబ్బతీసింది.
- Tags
- embassy reopen
- india
- Kyiv
- Russia
- Ukraine
తాజావార్తలు
-
Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
INDW Vs PAKW: కుప్పకూలిన పాకిస్థాన్.. 55 పరుగులకే ఆలౌట్..
-
PM Modi: ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’.. GDPపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : సిరిసిల్ల, సిద్దిపేట గడ్డమీద మూడు రంగుల జెండా ఎగరేస్తాం
-
HYDRAA : గణేష్ నిమజ్జనాలపై ఫేక్ ప్రచారం.. రంగనాథ్ క్లారిటీ..!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!