Ukraine-India: ఉక్రెయిన్ లో ఇండియా ఎంబసీ తిరిగి ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా- ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల మధ్య రాజధాని కీవ్ లో మూతపడిన భారత రాయబార కార్యాలయం తిరిగి ప్రారంభం కానుంది. రష్యా దాడి తీవ్రమవుతున్న సమయంలో భారత రాయబార కార్యాలయాన్ని మార్చి 13 పోలాండ్ లోని వార్సాకు తరలించారు. తాజాగా మే 17 నుంచి కీవ్ లో ఎంబసీని తెరవనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఉక్రెయిన్ నుంచి పనిచేసేందుకు వివిధ పాశ్చాత్య దేశాలు సమాయత్తం అవుతున్న వేళ భారత్ కూడా తన ఎంబసీని ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. రష్యా దాడి కారణంగా కీవ్ చాలా వరకు ధ్వంసం అయింది. అయితే భారత్ తన మిషన్లను ప్రారంభించేందుకు కీవ్ నుంచి ఎంబసీ కార్యక్రమాలు నిర్వహించనుంది.
Also Read
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల కోసం మోదీ ప్రభుత్వం ఫిబ్రవరి 26న ‘ ఆపరేషన్ గంగా’ను ప్రారంభించింది. దాదాపుగా 20 వేల మంది భారతీయులను ప్రభుత్వం ప్రైవేటు విమానాలు, ఇండియన్ ఏయిర్ ఫోర్స్ విమానాల ద్వారా స్వదేశానికి చేర్చారు. పోలాండ్, చెక్ రిపబ్లిక్, రొమానియా దేశాల మీదుగా భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తిరిగి తీసుకువచ్చారు. అయితే కేవలం ఒకే భారతీయుడు, కర్ణాటకకు చెందిన మెడికల్ విద్యార్థి మాత్రమే మరణించారు.
ఇదిలా ఉంటే గత రెండు నెలలుగా రష్యా, ఉక్రెయిన్ పై దాడులు చేస్తోంది. దాదాపుగా కొన్ని వారాలు ప్రయత్నించినా.. రాజధాని కీవ్ ను రష్యన్ బలగాలు స్వాధీనం చేసుకోలేకపోయాయి. దీంతో రష్యా అనేక భవనాలపై రాకెట్లతో విరుచుకుపడింది. కీవ్ తో పాటు మరో కీలక నగరం ఖార్కీవ్, ఎల్వీవ్, సుమీ, మరియోపోల్ వంటి నగరాలను రష్యా దారుణంగా దెబ్బతీసింది.
- Tags
- embassy reopen
- india
- Kyiv
- Russia
- Ukraine
తాజావార్తలు
-
Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
-
Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
-
Dipu Chandra Das: దీపును చంపిన రాక్షసుడు దొరికాడు.. ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
-
CM Chandrababu : మార్కాపురం జిల్లా హామీని నిలబెట్టుకున్నాం.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటు
-
Naga Bandham: 110 కోట్ల రిస్క్.. అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్లోనే అసలు రహస్యం!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!