Uddhav Thackeray: బీజేపీ ‘పవర్ జిహాద్’’ చేస్తుంది.. ‘‘సౌగత్ ఏ మోడీ’’ స్కీమ్పై విమర్శలు..
- బీజేపీ ‘పవర్ జిహాద్’ చేస్తోంది..
- సౌగత్-ఏ-మోడీ పథకంపై ఠాక్రే విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే బీజేపీని విమర్శించారు. బీజేపీ కొత్తగా ప్రారంభించిన ‘‘సౌగత్-ఏ-మోడీ’’ పథకంపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ హిందుత్వాన్ని వదిలిపెట్టి సత్తా జిహాద్(పవర్ జిహాద్)ని ఆశ్రయించిందని ఆరోపించారు. బీజేపీ పథకాన్ని ఠాక్రే ‘‘’సౌగత్-ఎ-సత్తా (అధికార బహుమతి)’’గా అభివర్ణించారు. బీహార్లో ఎన్నికల ప్రయోజనం కోసం బీజేపీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
బీజేపీ హిందుత్వాన్ని వదిలిపెట్టినట్లు ప్రకటించాలని, బుల్డోజర్ల ద్వారా ఇళ్లు కూల్చేసేసిన వారికి, మత అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన చాలా మందికి వారు అధికారం కోసం బహుమతులు పంచుతున్నారని, ఇది బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసమే అని, బీజేపీ సత్తా జిహాద్ని ఆశ్రయించిందని ఠాక్రే విమర్శించారు.
Also Read
- Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
Read Also: Zelenskyy: ‘‘త్వరలో పుతిన్ చనిపోతారు’’.. జెలెన్స్కీ సంచలన ప్రకటన..
రంజాన్కి ముందు ఆర్థికంగా వెనకబడిన ముస్లిం కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ మంగళవారం దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు వ్యూహాత్మకంగా ముస్లింలకు ప్రత్యేక పండగ కిట్లను పంపిణీ చేస్తోంది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నేతృత్వంలో ఢిల్లీలోని నిజాముద్దీన్లో ఈ పథకం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా దాదాపుగా 32 లక్షల మందికి దీని వల్ల ప్రయోజనం చేకూరుతుంది. ఈద్ కిట్లలో డ్రైఫ్రూట్స్, శనిగపిండి, రవ్వ, వెర్మిసెల్లి, చక్కెర వంటి ఆహార పదార్థాలు ఉన్నాయి. పురుషుల కోసం కుర్తా పైజామా, మహిళల డ్రెస్ కోసం మెటీరియల్ అందిస్తున్నారు. ప్రతీ కిట్ కూడా రూ. 500-రూ.600 వరకు ఉంటుంది.
అయితే, ఈ పథకంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి షామా మహ్మద్ ఈ కార్యక్రమాన్ని ‘‘కపట నాటకం’’గా అభివర్ణించారు. ముస్లిం సమాజాన్ని రాక్షసంగా చిత్రీకరించి , ఇళ్లు నేలమట్టం చేసి ఇప్పుడు గిఫ్ట్లు ఇస్తోందని విమర్శించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా బీజేపీ చర్యని రాజకీయ చర్యగా పిలిచారు. టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ దీనిని ‘‘జోక్ ఆఫ్ ది డే’’గా అన్నారు.
తాజావార్తలు
-
Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
-
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!