Uddhav Thackeray: బీజేపీ ‘పవర్ జిహాద్’’ చేస్తుంది.. ‘‘సౌగత్ ఏ మోడీ’’ స్కీమ్పై విమర్శలు..
- బీజేపీ ‘పవర్ జిహాద్’ చేస్తోంది..
- సౌగత్-ఏ-మోడీ పథకంపై ఠాక్రే విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే బీజేపీని విమర్శించారు. బీజేపీ కొత్తగా ప్రారంభించిన ‘‘సౌగత్-ఏ-మోడీ’’ పథకంపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ హిందుత్వాన్ని వదిలిపెట్టి సత్తా జిహాద్(పవర్ జిహాద్)ని ఆశ్రయించిందని ఆరోపించారు. బీజేపీ పథకాన్ని ఠాక్రే ‘‘’సౌగత్-ఎ-సత్తా (అధికార బహుమతి)’’గా అభివర్ణించారు. బీహార్లో ఎన్నికల ప్రయోజనం కోసం బీజేపీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
బీజేపీ హిందుత్వాన్ని వదిలిపెట్టినట్లు ప్రకటించాలని, బుల్డోజర్ల ద్వారా ఇళ్లు కూల్చేసేసిన వారికి, మత అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన చాలా మందికి వారు అధికారం కోసం బహుమతులు పంచుతున్నారని, ఇది బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసమే అని, బీజేపీ సత్తా జిహాద్ని ఆశ్రయించిందని ఠాక్రే విమర్శించారు.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
Read Also: Zelenskyy: ‘‘త్వరలో పుతిన్ చనిపోతారు’’.. జెలెన్స్కీ సంచలన ప్రకటన..
రంజాన్కి ముందు ఆర్థికంగా వెనకబడిన ముస్లిం కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ మంగళవారం దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు వ్యూహాత్మకంగా ముస్లింలకు ప్రత్యేక పండగ కిట్లను పంపిణీ చేస్తోంది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నేతృత్వంలో ఢిల్లీలోని నిజాముద్దీన్లో ఈ పథకం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా దాదాపుగా 32 లక్షల మందికి దీని వల్ల ప్రయోజనం చేకూరుతుంది. ఈద్ కిట్లలో డ్రైఫ్రూట్స్, శనిగపిండి, రవ్వ, వెర్మిసెల్లి, చక్కెర వంటి ఆహార పదార్థాలు ఉన్నాయి. పురుషుల కోసం కుర్తా పైజామా, మహిళల డ్రెస్ కోసం మెటీరియల్ అందిస్తున్నారు. ప్రతీ కిట్ కూడా రూ. 500-రూ.600 వరకు ఉంటుంది.
అయితే, ఈ పథకంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి షామా మహ్మద్ ఈ కార్యక్రమాన్ని ‘‘కపట నాటకం’’గా అభివర్ణించారు. ముస్లిం సమాజాన్ని రాక్షసంగా చిత్రీకరించి , ఇళ్లు నేలమట్టం చేసి ఇప్పుడు గిఫ్ట్లు ఇస్తోందని విమర్శించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా బీజేపీ చర్యని రాజకీయ చర్యగా పిలిచారు. టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ దీనిని ‘‘జోక్ ఆఫ్ ది డే’’గా అన్నారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!