Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
- వరకట్న దాహానికి తెలుగు హీరోయిన్ బలి
- భోపాల్లోని అత్తారింట్లో శవమై కనిపించిన ట్విషా శర్మ
- భర్త, అత్తమామలపై కేసు నమోదు
- న్యాయం కోసం బాధిత కుటంబం డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మహిళలపై వేధింపులు ఆగడం లేదు. ప్రస్తుతం సమాజం టెక్నాలజీలో దూసుకెళ్లిపోతున్నా.. మనుషుల్లో మాత్రం క్రూరత్వం పోవడం లేదు. తాజాగా వరకట్న వేధింపులకు ఓ తెలుగు హీరోయిన్ బలైపోయింది. ప్రస్తుతం ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Also Read
- West Bengal: బెంగాల్లో మదర్సా శాఖ మతపర పథకాలకు బ్రేక్.. సువేందు సర్కార్ కీలక నిర్ణయం
- DMK: సీఎం విజయ్ ప్రభుత్వం 6 నెలల్లోపే కూలిపోతుంది..
- CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
- GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
ట్విషా శర్మ.. తెలుగు హీరోయిన్. అంతేకాదు మాజీ మిస్ పూణె. మోడలింగ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు సినిమాతో పాటు పలు ప్రాంతీయ చిత్రాల్లో నటించింది. కానీ జీవితం వరకట్న పిశాచికి బలైపోతుందని ఊహించలేకపోయింది. భర్త, అత్తమామల వరకట్న వేధింపులకు ట్విషా శర్మ ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
నోయిడాలో నివాసం ఉంటు ట్విషా శర్మకు… 2025 డిసెంబర్ 9న మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన క్రిమినల్ లాయర్ సమర్థ్సింగ్తో ఢిల్లీలో గ్రాండ్గా వివాహం జరిగింది. పెళ్లైన దగ్గర నుంచి కూడా వేధింపులకు గురవుతూనే ఉంది. ఈ నెల 12న భోపాల్లోని అత్తగారింట్లో ట్విషా శర్మ విగతజీవిగా కనిపించింది.
సమాచారం తెలుసుకున్న బాధిత కుటుంబం తల్లడిల్లిపోయింది. తమ కుమార్తెను అన్యాయంగా అత్తమామలు చంపేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా ట్విషా శర్మ తన తల్లితో వాట్సాప్లో చాట్ చేసిన సంభాషణ వెలుగులోకి వచ్చింది. భర్త సమర్థ్సింగ్, కుటుంబ సభ్యులు నిత్యం వేధిస్తున్నారని వాపోయింది. భర్త, అత్తమామలు నిరంతరం మానసిక వేధింపులు, శారీరక హింసకు గురి చేశారని తల్లడిల్లింది. మరణానికి ముందు మే 7న జరిగిన చాట్ వెలుగులోకి వచ్చింది. ఇక ట్విషా శర్మ వాట్సాప్ చాట్ వెలుగులోకి రావడంతో.. తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి నివాసం ఎదుట నిరసనకు దిగింది. తమ కుమార్తెను చంపేసి.. ఉరివేసుకున్నట్లుగా చిత్రీకరించారని ఆరోపించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులపై కేసు నమోదు చేశారు.
ఈ కేసును విచారించేందుకు మధ్యప్రదేశ్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేశారు. ట్విషా మృతి ఆత్మహత్యా? లేక హత్యా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇక పోస్ట్మార్టం రిపోర్ట్ను తిరిగి పరీక్షించాలని ఢిల్లీ ఎయిమ్స్కు పోలీసులు పంపించారు.
తాజావార్తలు
-
Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
-
Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
-
Peddi Trailer Review: పెద్ది గుళ్ళో దేవుడు కాదు, గ్రౌండ్’లో దేవుడు.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Chiru – Bobby Movie: ‘చిరు 158’లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన ‘జైలర్’ డీవోపీ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..